*ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః*
పారిజాత వృక్షము మూలములో ఉంటాడు హనుమంతుడు. ఈ మంత్రాన్ని మంచి ఉద్యోగం పొందడానికి జపం చేయాలి. ఈ మంత్రానికి నియమం ఏమిటంటే ముందు గురుపాదాలని ఆశ్రయించి ఈ మంత్రం పొందాలి. మూడు రోజుల పాటు గురుధ్యానంతో ముందు, ఉపదేశం పొందాక ఇంట్లో జపం చేసుకోవచ్చు. తరువాత నాలుగవరోజు నుంచి మొదలుపెట్టి అంటే నాలుగవ రోజు నుంచి మొదలుపెట్టిందే మొదటి రోజు అవుతుంది.
*మంత్ర ప్రయోగం - ఫలితం:*
ఈ మంత్రానుష్ఠానం 40 రోజులు దీక్షగా చేస్తే మంచి అద్భుతమైన ఉద్యోగం వస్తుంది. ఒక రాగి, వెండి , ఇత్తడి మొదలైనటువంటి వాటితో తయారు చేసిన చిన్న హనుమంతుని విగ్రహం తీసుకోండి. బొటనవేలు దాటకుండా ఉండాలి. దానిని పూజామందిరములో పెట్టుకుని ప్రతిరోజూ సిందూరంతో, ఈ మంత్రముతో హనుమంతుడిని పూజించాలి.
ఇక్కడ కూడా చిన్న నియమం ఉంది. తమలపాకు మీద హనుమంతుని విగ్రహం పెట్టాలి. ఏరోజుకారోజు ఆ తమలపాకు మార్చేయాలి. కుంకుమని మాత్రం పూజామందిరములోనే పెట్టండి. ఈ తమలపాకు మీద హనుమంతుడిని పెట్టేటప్పుడు మనకేసి తమలపాకు ముచ్చిక ఉండాలి, కొస హనుమంతుని కేసి ఉండేలాగా పెట్టి దాని మీద హనుమంతుని విగ్రహం పెట్టి ఈ మంత్ర జపం చేస్తూ కుంకుమతో పూజ చేయండి.
పటికబెల్లం కాని, పంచదార కాని, బెల్లం కాని, అప్పాలు కాని లేదా కొబ్బరికాయ కాని ఏదో ఒక నివేదన పెట్టండి. ఈ కాలంలో తొందరపడి కోపాన్ని తెచ్చుకోవద్దు. కోపం వల్ల జపం నిష్ప్రయోజనం అవుతుంది. సిధ్ధిని పాడు చేస్తుంది. మండల దీక్ష అయిపోయాక ఈ హనుమంతునికి ఆఖరి రోజు అప్పాలు నైవేద్యం పెట్టి, మూడు కొబ్బరికాయలు కొట్టి హనుమంతుని యథాస్థానానికి పంపండి. శుక్ర, మంగళవారాలు అయితే ఆ తరువాతి రోజు చేయండి. అప్పాలు అందరికీ ప్రసాదంగా పెట్టండి. ఈ కుంకుమని ఎక్కడికి వెళ్లినా ధరించండి. సంవత్సరము తిరిగే లోపు మంచి ఉద్యోగం వస్తుంది.
*సూచన:*
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org/
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.