Pages

Thursday, February 11, 2021

గురు వ్యాఖ్యనం- 17






ఓం  వశిన్యై  నమః


అమ్మవారు తన దివ్య నామాలు 8  మంది  దేవతల చేత రాయించుకుంది. ఆ 8 మంది దేవతలని వాగ్ధేవతలు అంటారు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని వీళ్ళని వశిన్యాది వాగ్దేవతలు అంటారు.

పర్వకాలాల్లో చేయవచ్చును అనగా అమావాస్య, సంక్రాంతులు పండుగ దినములు దీపావళి ఇలాంటి రోజులలో భక్తి తో చేస్తే లోకం మనకు వశం అవుతుంది.


*మంత్ర ప్రయోగం - ఫలితం:*


అధికారం లో ఉన్నవారికి  తన దగ్గర పనిచేసే వాళ్ళని అదుపు లో పెట్టటానికి ఈ నామం బాగా చేస్తే అటువంటి వాళ్ళకి  వెంటనే వశత్వం  వస్తుంది. 1000 సార్లు పర్వకాలాలలో చేయాలి. కర్కాటక సంక్రమణ కాలంలో, విషవత్తులు వచ్చినప్పుడు, గ్రహణ కాలంలో చేస్తే  లోకం అంతా మనము చెప్పిన మాట వింటుంది. పిల్లలు చెప్పిన మాట వింటారు. అన్ని పనులు సజావుగా సాగుతాయి.


శత్రువుని కూడా మిత్రులను చేస్తుంది. మనకి కూడా వాళ్ళ మీద ద్వేషం లేకుండా చేస్తుంది.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...