Pages

Monday, April 5, 2021

గురు వ్యాఖ్యనం-51




ఓం పద్మ నిధయే నమః


శంఖము, పద్మము ఇలా 9  నిధులు ఈ సృష్టిలో ‌ఉన్నాయి. వాటిని నవనిధులు అంటారు. ఈ నిధులలో  పద్మనిధి అని ఒక గొప్ప నిధి ఉంది. లక్ష్మీదేవి 9 నిధులను తన శరీరానికి  9  అలంకారాలుగా చేసుకుంది . అందులో ఈ పద్మనిధి కూడా ఒకటి .


*మంత్ర ప్రయోగం - ఫలితం:*

                

          నాలుగు చేతులతో, ఎఱ్ఱ తామరపువ్వులో కూర్చుని ఉన్న లక్ష్మీ అమ్మవారి ఒక చిన్న పటాన్ని ఎదురుగుండా పెట్టుకుని, కొంచెం పంచదార నైవేద్యం పెట్టి,  ఈ  నామాన్ని 9 రోజులు రోజుకి 1000 సార్లు జపం చేయాలి. మనకి రావాలసిన ఋణం రప్పిస్తుంది. అవతల వాళ్ళకి ఇవ్వవలసినవి ఇప్పిస్తుంది.

            

         పద్మనిధి యొక్క లక్షణం ఏమిటంటే అప్పులు తీర్చగలిగే శక్తి ఇచ్చి, వారితో మనకి ఏ పీడా లేకుండా హాయిగా,  సుఖంగా ఉండేలా చేస్తుంది. ఈ నామం యావజ్జీవితం చేసినవారి  జీవితంలో ఋణము అనే ప్రసక్తి ఉండదు. ఆఖరున నైవేద్యం పెట్టిన పంచదార ఎవరు పూజ చేశారో వారే తినాలి. బయటివాళ్ళకి పెడితే  వాళ్ళ ఋణాలు విముక్తి అవుతాయి. కుబేరుడిని కూడా ఋణవిముక్తుడ్ని చేసిన ఈ మంత్రం జపించుకుని ధన సంబంధమైన బాధల నుంచి విముక్తి పొందండి.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...