ఓం జగతీ కందాయై నమః
కంద అంటే మూలము. జగతీ కంద అంటే ఈ జగత్తుకి మూలము. అమ్మవారు ఈ చరాచర జగత్తులో అందరికీ మూలము.ఈ ప్రాణులకు ఎప్పుడు, ఎక్కడ, ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటుంది.
సమయమునకు వస్తువులు లేక బాధపడడం అనేది ఒక భయంకర యోగము.తెలిసో తెలియకో చెయ్యరాని పనులు క్షేత్రాలలో చేస్తే దాని వల్ల సమయానికి ఆ వస్తువు లభించదు అని పురాణాలు చెబుతున్నాయి.
శాస్త్ర విరుద్ధ కర్మలు చేయరాదు. దిగంబరంగా నదులలో స్నానం చేయకూడదు. ఇలా స్నానం చేయటం వల్లే కాత్యాయనీ వ్రతం చేస్తున్న గోపికలకి వస్త్రాపహరణం చేశాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు.
*మంత్ర ప్రయోగం - ఫలితం:*
తీర్థయాత్రా స్థలాలలో చెయ్యకూడని పనులు చెయ్యడం వల్ల వచ్చే పాపం పోవడానికి ఈ మంత్రాన్ని రోజూ 11 సార్లు జపిస్తే పాపములన్నీ పోతాయి. పోతే రావాల్సిన వస్తువులన్నీ మనకి అందడానికి, చదువుకున్నవి పరీక్షలలో గుర్తురావటానికి నిత్యం అనుష్ఠానం చేసుకోవాలి.
*సూచన:*
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.