Pages

Sunday, March 14, 2021

గురు వ్యాఖ్యనం-43

 




 కోణం నీలాంజనప్రఖ్యం 

 మందచేష్టా  ప్రసారిణం

 ఛాయా మార్తాండ సంభూతం 

నమస్యామి శనైశ్చరం

                

పిల్లలతో నిత్యం తగాదా పడే తల్లిదండ్రులు  కలియుగంలో పెరుగుతారట.పూర్వజన్మలో ఋణానుబంధం ఉంటేనే భార్య,పిల్లలు , ఇల్లు ఇవ్వన్నీ మనకు దక్కుతాయి.ఈ ఋణానుబంధంలో ఎక్కడో తేడా ఉంటే శత్రువులు కూడా పిల్లలుగా పుట్టి తల్లిదండ్రులను పట్టి పీడించేస్తూ ఉంటారు.చాలామందికి  ఇవాల వచ్చే సమస్యలన్నీ యమధర్మరాజుగారి ద్వారా పూర్వం చిత్రగుప్తుడు విన్నాడు.

                          పిల్లలు స్కూలుకి వెళ్లక నానా బాధలు పెడుతుంటే దీనికి గల కారణం శని సంబంధమైన దోషం ఉండడం.రెండవది  తల్లితండ్రుల మాట వినకుండా గొడవ చేస్తూంటారు.ఇలా పెళ్ళి విషయంలో, విద్యా విషయంలో ఇంకా అన్ని విషయాలలో తల్లి తండ్రులతో తగాదా పడే పిల్లల వల్ల   వాళ్ళకి ఎప్పుడూ తలనొప్పే.

                         వీరిని సరియైన మార్గములో పెట్టడానికి సూర్యభగవానుడు శనైశ్చర మంత్రాన్ని ఉపదేశించాడు.


మంత్ర ప్రయోగం - ఫలితం:


శనివారం నాడు 6 గంటల నుంచి 7 గంటల దాకా శని హోరా అని ఉంటుంది.ప్రతి శనివారం  ఇది ఒక సంవత్సరం చేయండి.108 కాని 1000  కాని ఒక ఏడాది చేస్తే పిల్లలతో ఐకమత్యం వస్తుంది. పిల్లలు సుఖంగా ఉంటారు.వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది.పెళ్ళిళ్ళల్లో కాని ,చదువుల్లో కాని ఏ ఇబ్బందులూ రావు.ఆఖరున సంవత్సరము  పూర్తి అయ్యాక ఒక శనైశ్చరుడి ఆలయానికి వెళ్ళండి.నువ్వులనూనెతో అభిషేకం చేయించుకోండి.యథాశక్తి దక్షిణ ఇవ్వండి.కాళ్ళు కడుక్కుని ఇంటికి రండి. పిల్లలకి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...