గురుశిష్యబంధముపై శిష్యులు కోరిన మీదట గురువుగారే వ్రాసిన పద్యం.
మత్తేభము :
నరుడేనైన గురూత్తమా! అగుదువా
నారాయణుండీవు, స
ద్గురుశిష్యోత్తమబంధమెల్లెడల నీకున్నాకు
నొప్పారదే
పరమార్ధంబు, సమర్థసద్గురుపరబ్రహ్మంబు
నీవౌదు నీ
చరణాంభోజములాన నీకిదె నమస్కారంబు
పద్మాకరా!
తాత్పర్యము :
సద్గురుదేవా! పద్మాకరా! నేను నరుడను.గురూత్తముడవైన నీవు సాక్షాత్తూ నారాయణుడవు.సద్గురువుకూ శిష్యునకూ ఉండే ఉత్తమబంధం ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా , ఎక్కడ ఉన్నా నీకు నాకు మధ్యలో శాశ్వతంగా ప్రకాశించవలసినదే.
గురుశిష్యబంధం ఎప్పుడూ విడిపోకుండా వర్ధిల్లాలి.నాకు పరమార్థమైనా,సమర్థసద్గురు పరబ్రహ్మమైనా అన్నీ నీవే.నీ పాదపద్మములపై ఒట్టుపెట్టి ఈ మాట చెపుతున్నాను.ఇదిగో! నీకు నమస్కారము.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.