ఓం మం మర్త్య బాధా నివారకాయ, మహాశాంతాయ, సర్వజ్ఞాయనమః
మరణబాధని తొలగించే మహాశాంతస్వరూపుడైన, సర్వమూ తెలిసిన ఈశ్వరుని కొరకు నమస్కారము అని ఈ మంత్రార్థం. ఈ మంత్రం ఎంత గొప్పదో సౌరపురాణం చెబుతోంది. కాల ప్రభావం వలన ఎన్ని పరీక్షలు చేసినా, కొంతమందికి అసలు రోగం ఏమిటో తెలియటంలేదు.
పూర్వము నందీశ్వరుడు శివుని దగ్గరికి వెళ్లి రోగనిర్ధారణ అవనప్పుడు, రోగముతో నానా బాధ పడుతున్న రోగికి ఏదైనా మంచి మంత్రం చెప్పండి అంటే శివుడు ఈ మంత్రం ఇచ్చాడు. రోగనిర్ధారణ సరిగా చెయ్యలేక పోవడం వలన, అలాంటప్పుడు మందులు సరిగ్గా పనిచేయకపోవడం వలన, మృత్యుగండంలోకి వెళ్లి నిత్య కార్యక్రమాలు చెయ్యలేక, ఎప్పుడూ నీరసంతో కళ్ళు తిరిగి బాధపడేటటువంటి అమాయక ప్రాణులను రక్షించే పరమ పవిత్ర మంత్రం ఇది.
*మంత్ర ప్రయెాగం - ఫలితం:*
తులసీదళాల రసం, కొంచెం మారేడు ఆకుల రసం ఈ రెండింటినీ శివలింగానికి ఎదురుగుండా పెట్టి, భక్తితో ఈ మంత్రాన్ని వెయ్యి సార్లు చొప్పున పదకొండు రోజుల పాటు జపం చెయ్యండి. జపం పూర్తి అయ్యాక చేతిలోకి మూడు సార్లు నీళ్లు తీసుకొని శివార్పణమస్తు అని పళ్లెములో నీళ్లు విడిచిపెట్టెయ్యండి. ఆ తరువాత ఆ నీళ్లతో కళ్ళు తుడుచుకొని, ఈ నీళ్లు తులసిమెుక్కలో పొయ్యండి. ఈ రెండు ఆకుల రసాన్ని జపం పూర్తి అయిన తరువాత త్రాగెయ్యండి.
*సూచన:*
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకొని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org/
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.