*ఓం కర్మఠాయ దూరీకృతశఠాయ ధృవపూజిత వాసుదేవాయ నమః*
ధృవుని చేత పూజింపబడిన వాసుదేవుని కొరకు నమస్కారము.దీనికి ముందు రెండు విశేషణములు ఉన్నాయి ఈ మంత్రము లో కర్మఠుడు అంటే కష్టపడి పని చేసేవాడు.పనిని చెయ్యటమే తన కర్తవ్యంగా పెట్టుకున్నవాడు.
శఠుడు అంటే మొండివాడు.మొండితనాన్ని దూరం చేసేవాడు వాసుదేవుడు. ఇది ముఖ్యంగా పిల్లలకి అవసరం.పేచీ పెట్టే పిల్లలని బాగు చేసుకోవడానికి ఈ మంత్రం బాగా జపం చేసుకోవచ్చు.
*మంత్ర ప్రయోగం - ఫలితం:*
లక్ష్మీ నారాయణుల పటం కానీ విగ్రహం కానీ బుధవారం నాడు పెట్టుకోవాలి. 40 రోజులు పాటు ఏకధాటిగా ఆపకుండా రోజూ పారిజాతాలు కానీ, తెల్లని పువ్వులు కానీ, పసుపు పచ్చని పువ్వులు కానీ లేక మందార పుష్పాలతో పూజించాలి.అన్నీ కలిపి 1008 పుష్పాలు తీసుకుని పూజ చేయాలి.తప్పక ప్రతి దినము అన్నంతో తయారు చేయబడిన నైవేద్యం పెట్టాలి. పులిహోర కానీ , దధ్యోదనము కానీ, కట్టుపొంగలి కానీ నైవేద్యం గా పెట్టాలి. దీపం, హారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి.
40 రోజులు అయ్యాక ఈ పటాన్ని ఎవరైనా పుణ్యాత్మునికి దక్షిణ తో దానం చేసేయండి. మరునాడు శుక్రవారమైనా, మంగళవారమైనా పువ్వులు మాత్రం తీసేయచ్చు. మొండితనాన్ని విడిచిపెట్టి సరళ జీవులు అవుతారు.
*సూచన:*
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org/
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.