Pages

Monday, April 5, 2021

గురు వ్యాఖ్యనం-52

 



ఓం  ఐం హ్రీం శ్రీం లింగధారిణ్యై నమః

 

పూర్వము అమ్మవారు భూమండలంలో 108 శక్తి పీఠములను ఏర్పాటు చేసుకున్నది.

       

     పూర్వము సతీదేవి శరీరమును విడిచిపెడితే, శివుడు ఆ శరీరమును భుజం మీద వేసుకొని తాండవమాడాడు. శివుడు సతీదేవి శరీరమును భుజం మీద వేసుకొని ఉన్మాదం తో తిరుగుతూ ఉంటే, లోకాలన్నీ కంపించి పోయాయి, అకాల ప్రళయం వచ్చింది,

దానితో దేవతలంతా భయపడిపోయి పరుగుపరుగున శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లి మొర పెడితే, సతీదేవి శరీరము శివుడి భుజం మీద ఉన్నంత వరకూ ఆయనకు ఈ ఉన్మాదం తగ్గదు అని ఆ శరీరమును ముక్కలు ముక్కలుగా చేసేస్తాను అని విష్ణువు శార్ఙ్గము అనే కోదండమును ఎక్కుపెట్టి బాణములతో సతీదేవి శరీరమును ముక్కలుముక్కలుగా కొట్టేశాడు. అమ్మవారి శరీరభాగాలు భూమి మీద 108 ప్రదేశాలలో పడ్డాయి, అవే 108 శక్తి పీఠాలు. వాటిలో 18 బాగా ప్రసిద్ధికెక్కాయి. అందులో అత్యంత ప్రసిద్ధికెక్కిన శక్తి పీఠము నైమిశారణ్యంలోని లింగధారిణి.

ఈ లింగధారిణి అనే పేరుతో లలితాదేవి నైమిశారణ్యంలో కొలువై ఉన్నది. అష్టాదశ శక్తి పీఠాలలో ముఖ్యమైనది.


లింగధారిణి మంత్రమును ‘ *ఓం  ఐం హ్రీం శ్రీం* ’ అనే బీజాలతో కలిపి 40 రోజులు జపిస్తే మంచి సంతానం కలుగుతుంది.


*మంత్ర ప్రయోగము - ఫలితము:* 


ఈ లింగధారిణి మంత్రమును మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ మొదలుపెట్టి 40 రోజుల పాటు ఏకధాటిగా 108 సార్లు జపం చేస్తూ, ఆవుపాలను అమ్మవారికి నైవేద్యముగా పెట్టి దానిని ప్రసాదముగా స్వీకరిస్తే వారికి సంతానం కలుగుతుంది. స్త్రీలు బయట ఉన్న నాలుగు రోజులు విడిచిపెట్టి ఐదవ రోజు నుండి కొనసాగించవచ్చు. ఈ లింగధారిణి మంత్రజపం చేయడం వలన సత్సంతానమే కలుగుతుంది.

 

    నియమము ఏమిటంటే,   ఈ నలభై రోజులపాటు  స్త్రీలు అయినా పురుషులు అయినా మాంసాహారము తినరాదు, మద్యపానం చేయరాదు, మసాలాలు మొదలైన వాటిని తినకూడదు, సాత్విక ఆహారం మాత్రమే తీసుకొనవలెను, అలా తింటేనే ఈ మంత్రము ఫలిస్తుంది.


     గురువు ద్వారా ఉపదేశం పొంది ఈ మంత్రము చెయ్యడం వల్లనే పూర్వం వశిష్ఠ మహర్షికి వందమంది కొడుకులు పుట్టారని, అందులో శక్తి అనే ఆయన బాగా ప్రసిద్ధికెక్కాడని మనకి సౌరపురాణం చెబుతున్నది.

నైమిశారణ్యంలో ఉన్న లింగధారిణి అనే అమ్మవారు లోకసంచారం చేసి తనంతట తానే సంతానం ప్రసాదించే దేవతనని చెప్పుకొన్నది.

      

    సాధారణంగా అమ్మవారు అలా చెప్పదు. కానీ లింగధారిణి మాత్రం అలా చెప్పింది. ఎందుకంటే చెప్పకపోతే తెలియదు కనుక.

గోమతీ తీరంలో వెలసిన అత్యద్భుతమైన శక్తి పీఠము అది.

ఈ 40 రోజుల కాలంలో మధ్యలో మైల వస్తే ఆపివేసి శుద్ధి అయిన తరువాత కొనసాగించవచ్చు.


    ఈ మంత్రమును ఇంటిలో చేసుకున్నట్లయితే,అటువంటివారు 40 రోజులపాటు రోజుకు 108 సార్లు చొప్పున చేసుకోవాలి, అదే నేరుగా నైమిశారణ్యంలోకి వెళ్లితే కేవలం మూడే మూడు రోజుల్లో రోజుకు వెయ్యి ఎనిమిది (1008) సార్లు చేస్తే చాలు. గోమతిలో స్నానం చేసి అమ్మవారి సన్నిధిలో కానీ లేదా నదీతీరంలో ఎక్కడో ఒకచోట కానీ రోజూ మూడు 1008 సార్లు, మూడు రోజులపాటు చేస్తే వారికి తొందరలోనే సంతానము కలుగుతుంది.


   పూర్వము శ్రీకృష్ణుడు సత్యభామకు సంతానం కలగకపోతే ఆయనే స్వయంగా అమ్మవారిని పూజించినట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. కృష్ణుడు అంతటివాడు అనుష్ఠానం చేసిన అత్యంత పవిత్రమైన మంత్రము ఇది. ఈ మంత్రము ఇంకా శీఘ్ర కాలంలో ఫలం ఇవ్వడానికి మంత్రజపం చేసిన వారు బంగారము, వెండి లేదా వస్త్రములు దానం చేసుకుంటే శీఘ్ర ఫలప్రాప్తి లభిస్తుంది.



*సూచన:* 

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం  చేర్చుకొని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...