*ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితాయైనమః*
పూర్వం సకల ప్రాణులు అమ్మవారిని ఒకసారి భక్తితో ప్రార్థించి, నిత్యం ఏ కార్యక్రమాలలోకి వెళ్ళినా ఆ పనులు అవ్వక భయంకర విఘ్నాలతో బాధపడే మానవుల కష్టాలు ఎలా తొలగుతాయెా, దానికొక మంచి మంత్రమో, లేక మార్గమెా ఉపదేశించమని దేవతలు, ఋషులు కలిసి కోరారు.
భండాసురుడు అనే ఒక భయంకర రాక్షసుడు మన్మథుని చితాభస్మం నుండి పుట్టినవాడిని సంహరించడానికి అమ్మవారు బయలుదేరింది. అప్పుడు అమ్మవారి శరీరము నుండి మహాగణేశ్వరుడు అనే మహానుభావుడు పుట్టాడు. ఇతడు లేత సూర్యకాంతితో ప్రకాశిస్తూ, ఒక తెల్లని దంతంతో, చాటంత చెవులతో ఉండి, కిరీటము బాగా పైకి పొడుగ్గా ఉండేటటువంటి స్వావిు.ఈ మహాగణేశ్వరుడు భండాసురుడి దగ్గర ఉండే ఒక
భయంకర యంత్రాన్ని ధ్వంసం చేసాడు. అప్పుడు అమ్మవారు మెచ్చుకుని, సంతోషించి ఈ నామాన్ని లోకానికి అనుగ్రహించింది.
*మంత్ర ప్రయోగం - ఫలితం:*
ఈ నామాన్ని మనము భక్తితో ఉదయంపూట 40 రోజుల పాటు రోజూ 108 సార్లు చొప్పున చేసుకుంటే అన్ని రకములైన విఘ్నములు తొలగి కార్యసిద్ధి అవుతుంది.
*సూచన:*
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకొని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.