ఓం అనాశ్వాసిత దుఃఖిత జీవదుఖఃహర హరాయ నమః
అగస్త్య మహర్షికి కుమారస్వామి చెప్పిన దివ్య మంత్రం ఇది. అనేక శివ మంత్రాలలో ఇది బాగా ఉత్తమ మంత్రం.అత్త్యుత్తమ మంత్రం.ఇది తన మీద తనకు నమ్మకం లేని వారికి ఆత్మవిశ్వాసాన్ని అందించే మంత్రం
ఆత్మవిశ్వాసం ఉంటే పనికిమాలిన వాడు గొప్ప వాడౌతాడు. ఏ రంగంలో అయినా ముందు దృఢమైన అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉండాలి.తన మీద తనకు నమ్మకం ఉండాలి.అప్పుడే విజయం లభిస్తుంది.అప్పుడప్పుడు నమ్మకం ఉన్నవాడికి కూడా పిరికితనం రావచ్చు.అది తొలగించే మహామంత్రం ఇది.
*మంత్ర ప్రయోగం - ఫలితం:*
ఏకాదశి , ద్వాదశి , త్రయోదశి , చతుర్దశి , పూర్ణిమ ఇలా ప్రతి మాసంలోనూ శుక్ల పక్షంలో అదే కృష్ణ పక్షంలో అయితే ఏకాదశి, ద్వాదశి , త్రయోదశి ,చతుర్దశి ,అమావాస్య అంటే నెలకి 10 రోజులు అయ్యాయి.ఇలా ఒక సంవత్సరం పాటు అంటే నెలకి 10 రోజులు చొప్పున, 12 మాసాలు 12 పదులు 120 రోజులు అయ్యాయి.
ఈ 120 రోజులు కూడా ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపం చేస్తూ ఏదైనా శివలింగాన్ని పూజించాలి.శివుడు తెల్లని వాడు.తెల్లని పుష్పాలు అంటే ఇష్టపడతాడు. 108 మల్లెపూవులు కానీ ఇంకా వేరే ఏమైనా తెల్లపూవులతో కానీ పూజ చేయండి.శివలింగాన్ని ఇంట్లోనే ఉంచుకోవచ్చు.పూజ అయిపోయాక ఈ పూవులు ఎప్పటికప్పుడు మర్నాడు తీసేసి తొక్కని చోట వేసేయండి.తోచిన తీపి పదార్థం నైవేద్యం గా పెట్టండి. 5 రోజులు మాత్రం ఏకధాటిగా చేయండి.ఇలా సంవత్సర కాలం చేస్తే ఆత్మవిశ్వాసం ఎక్కువ అవుతుంది.అన్ని పనులు సులభంగా చేసి విజయం పొందుతారు.
*సూచన:*
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org/
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.