ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః
జగన్మాత లలితా దేవి ఎలా ఉంటుందో ఈ మంత్రంలో చెప్పారు. ఉద్యత్ అంటే ఉదయిస్తున్న, భాను అంటే సూర్యుడు అని అర్థాలు. ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు అరుణవర్ణంలో ఉంటాడు. అందుకే అమ్మవారిని అరుణాం అన్నారు, అంటే పూర్తిగా ఎఱ్ఱగా ఉంటుంది అమ్మవారు.
ఉదయిస్తున్న వేల సూర్యుల కాంతి వంటి కాంతి కలిగింది అమ్మ. ఈ కాంతి కంటికి చూపునిస్తుంది.ఉదయిస్తున్న సూర్యుడిని ఎఱ్ఱ కిరణాలతో ఉన్నప్పుడు, ఆయనను చూస్తూ అర్ఘ్యం ఇస్తే, రెండు చేతులు జోడించి నమస్కరిస్తే , దృష్టి దోషాలు తొలగి దృష్టి బాగా పెరుగుతుంది. మంచి కంటి చూపు వస్తుంది.
*మంత్ర ప్రయోగం - ఫలితం:*
చరకుడు అనే వైద్యుడు శివుడిని ప్రార్థిస్తే ఈ మంత్రాన్ని ఆయనకు ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని అనుదినము 11 సార్లు చేస్తే మంచి కంటి చూపు వస్తుంది. చత్వారముతో బాధపడుతున్న వారు రెండు కళ్ళ మీద చేతులు పెట్టుకుని సూర్యోదయ సమయంలో ఈ మంత్రాన్ని చేయండి. కళ్ళల్లో తరచుగా ఏమైనా దోషాలు ఉంటే, చిన్న అక్షరాలు కనపడక పోవడం, కొంచెం దూరంలో ఉన్న మనిషి ఎవరో తెలియక, చూపు లేక బాధపడుతున్న వారు వాళ్ళ వీలుని బట్టి ఎప్పుడుపడితే అప్పుడు ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు.
దృష్టి దోషం తొలగించి, మంచి కంటి చూపును ఇచ్చేది, ఆ చూపును కూడా ఇతరులను చూస్తే అవతల వారికి దిష్టి తగలకుండా ఉండే మంచి చూపునిచ్చేటటువంటి శక్తిని ఇస్తుంది ఈ మంత్రం.
*సూచన:*
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org/
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.