Pages

Tuesday, February 9, 2021

గురు వ్యాఖ్యనం -11






ఓం జగతీ కందాయై నమః


కంద అంటే మూలము. జగతీ కంద అంటే ఈ జగత్తుకి మూలము. అమ్మవారు ఈ చరాచర జగత్తులో అందరికీ మూలము.ఈ ప్రాణులకు ఎప్పుడు, ఎక్కడ, ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటుంది.

                 సమయమునకు వస్తువులు లేక  బాధపడడం అనేది ఒక భయంకర యోగము.తెలిసో‌  తెలియకో చెయ్యరాని పనులు క్షేత్రాలలో చేస్తే దాని వల్ల సమయానికి ఆ వస్తువు లభించదు అని పురాణాలు చెబుతున్నాయి.

                       శాస్త్ర విరుద్ధ  కర్మలు  చేయరాదు. దిగంబరంగా నదులలో స్నానం చేయకూడదు. ఇలా స్నానం చేయటం వల్లే కాత్యాయనీ వ్రతం చేస్తున్న గోపికలకి వస్త్రాపహరణం చేశాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు.


*మంత్ర ప్రయోగం - ఫలితం:*


తీర్థయాత్రా స్థలాలలో చెయ్యకూడని పనులు చెయ్యడం వల్ల వచ్చే పాపం పోవడానికి ఈ మంత్రాన్ని రోజూ 11 సార్లు జపిస్తే  పాపములన్నీ పోతాయి. పోతే రావాల్సిన వస్తువులన్నీ మనకి అందడానికి, చదువుకున్నవి పరీక్షలలో గుర్తురావటానికి నిత్యం అనుష్ఠానం చేసుకోవాలి.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...