Pages

Thursday, February 11, 2021

గురు వ్యాఖ్యనం-16



ఓం కందుకేశ్వర మహాదేవాయ  నమః



ఈ కలియుగంలో పక్కన ఉండి పని చేసి పెడతామని మోసగించే దుర్మార్గుల పీడ నుంచి బయట పడడానికి పూర్వం ధృవుడు  శ్రీమహావిష్ణువుని అడిగితే విష్ణువు ఈ మంత్రాన్ని ఇచ్చాడు అని కాశీ ఖండం చెబుతున్నది.మోసగించే శత్రువులని తొలగించే మంత్రం ఇది.


*మంత్ర ప్రయోగం - ఫలితం:*

 రోజూ శివ లింగాన్ని మట్టితో తయారు చేసి ఇంట్లో పెట్టుకుని పూజించాలి.ఏ రోజుకారోజు శివ లింగాన్ని పూజ అయిపోయిన వెంటనే తీసుకెళ్ళి తులసి మొక్క దగ్గర కాని, ఎవ్వరూ తొక్కని చోట పెట్టేయండి.

                          ఇలా 11రోజుల పాటు మట్టి లింగాన్ని తయారు చేసి ఆ శివలింగాన్ని పూజించాలి.దీన్ని పార్థివ లింగం అంటారు.దీని మీద పువ్వులు  ఒక బంతి  లాగా ముద్ద కింద చుట్టి ఆ పార్థివ లింగం మీద పెట్టిన ఈ మంత్రాన్ని 1008 సార్లు జపించాలి. కందుకము అంటే బంతి. ఆఖరున ధూపము ,హారతి ఇచ్చి , కొబ్బరికాయ కొట్టి నీళ్ళు దాని మీద పోయాలి. ఈ లింగాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి.కొబ్బరికాయని  నైవేద్యం పెట్టి  ఆపై మళ్ళీ హారతి ఇచ్చి  శివలింగాన్ని కళ్ళకు అద్దుకుని పువ్వులతో పాటు ఎవ్వరూ తొక్కని చోట వేసేయండి లేదా నదిలో కలిపేయండి.కపట మిత్రుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...