Pages

Thursday, February 11, 2021

పూజ్య గురుదేవులు గురుశిష్య బంధముపై శిష్యులు కోరిన మీదట గురువుగారే వ్రాసిన పద్యం

 




గురుశిష్యబంధముపై శిష్యులు కోరిన మీదట గురువుగారే వ్రాసిన పద్యం.


మత్తేభము  :

నరుడేనైన గురూత్తమా! అగుదువా

                          నారాయణుండీవు, స

ద్గురుశిష్యోత్తమబంధమెల్లెడల నీకున్నాకు

                          నొప్పారదే

పరమార్ధంబు, సమర్థసద్గురుపరబ్రహ్మంబు

                          నీవౌదు నీ

చరణాంభోజములాన నీకిదె నమస్కారంబు

                          పద్మాకరా!


తాత్పర్యము  :

                            సద్గురుదేవా! పద్మాకరా! నేను నరుడను.గురూత్తముడవైన నీవు సాక్షాత్తూ నారాయణుడవు.సద్గురువుకూ శిష్యునకూ ఉండే ఉత్తమబంధం ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా , ఎక్కడ ఉన్నా నీకు నాకు మధ్యలో శాశ్వతంగా ప్రకాశించవలసినదే.

గురుశిష్యబంధం ఎప్పుడూ విడిపోకుండా వర్ధిల్లాలి.నాకు పరమార్థమైనా,సమర్థసద్గురు పరబ్రహ్మమైనా అన్నీ నీవే.నీ పాదపద్మములపై ఒట్టుపెట్టి ఈ మాట చెపుతున్నాను.ఇదిగో! నీకు నమస్కారము.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...