Pages

Friday, April 2, 2021

గురు వ్యాఖ్యనం-47




*ఓం క్లీం క్షీరోదధి పుత్ర్యై  నమః* 


ఇది అద్భుతమైన మహాలక్ష్మి మంత్రం. అమ్మవారు పూర్వం పాలసముద్రాన్ని  దేవదానవులు  చిలకగా అందులోంచి పుట్టింది. ఒకప్పుడు దూర్వాస మహర్షి శాపం వల్ల మొత్తం సకల లోకాలలో ఉన్న సంపద సముద్రం పాలైపోయింది. దాంతో ఇంద్రుడు విష్ణువు దగ్గర మొరపెట్టాడు.

                           అప్పుడు శ్రీమహావిష్ణువు దానవులను కలుపుకుని పాలసముద్రం చిలకమన్నాడు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని, దేవతలు దానవులని కలుపుకుని, వాసుకిని కవ్వం తాడుగా చేసుకుని, అడుగున కూర్మరాజుగారు పర్వతం కిందికి దిగకుండా మోస్తూండగా, క్షీర సాగరాన్ని మథించారు. ఆ క్షీర సాగర మథనంలో అనేక వస్తువులు పుట్టాయి. అందులో జగన్మాత ఆదిలక్ష్మి పుట్టింది. శ్రీమహావిష్ణువు మెడలో పూలమాల వేసి వరించింది. అప్పటి నుంచి అమ్మవారిని 'క్షీరోదార్ణవ సంభవ' అని 'క్షీరోదధిపుత్రి' అని పిలిచారు.

                          ఇప్పుడు ఈ క్షీరోదధి పుత్రికి కామరాజ బీజము 'క్లీం' కారము, అంటే కోరిన కోరికలు తీర్చే బీజం కలిపితే ఇది ఒక మహా మంత్రం అవుతుంది. మన డబ్బు మనకి సమయానికి చేతికి వచ్చేలా చేసే అద్భుతమైన మంత్రం ఇది.


*మంత్ర ప్రయోగం - ఫలితం:*


ఈ మంత్రాన్ని శుక్రవారము నుంచి మొదలుపెట్టి 41 రోజుల పాటు రోజూ శ్రీమహాలక్ష్మీదేవి పటాన్ని పెట్టుకుని, ఆ పటానికి ఎదురుగుండా మారేడు ఆకులు, తులసి దళాలతోటి పూజిస్తూ 1000 సార్లు ఈ మంత్ర జపం చేయండి. ఏకధాటిగా చేస్తే మీ బాకీలు అన్నీ మీకు వచ్చి తీరుతాయి. సమయానికి ధనమును చేతికి అందేలా చేసే మంత్రం ఇది. అమ్మవారికి తీపిని నైవేద్యంగా  పెట్టండి. మీరు కూడా తినండి.

                    పూజ అయ్యాక ఈ బిల్వ పత్రాలు, తులసి దళాలు యజ్ఞం జరిగే చోట ఇవ్వండి. నదిలో కాని కలపండి. ఈ కాలంలో శాకాహారం తప్ప మాంసాహారం ముట్టుకోరాదు. మాంసాహార స్వీకారం చేస్తే ఈ మంత్రం వ్యర్థమైపోతుంది. అది కఠోర నియమం.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...