Pages

Sunday, March 14, 2021

గురు వ్యాఖ్యనం-44






ఓం. విద్యానిధయే  నమః


ఈ కలియుగంలో మానవులకి జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతుంది.కొంతమంది పిల్లలకి జ్ఞాపకశక్తి ఉండదు లేదా కొన్ని అక్షరములు సరిగ్గా ఉచ్చరించలేరు.కారణం కొన్ని సరస్వతీ దోషాలు ఉండడం వల్ల.

                         పూర్వం సత్యవ్రతుడు అను పేరు కలిగిన ఒక వ్యక్తి  సరిగ్గా పలకలేకపోతే అమ్మవారు స్వయంగా ఒక సరస్వతీ కవచాన్ని ఇచ్చింది.కవచాన్ని చదవలేని వాళ్ళకి స్వయంగా సూర్యభగవానుడు యాజ్ఞవల్క్యునికి , శ్రీ కృష్ణుడు సూర్యుడికి చెప్పిన ఒక గొప్ప మంత్రంవై.ధారణా శక్తిని ఇస్తుంది.దోషనివారణ కోసం ఇవ్వబడిన ఒక గొప్ప అత్యద్భుతమైన మంత్రం ఇది.


మంత్ర  ప్రయోగం - ఫలితం:


దీనిని కొన్ని నక్షత్రాలలో చేస్తే బాగా పట్టిస్తుంది.మూలా నక్షత్రము అంటే అమ్మవారికి చాలా ఇష్టం.శరత్కాలంలో మూలా నక్షత్రం నాడు ఆశ్వయుజ మాసంలో సరస్వతీ రూపం లో అమ్మవారికి అలంకారం చేస్తారు.

                       ప్రతి మాసంలో వచ్చే మూలా నక్షత్రం నాడు , పూర్ణిమా తిథి నాడు , శుక్రవారం నాడు ,అమావాస్య నాడు ఈ 4 తిథులలోను ఈ నామాన్ని 1000 సార్లు పిల్లల తో చేయించండి. మూలా నక్షత్రం అయితే వెయ్యి సార్లు చేస్తే లక్ష సార్లు చేసిన  జపంతో సమానం.

                          ఈ జపం వల్ల అసాధారణమైన ధారణ పెరుగుతుంది.ఒత్తిడిని తొలగ జేసి సరియైన సమయంలో జ్ఞాపకశక్తిని ఇస్తుంది.శివుడు అంతటి వాడు ఈ జపం చేసి వ్యాకరణ సూత్రాలు ఇవ్వగలిగాడని కాళికా ఉపపురాణం చెబుతున్నది.శ్రీకృష్ణుడు గోలోకంలో రాజు చేత చేయించాడు.ఇది అంత  గొప్ప నామం.తెల్ల పువ్వులతో ఈ నామం చేస్తూ సరస్వతికి పూజ చేస్తే అపూర్వమైన పాండిత్యం కూడా వస్తుంది.ఇవన్నీ చేసి సరస్వతీ కటాక్షం పొందండి.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...