Pages

Thursday, February 18, 2021

గురు వ్యాఖ్యానం -20






ఓం కిరి చక్ర రథారూఢ దండనాధా పురస్కృతాయై నమః


అమ్మవారి దగ్గర దండనాధా అని ఒక దేవత ఉన్నది. యుద్ధంలో సైన్యాన్ని నడిపే సేనా నాయకులలో ఒకావిడన్నమాట.

 కొందరు ఆవిడను నకులి అని కూడా అంటారు.

 ఈ దండనాధ అనే దేవత కిరి చక్రము అనే ఒక రథం ఎక్కి అమ్మవారికి సాయంగా వెళ్ళింది.

కిరి అంటే కిరణము.

 ఆ రథము దగ దగా వెలిగిపోతూ ఉంటుంది కాబట్టి దానికి కిరిచక్ర రథము అని పేరు వచ్చింది అని బ్రహ్మాండ పురాణము చెబుతున్నది.

కిరి అంటే పంది అని కూడా ఒక అర్ధము.

అందుకే భాగవతములో 


ప|| కిరియై ధర ఎత్తిన హరి 

కరి సరసిజ ముకులమెత్తు  గతి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరి ఎత్తెన్ చక్కనొక్క కేలన్ లీలన్ ||


వరాహ అవతారంలో భూమిని పైకెత్తినటువంటి విష్ణువు, ఆ భూమి మీద ఉన్న ఒక కొండను ఎత్తడం ఒక లెక్కా అన్నట్లుగా కుడి చేత్తో దానిని పైకెత్తాడు.

అక్కడ చెప్పారు కిరి అంటే పంది అని.

 కిరి చక్రము అంటే వరాహములతో లాగ బడుతున్న రథం. అంటే దానిని పందులు ఈడుస్తున్నాయి అన్నమాట. అత్యద్భుతమైన యజ్ఞాంగములు అంటారు వాటిని.

శ్రీమన్నారాయణుడు వరాహ అవతారం ఎత్తితే ఆయన శరీరం మీద ఉన్న వెంట్రుకలు యజ్ఞములలో ఉపయోగించే స్రుక్కు, సృవలు, పూర్ణాహుతి సామగ్రి వంటి పవిత్రమైన వస్తువులు.

 ఆ రూపాన్ని చూస్తేనే శరీరము గగుర్పాటుకు గురవుతుంది. అటువంటివీ ఆయన అవయవాలు అందుకని యజ్ఞవరాహ మూర్తి అంటారు.

అమ్మ వారి రథం కిరి చక్ర రథం, దానిని లాగుతున్నవి కూడా మహా వరహాలు, దివ్య వరహాలు, శ్వేతవరాహ లు, పవిత్ర వరహాలు. ఆ వరాహాలు కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంటాయి. అటువంటి వరాహము లతో లాగ బడుతున్న రథము కనుక దీన్ని కిరిచక్ర రథం అన్నారు. అది ఎక్కి దండనాధ అనే దేవత యుద్ధరంగానికి వెళుతున్నది.

ఇందులోనే ఒక గొప్ప అంతరార్థము ఉన్నది.

కిరిచక్ర రథము అనేది ఏమి చేస్తుంది అంటే భూమిని ఉద్ధరిస్తుంది.

భూమిని ఉద్ధరించడం అనగా మనలో ఉన్న సౌకుమార్యమును పెంచుతున్నది.


మంత్ర ప్రయోగం  ౼ ఫలితం


 1) మన శరీరమే భూ మయము కనుక

ఎవరైనా చర్మ రోగములతో పీడింపబడుతూ ఉంటే నిత్యము 27 సార్లు 

ఓం కిరి చక్ర రథారూఢ దండనాధా పురస్కృతాయై నమః

 అనే మంత్రాన్ని చర్మమును తడుముకుంటూ ఉచ్చారణ చేస్తే చర్మమునకు సంబంధించిన రోగములు తగ్గుతాయి, దురదలు వంటివి పోతాయి.



2) మన భూములను ఎవరైనా ఆక్రమించుకుంటే ఈ మంత్రమును విడిచిపెట్టకుండా నలభై ఒక్క (41) రోజుల పాటు లలితాదేవి పటం పెట్టుకొని పత్రితో పూజ చేస్తూ ఈ నామ ఉచ్చారణ చెయ్యాలి. పత్రి అంటే మారేడు ఆకులు, తామరాకులు, తులసి ఆకులు, గరిక, వినాయక చవితికి మనము ఏమేమి వాడుతామో ఆ పత్రములు అన్ని తీసుకోండి ఒక్కొక్క ఆకు తీసుకోవడం ఓం కిరి చక్ర రథారూఢ దండనాధా పురస్కృతాయై నమః

 అనడం లలితా దేవి పటం దగ్గర ఆకు పెట్టడం ఇలా 108 పర్యాయాలు చదవాలి, 108 ఆకులతో పూజించాలి, చివరన కొబ్బరికాయ కొట్టాలి, అరటి పళ్ళు నైవేద్యంగా పెట్టాలి.

ఈ విధముగా నలభై ఒక్క రోజుల పాటు కొబ్బరికాయ కొట్టాలి, అరటి పళ్ళు నివేదన చెయ్యాలి, 108 పర్యాయాలు చదవాలి, 108 ఆకులతో పూజించాలి. ఈ ప్రసాదమును అందరికీ పంచి పెట్టేయండి.

 ఒకవేళ కేసు ఇంకా తీవ్రంగా ఉంటే 1008 సార్లు జపం చేయండి 1008 ఆకులతో పూజించండి.

 భూములకు సంబంధించిన వ్యాజ్యములు అన్నీ పరిష్కారమై పోతాయి, వాడు తప్పక విజయం పొందుతాడు.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...