Pages

Thursday, February 18, 2021

గురు వ్యాఖ్యానం -21




ఓం కురువింద మణి శ్రేణీ కనత్కోటీర మండితాయై నమః


కోటీరము అంటే కిరీటము అని అర్థము.దేవతలు, మహారాజులు సింహాసనము మీద కూర్చుని ప్రజలను రక్షించేటప్పుడు ప్రజా పాలన చేసేటప్పుడు కిరీటాలు ధారణ చేస్తారు, దానిని కోటీరం లేదా మకుటం లేదా ముకుటం అంటారు.


కిరీట ధారణ లేకపోతే వాడిని ఎవరూ ప్రభువుగా ఒప్పుకొనే వారు కాదన్నమాట పూర్వము.పూర్వ కాలములో ఈ కిరీటాలలో అమూల్యమైన మణులు ఉండేవన్నమాట. వీటిని అనర్ఘ రత్న మణులు అనేవాళ్ళు. అమ్మవారి కిరీటానికి కురువింద మణులు ఉన్నాయి, అంటే ఎర్రగా కెంపులు లాగా ఉండే మణులు. ఈ కురువింద మణులకు ఒక లక్షణము ఉన్నది.

కామాను రాగః కురువింద జేషు అని అంటాడన్నమాట శ్రీకృష్ణుడు హరివంశములో.అంటే కామాన్ని, అనురాగాన్ని పెంచుతాయి, ప్రేమను పెంచేవి ఇవే, కోర్కెలను పెంచేవి ఇవే.

పూర్వం స్త్రీ పురుషులు దాంపత్యం కోసం ఈ కురువింద మణులను ధరించేవారని అలాగే సంతానము మీద ప్రేమతో వారిని ఆదరించడం కోసం కూడా ఈ కురువింద మణులనే ధరించేవారని చెప్పేవారు.

 ఏది ఏమైనా మొత్తానికి కామానురాగాన్ని పెంపొందింప జేసే లక్షణము ఈ కురువింద మణులకు ఉన్నది.

అమ్మవారి కిరీటం మీద ఎందుకు ఈ మణులను ధరిస్తుంది అంటే ఆవిడను చూడగానే అందరికీ భక్తి , ప్రేమ కలగాలన్న మాట మా అమ్మ, మా తల్లి అని అనురాగంతో అమ్మ పాదాలు పట్టుకుంటారు అటువంటి మణులు అవి. ఈ మణుల వల్ల హరిభక్తి కూడా పెరుగుతుంది, హరిభక్తి వల్ల మోక్షం కరతలామలకం అవుతుంది. మోక్షమును హరిభక్తిని పెంపొందించుకోవడం వలన ఇస్తాను అని చెప్పడానికే అమ్మ ఈ మణులను పెట్టుకున్నది.

కాబట్టి ఈ మణులను ధరించడంలో అమ్మ వారి యొక్క ప్రధాన ఉద్దేశ్యము నేను ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పడమే.


*మంత్ర ప్రయోగము ౼  ఫలితము:*

1) కోరికలు లేకుండా అనునిత్యము యథాశక్తిగా ఓపికను బట్టి పది సార్లో  లేక 11 సార్లో ఎంతోకొంత జపం చేసే వారికి మోక్షమును ఇస్తుంది ఆవిడ.

2) నిత్యము తొమ్మిది సార్లు దీనిని జపము చేస్తే పదిమందిలో గుర్తింపు వస్తుంది.

సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని దీవెనలు ఇస్తాము వేదమంత్రములతో మనము, అంటే నీ సాటి వారిలో నువ్వు గొప్పవాడిగా అందరితో కీర్తింపబడుదువు గాక.

మనవాళ్లలో పండితులలో మనకే ఎక్కువ గుర్తింపు రావాలి, అలా రావాలి అంటే ఈ మంత్రమును నిత్యం 9 సార్లు జపించాలి అన్నారు.

3) ఉద్యోగాలలో ప్రమోషన్ల కోసము 27 రోజుల పాటు నిత్యము దీనిని జపం చేసి ఆవుపాలను నైవేద్యంగా పెట్టి ఆ పాలను తీర్థంగా తీసుకుంటే పదోన్నతులు వస్తాయి.

4) అన్నిటికంటే కురువింద మణులు కుజగ్రహానికి చాలా ఇష్టం, కుజ జపం చేయడం వలన ఋణ విముక్తి అవుతుంది, కుజుడు సరిగా చూడకపోతే అప్పులపాలై పోతారు, కాబట్టి కుజ అనుగ్రహము పొంది అప్పులపాలు కాకుండా ఋణ విముక్తి పొంది సంపదలు పొందాలనుకున్న వాళ్ళు ప్రతి మంగళవారం ఉదయం పూట 108 సార్లు ఈ మంత్రాన్ని అనుష్ఠానము చేయటం మంచిది.

5) కుజ దోషము అని ఒక దోషము వున్నది, ఈ దోషమును అనేక రకములుగా తొలగించుకోవచ్చు. అందులో ఒక సులభ మార్గం ఏమిటంటే ప్రతి మంగళవారం 27 సార్లు ఈ మంత్రాన్ని కొంతకాలము జపం చేయటం ద్వారా సులభముగా కుజదోషము తొలగించుకోవచ్చు. దాని కోసం కష్టపడి జపాలు చేయించుకోలేక అందులో నుంచి బయటపడలేక పోతున్నాము అనుకున్న వాళ్లు, కుజ దోషం వల్ల పెళ్లి కాకుండా బాధపడుతున్న వాళ్లు ఈ మంత్రాన్ని మంగళవారంనాడు ఇరవై ఏడు (27) సార్లు పారాయణ చేస్తే ఆ దోషము కూడా తొలగిపోతుంది.

6) ఈ మంత్ర అనుష్ఠానముతో 108 సార్లు ప్రతి మంగళవారం అమ్మవారికి ప్రదక్షిణ చేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.

7) కురువింద మణులు అటు అమ్మవారికి, కుజుడికి అందరికీ ఇష్టం కనుక ఈ మణులను ఉంగరములో వేలికి ధరించడం కూడా మంచిది.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...