Pages

Thursday, February 11, 2021

గురు వ్యాఖ్యనం-15




ఓం దళత్కంజాత పత్రేక్షణాయ శ్రీకృష్ణాయ నమః


ఇది  శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన మంత్రం. అసలు కుచేలుడు ఈ మంత్రం వల్లే ఐశ్వర్యవంతుడయ్యాడు. కుచేలుడు శ్రీకృష్ణుడికి బాల్యమిత్రుడు.కటిక దారిద్ర్యం అనుభవించిన వాడు. అయినా ఎవరినీ ఏమీ అడగలేదు. శ్రీకృష్ణుడిని యాచిస్తే ఆయన ఏదైనా ఇస్తాడు అని పరమసాధ్వి అయిన ఆయన భార్య వెళ్లమంటే అప్పుడు ఆయన వెళ్ళాడు.

                ఈ మంత్రం చేయటం వల్లే  శ్రీకృష్ణుడు కౌగలించుకొని ఆయన కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుని అడగకుండానే అష్టైశ్వర్యాలు ఇచ్చేశాడు. దానికి గల కారణం ఈ మంత్రాన్ని కృష్ణుడికి మిత్రుడైనప్పటినుంచి జపం చేస్తూనే ఉన్నాడు. ఈ మంత్రం జపం చేయడం వల్ల కుచేలుడికి కృష్ణుడు  కదులుతున్న తామరపువ్వు రేకులవంటి కళ్ళు కలిగినట్లు కనబడ్డాడు, అటువంటి కృష్ణుని కొరకు నమస్కారము అని భావం. 


*మంత్ర ప్రయోగం - ఫలితం:*

 ఒక నెలరోజుల  పాటు జపం చేయండి. ఏకాదశి నాడు ప్రారంభించాలి అని దీనికి నియమము. శుక్ల పక్షం లేదా కృష్ణ పక్షం లో వచ్చే ఏ ఏకాదశి అయినా పరవాలేదు. నెమలిఫించం నెత్తి మీద ఉన్న  శ్రీకృష్ణుడి  పటాన్ని పెట్టుకుని  రోజూ స్వామి వారిని సంపంగి పూలతో కానీ, మందార పూలతో కానీ, పారిజాత పుష్పాలతో కానీ, పసుపు పచ్చని పూలతో కానీ పూజ చేస్తూ ఈ 30 రోజులు 1008  సార్లు ఈ మంత్రం జపం చేయండి.సంపంగి అయితే తొందరగా ఫలిస్తుంది.

                          శ్రీకృష్ణుడికి నైవేద్యంగా  రోజూ అటుకులు కానీ అప్పుడే తీసిన తాజా వెన్న కానీ పెట్టాలి. వీలుంటే ఆవు వెన్న మరీ మంచిది. కొన్ని వెన్న పనికి రాదు. అటుకులతో పాటు బెల్లం ముక్క కూడా కలిపి పెట్టాలి.ఈ ప్రసాదం మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి. ఏకధాటిగా మాసం చేయాలి.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...