Pages

Friday, April 2, 2021

గురు వ్యాఖ్యనం-49






*ఓం శం శం శం శ్రీకర్యై నమః*


శ్రీ అనగా లక్ష్మి, ధనము, సంపద. వీటిని కలిగిస్తున్నది కనుక అమ్మవారు శ్రీకరి.అమ్మవారు  ధనాన్ని కలిగించే ఒక మహత్తరమైన శక్తి.

శ్రీకరి అంటే సకల సంపదలను ఇస్తుంది, ధనమును ఇస్తుంది, శాంతినిస్తుంది, ధాన్యము ఇస్తుంది, పుష్టినిస్తుంది, తుష్టినిస్తుంది, ఆనందమును ఇస్తుంది, సేవకులను ఇస్తుంది, గృహాలను ఇస్తుంది, వాక్ శక్తినిస్తుంది. ఇన్ని రకాల చైతన్యములను కలిగిస్తుంది కనుక అమ్మవారు శ్రీకరి.

దీనిని విడతీసి చెప్పకూడదు, కలిపి శ్రీకరి అని చెప్పాలి.

 ఈ మంత్రము మహా భయంకరమైన దారిద్ర్యమును నాశనం చేయడం కోసం ఉపయోగిస్తారు.

అమ్మవారు తలుచుకుంటే భయంకరమైన దారిద్ర్యం నిమిషములో తొలగిపోతుంది.


*మంత్ర ప్రయోగము - ఫలితము:*


అమ్మవారి రూపమును బంగారంతో కానీ, వెండితో గానీ, రాగితో కానీ ఏమీ లేకపోతే మట్టితో కానీ ఒక చిన్న ప్రతిమను చేసి పెట్టుకోండి అది కూడా లేక పోతే ఒక పటమును పెట్టుకోండి.

మారేడు ఆకులను 108కి తక్కువకాకుండా తెచ్చుకోండి.

 ఈ మారేడు ఆకులతో అమ్మను పూజిస్తూ రోజూ వెయ్యి సార్లు 

ఓం శం శం శం శ్రీకర్యై నమః 

అనే మంత్ర జపం చేయండి.

 పూజ చేస్తూ ఉండగా ఆకులు అయిపోయినా కానీ జపము మాత్రం వెయ్యి సార్లు చెయ్యండి.

 ఇలా 90 రోజులు చెయ్యండి.

ఏ రోజుకారోజు పూజ అయ్యాక ఈ ఆకులను పూజా మందిరం లోనే ఒకచోట పెట్టండి, 90 రోజులు పూర్తి అయిన తరువాత ఈ ఆకులను ఏదైనా యజ్ఞానికి ఇవ్వండి లేదా ఎవరూ తొక్కని చోట వేయండి.

ఈ విధముగా 90 రోజులపాటు ఈ మంత్ర అనుష్ఠానము చేస్తే (స్త్రీలు బయట ఉన్న నాలుగు రోజులు ఆపి తరువాత కొనసాగించవచ్చు) మహా భయంకరమైన దారిద్ర్యం నుండి బయటపడతారు.


ఓం శం శం శం శ్రీకర్యై నమ:


*సూచన:* 

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం  చేర్చుకొని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు. 


https://srivaddipartipadmakar.org

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...