Pages

Friday, February 26, 2021

గురు వ్యాఖ్యనం - 27

 





ఓం కామాక్ష్యై నమః


కోరికలను తీర్చే కన్ను కలిగినది అమ్మ. అమ్మవారు తన కంటితో అలా చూసిందంటే (కొంతమంది చూస్తే ప్రమాదము కానీ) అమ్మవారు కంటి కొలుకులతో అలా చూసిందంటే చాలు, తన భక్తుల కోరికలు తీరిపోతాయి, అమ్మ కరుణా స్వరూపిణి కనుక.

కోరికలను తీర్చే పవిత్రమైన చూపులు కలిగిన తల్లి అని ఒక అర్థం అయితే కంచి లో అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ముఖ్యమైన ఒక శక్తి పీఠం కామాక్షి అమ్మవారు. కామాక్షి కాంచీపురే. 

కంచి లో కామాక్షి అనే పేరుతో ఉన్నది. పూర్వము అక్కడ ఒంటి మామిడి చెట్టు ఉండేది అంటే ఒకే ఒక మామిడి చెట్టు ఉంటే దానిని ఒంటి మామిడి చెట్టు అంటారు.

అమ్మవారు పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఆ చెట్టుకింద శివుడు తనకు భర్త కావాలని తపస్సు చేసింది.  శివుడు ఆమెకు ప్రత్యక్షం అయ్యాడు, ఏక ఆమ్ర  (ఏకామ్ర అంటే ఒక్క మామిడి చెట్టు) కింద నువ్వు తపస్సు చేశావు కనుక ఈ రోజు నుండి నీవు ఏకామ్రేశ్వరి అన్నాడు.

ఆమ్ర అనే సంస్కృత శబ్దమునకు మామిడి చెట్టు, ఏక అంటే ఒకే ఒక్క మామిడి చెట్టు అని అర్థము. ఆ చెట్టు దగ్గర ఉన్న అధిష్ఠానదేవత మహారాజ్ఞి కనుక ఏకామ్రేశ్వరి, అది కాస్తా మన నోటిలో పడి ఏకాంబరేశ్వరి అయిపోయింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఈశ్వరుడు కనుక ఏకామ్రేశ్వరుడు.

ఆవిడ కోరికను తీర్చి, ఆమెను పెళ్లి చేసుకొని, కంచిలో కామాక్షి అనే పేరును ఇచ్చి, ఒక విగ్రహముగా చేసి అక్కడ ప్రతిష్ఠించాడు. తనంతట తాను విగ్రహం అయ్యేలాగా చేశాడు.  స్వామివారు ఈ మంత్రమును అప్పుడే నారదుని ద్వారా లోక వ్యాప్తి చేశాడట. అమ్మవారికి కామాక్షి అనే పేరు పెడుతున్నాను, నా కోసం తపస్సు చేసింది, నన్ను మెప్పించింది, ఆవిడ అలా చూస్తే చాలు కోరికలు తీరిపోతాయి.


మంత్ర ప్రయోగము ౼  ఫలితము:


1) ఈ కామాక్షి మంత్రజపము చెయ్యండి జాతక దోషాలు తొలగిపోయి కళ్యాణము అయి తీరుతుంది. కొంతమందికి జాతక దోషముల వల్ల కళ్యాణము అవ్వదు. ఇటువంటి వారందరికీ అత్యంత శీఘ్ర ఫలప్రాప్తిని ఇచ్చి, కళ్యాణ ప్రాప్తి అయ్యేటట్లు చేసే అత్యద్భుతమైన దివ్య మంత్రము, జాతక పరిహారము చేసేటటువంటి గొప్ప మంత్రము ఇది.

అసలు జాతక దోషాలు తొలగిపోయి అనుకున్న పనులు అయితే అప్పుడు వాడికి హాయిగా ఆనందం సిద్ధిస్తుంది. అటువంటి ఆనంద సిద్ధిని ఇచ్చే అద్భుతమైన కామాక్షీ మంత్రము ఇది.

విడిచిపెట్టకుండా నలభై ఒక్క (41) రోజుల పాటు (ఆడవాళ్లు బయట ఉన్న నాలుగు రోజులు విడిచిపెట్టి) ఏకధాటిగా అమ్మవారి పటమును లేదా విగ్రహమును పెట్టుకొని రకరకాల సువాసనలు వచ్చే పూలతో ఓం కామాక్ష్యై నమః  అంటూ ఈ పువ్వులతో పూజ చేయండి.

1008 సార్లు జపము చేయాలి కనుక వెయ్యి ఎనిమిది (1008) పువ్వులు పెట్టుకోండి. నలభై ఒక్క రోజుల పాటు 1008 పువ్వులతో 1008 సార్లు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ పూజ చేస్తే 41 వ రోజుతో వారి జాతక దోషాలు అన్నీ పూర్తిగా పరిహారమై పోతాయి. హాయిగా పెళ్లి అయిపోతుంది. అంతవరకూ జీవితంలో కష్టాలు అనుభవిస్తున్న వారు అసలు ఇంత తేలికగా సుఖాలు వస్తాయా అనుకుంటారట.


2) అసలు అమ్మవారి పేరే కామాక్షి కనుక కోరిన కోరికలను తీర్చేది లేదా కాముడ్ని కూడా బ్రతికించ గలిగే కళ్ళు కలిగినది అమ్మవారు కనుక ఆవిడను పూజిస్తే కంటి రోగాలు కూడా తొలగుతాయి.

కొంత మందికి కంటిచూపు చిన్నప్పటినుంచి సక్రమంగా ఉండదు, నానా యాతనా పడతారు, ఎన్ని కళ్ళజోళ్ళు వేసుకున్నా కళ్ళు అలా నిరంతరం అనారోగ్యానికి గురై నిరంతరం బాధామయంగా ఉంటాయి. అటువంటి వారు ఆవునెయ్యితో అమ్మవారిని అభిషేకం చేస్తూ తొమ్మిది రోజుల పాటు ఏకధాటిగా ఈ మంత్రమును 1008 సార్లు జపించండి (ఆవు నెయ్యి కరగబెట్టి కాస్త చల్లారాక అప్పుడు అభిషేకం చేయండి, వేడి వేడిగా ఉన్నప్పుడు అభిషేకించకూడదు). ఇలా చేస్తే కంటికి సంబంధించిన వ్యాధులు తొలగి క్రమక్రమంగా చూపు బాగుపడుతుంది. కామాక్షీ మంత్రము నేత్ర రోగ వినాశకం, నేత్ర దృష్టిని చక్కగా ప్రసాదిస్తుంది.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...