Pages

Wednesday, March 3, 2021

గురు వ్యాఖ్యనం-31






ఓం సుధా సాగర మధ్యస్థాయై నమః


సుధ అంటే అమృతము. సముద్రాలు చాలా ఉన్నాయి, అందులో సప్తసముద్రాలు అని మనము పిలుస్తున్నామే వాటిలో ఒకటి అమృత సముద్రము. శ్రీ మహావిష్ణువు క్షీర సాగరం లో ఉంటాడు, అమ్మవారు (అమృత సముద్రంలో ఉంటుంది) సుధా సాగరంలో ఉంటుంది. ఈ సుధా సాగర మధ్యలో ఉంటుంది అమ్మవారు.

పూర్వము మణిద్వీప వర్ణన చేసినప్పుడు, అందులో అన్ని లోకముల కంటే పైన ఒక సముద్రం ఉన్నదని, అది అమృత సముద్రము. ఈ సముద్రంలో భూలోకంలో ఉన్న సముద్రాలలో ఉండే ఉప్పు నీరు లాగా కాకుండా, ఆ సముద్రంలో అమృతమే జలం లాగా ఉంటుంది. ఆ అమృతం లోనుంచి కెరటాలు వస్తూ ఉంటాయి, ఆ కెరటాల లోని ఒక బిందువు మన నోట్లో పడితే వాడికి ఆనందము, ఆహ్లాదము, ఈ జనన మరణాదులు వుండవు అని చెప్పుకున్నాము.

కానీ అక్కడకు వెళ్ళలేరు, ఆ సముద్రము మధ్యలో 18 ప్రాకారములతో కూడిన ఒక అద్భుతమైన భవనము ఉన్నది, అదే చింతామణి గృహం లోని అమ్మ వారి నివాస స్థానము. అమ్మవారు ఆ మధ్యలో ఉంటుంది కనుక సుధా సాగర మధ్యస్థ అన్నారు. సుధా సాగరము మధ్యలో ఉన్న ద్వీపము, అది మణిద్వీపము, అది అమ్మవారి నివాస స్థానము.

సుధ అంటే అమృతము. అమృతము అని దానికి ఎందుకు పేరు వచ్చింది అంటే మృతము లేకుండా చేస్తుంది, ఎప్పటికీ మృతము కానిది, ఎప్పటికీ నాశనము లేనిది, నాశనము లేకుండా చేస్తుంది.

దేవతలకు అమరులు అని ఎందుకు పేరు వచ్చింది అంటే వాళ్లు అమృతము తాగడం వలన వారికి జరామరణాలు ఉండవు అంటే ముసలితనము ఉండదు, రోగాలు ఉండవు, చావు ఉండదు. జరామరణ రోగాలు ఉండవు కనుక వారిని అమరులు అంటారు.

మానవుడు కూడా అకాల మరణ బాధ లేకుండా, మృత్యు భయం లేకుండా, తనను తాను రక్షించుకోవడానికి ఇది ఒక గొప్ప మంత్రముగా చెప్పారు.

మహానుభావుడు మార్కండేయుడు లాంటివాళ్ళు, హరిశ్చంద్రుడి కుమారుడు చచ్చిపోయిన లోహితుడు వంటి వాళ్ళు చచ్చి బతికారు.

రేపోమాపో చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు బ్రతికి శాశ్వతంగా చిరజీవులు అయ్యారు, చిరాయుర్దాయం పొందారు. ఒక్క మార్కండేయుడు లాంటి వాళ్లేంటి, ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు.

అగ్నిహోత్రుడు కూడా చచ్చిపోయి మళ్ళీ బతికిన వాడే. విశ్వానరుడు అనే ఆయనకు వైశ్వానరుడుగా పుట్టి ఆయనను ఒక మొసలి ఎత్తుకుపోతే కూడా ఆయన బ్రతికాడు.

ఇలా ఒకళ్ళు కాదు చాలా మంది మహానుభావులు రేపోమాపో చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు ఈ మహా మంత్ర అనుష్ఠానం వల్ల కాలాన్ని జయించి చిరంజీవులు అయ్యారు.

ఇలాగ మానవులకు అకాల మరణం లేకుండా కాపాడే ఒక అద్భుతమైన మంత్రము ఇది.


మంత్ర ప్రయోగము ౼  ఫలితము:


1) ఆరు నెలల పాటు ఏకధాటిగా ప్రతి మంగళవారం 1008 సార్లు ఈ మంత్రమును జపించండి.

 మందార పుష్పాలు, గులాబీ పుష్పాలు, పాటలీ పుష్పాల వంటి ఎర్రని పుష్పాలను అమ్మవారి పూజకు ఉపయోగించండి. ఈ విధముగా ఎర్రని పుష్పములతో అమ్మవారిని పూజిస్తూ ఆరు నెలల పాటు ఏకధాటిగా ప్రతి మంగళవారం విడిచిపెట్టకుండా 1008 సార్లు ఈ మంత్రమును జపము చేయండి, అలా చేస్తే అటువంటి వాడికి అకాల మరణ భయం తొలగిపోతుంది.

కాకపోతే మంగళవారము పూజించండి.

2)  కార్యసిద్ధికి కూడా ఇది గొప్ప మంత్రము అని చెప్పారు..

ఇంతకుమునుపటి లాగే అమ్మవారి పటమును కానీ, రూపును కానీ పెట్టుకోండి. ఇంతకుముందు అకాల మరణ భయం తోలగడం కోసం మంగళవారం చేయమన్నాను కానీ కార్యసిద్ధి కోసం ఇప్పుడు ఆరు నెలల పాటు ప్రతి బుధవారం ఎర్రని పుష్పములతో అమ్మను పూజిస్తూ 1008 సార్లు ఈ మంత్ర జపము చేస్తే వాడికి కార్యసిద్ధి అవుతుంది.

కొంతమందికి దరిద్ర జాతకాలు ఉంటాయి, ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసినా, ఎన్ని సత్కర్మాచరణలు చేసినా వారికి మాత్రం పనులు అవ్వవు, ఏదో పూర్వకర్మ ఉంటుంది. ఒక్కొక్కడు అడుగుపెడితే ఆ ప్రదేశము సర్వనాశనం అవుతుంది.

అటువంటి వాడు తానూ మరియు వ్యవస్థ నాశనం కాకుండా లోక శ్రేయస్సు కోసం ఈ మంత్రం అనుష్ఠానం చేస్తే కార్యసిద్ధి అవుతుంది.

ఉదాహరణకు ఒక్కొక్కడు ఉద్యోగంలో అడుగుపెట్టగానే ఆ కంపెనీనే ఎత్తేస్తారు, దానికి కారణము ఏదో తెలియని ఒక జాతక దోషము వున్నది. ఆ దోషమును తొలగించి కార్య సిద్ధిని కలిగించే గొప్ప మహా మంత్రము ఇది.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...