ఓం కాల కంఠాయ నమః
కాలము అంటే విషము అని కూడా అర్ధము. విషమును కంఠంలో పెట్టుకోవడం వల్ల ఈశ్వరుడిని కాల కంఠుడు అన్నారు. గరళకంఠుడన్నా, నీలకంఠుడన్నా, కాల కంఠుడన్నా ఈశ్వరుడే. అసలు మృత్యువు విష రూపంలో మానవులను పట్టుకుంటే, అంతటి మృత్యువును కూడా కంఠంలో అదుపులో పెట్టుకున్నాడు అని ఒక అర్థము. కాలమునే కంఠములో పెట్టుకున్న వాడు అని ఒక అర్థం. దీనికి బహుళ అర్థములు ఉన్నాయి, ఆ వ్యాఖ్యానములు అన్నీ ఇన్నీ కావు, అంతటి అత్యద్భుతమైన నామము ఇది.
ఈ నామమును అనేక కోణములలో ఉపయోగించుకోవచ్చు. విషానికి విరుగుడుగా ఉపయోగించుకుందాం.
మంత్ర ప్రయోగం ౼ ఫలితం:
దీనిని ఎలా ప్రయోగించాలో తెలుసుకుందాము. ఆత్మహత్యలకు పూనుకున్న వారు కానీ, లేదా విషాహారం తిని ప్రాణాలు కోల్పోయేలా ఉన్నవారు ఈ మంత్రజపము చేస్తే గండం గడిచి సుఖముగా ఉంటారు అని శాస్త్రము చెబుతున్నది.
మృత్యువు ఎలా ఉంటుందో తెలుసా, నిత్యం సన్నిహితో మృత్యుః. నిత్యము మృత్యువు మన పక్కనే ఉంటుంది. అందువల్ల ప్రతి రోజూ నిద్రలేచాక, స్నానము చేసి, నిత్యపూజలు చేసుకున్న తరువాత ఒక మారేడు ఆకును కానీ లేదా ఒక తులసి ఆకును కాని చేతిలో పట్టుకుని ఓం కాల కంఠాయనమః ఓం కాల కంఠాయనమః అని 11 సార్లు కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ (కనీసం 11 సార్లు) జపము చేసి ఈ తులసీదళమును గాని మారేడు ఆకును కానీ ఇంటిలో ఉన్న శివుడి పటము కాని లింగం మీద కాని పెట్టి వేయండి. ఈ ఆకుని ఇలా పెట్టేసి బయలుదేరి వెళితే విషాహారం వలన వచ్చే గండము రాదు లేదా బల్లులు మొదలైనవి పడటం వలన వచ్చే గండము రాదు.
ఒకవేళ రోజూ చేయలేకపోయినా, పొరపాటున ఈ విషము తిన్న వాడు ఎవడో ఉన్నాడు, వాడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లే లోపు వాడు బతుకుతాడో లేదో తెలియదు, అలాంటి వాడిని ఉద్దేశించి వాడి గోత్రం, నక్షత్రం ఒకవేళ నక్షత్రం తెలియకపోతే గోత్రం తెలుసుకోండి, ఒక్కొక్కసారి ఆ వ్యక్తి ఎవరో తెలియదు అనుకోండి అలాంటప్పుడు గోత్రం ఏమి చెప్తాడు వాడు అలాంటి వాడి పేరు కూడా తెలియకపోతే అలాంటప్పుడు వాడి శిరస్సు మీద చేయి పెట్టి ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించమన్నారు. వైద్యం కూడా వికటించకుండా ఫలించి ఆరోగ్యవంతుడై బాగుపడతాడు.
ఎంతో మంది మీద ఇది ప్రయోగించి చెబుతున్న విషయము. ప్రయోగంలో ఒక వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొని వెళ్లే లోపు వాడు చచ్చిపోతాడు అని చెప్పేశారు అలాంటి వ్యక్తిని తలుచుకొని వాడి కోసము ఈ జపాన్ని చేస్తే, వాడు ఆసుపత్రికి వెళ్లడం ఆ మందు ఫలించి వాడు సుఖముగా బ్రతకడం చూసాము. కాబట్టి భయంకరమైన కాలకూట విషమునకు కూడా ఇది విరుగుడు.
ఒక్కొక్కసారి మరీ విచిత్రమైన ఆహారాలు తిని చచ్చి పోతున్నాడు అనుకున్న వాడికి ఏమి చేస్తారు అంటే ఒక గ్లాసులో కొన్ని నీళ్ళు పోయండి, అందులో ఒక తులసి ఆకు వేయండి, గ్లాస్ మీద చేయి పెట్టండి అలా గ్లాస్ మీద చెయ్యి పెట్టి ఓం కాల కంఠాయ నమః ఓం కాల కంఠాయ నమః అని మీ వీలునుబట్టి అవతల వాడి గండం సమయాన్ని బట్టి జపము చేసి ఈ గ్లాస్ లో ఉన్న నీటిని ఆకు తో సహా వాడి నోటిలో పోయండి, నోరు తెరవలేని పరిస్థితిలో ఉంటే ఆకును నలిపి కొంచెం నీటిని నోటిలో పోయండి. అప్పుడు వాడు మృత్యు గండము నుంచి బయటపడతాడు ఆరోగ్యంగా లేచి కూర్చుంటాడు.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org/
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.