Pages

Sunday, March 14, 2021

గురు వ్యాఖ్యనం -33

 





ఓం శం షం సం శాంకర్యై నమః


శం కరోతి ఇతి శంకరః

శం అంటే సుఖము, శాంతి, ఆనందము.

జీవులకు సుఖమును శాంతిని ఇస్తాడు కనుక శివుడిని శంకరుడు అన్నారు.


ఆ శివుడి రూపంలో ఉంటుంది, శివుని అర్ధాంగి కనుక అమ్మను శాంకరి అన్నారు.

శాంకరి అంటే పార్వతీ అని ఒక అర్థం, శివుడి రూపంలో లయ కారకురాలై తిరుగుతుంది అని అర్థము.


అమ్మవారే బ్రహ్మ రూపంలో సృష్టిస్తుంది, విష్ణు రూపం లో పోషిస్తుంది, శివుడి రూపంలో లయం చేస్తుంది.

అందుకే  సృష్టి కర్త్రి బ్రహ్మరూపా  గోప్త్రి గోవింద రూపిణీ సంహారిణి రుద్రరూపా తిరోధాన కరీశ్వరి 

సదాశివానుగ్రహద అని పంచ కృత్యాలు చేస్తుంది అని లలితా సహస్రనామంలో చెప్పుకున్నాం.

శాంకరి అంటే అమ్మవారు శివుడి యొక్క అర్ధాంగిగా శివుడి రూపంలో విహరిస్తూ లయం చేస్తున్నది, అందరినీ తనలో కలిపేసుకుంటుంది. ఆ తల్లి అనుగ్రహం వుంటే సుఖముగా శరీరమును విడిచి పెడతాము, ఆ తల్లి అనుగ్రహం ఉంటే జీవితంలో సుఖముగా బతుకుతాము, ఆ తల్లి అనుగ్రహం ఉంటే జీవితంలో ఎన్ని చిక్కులు వచ్చినా మనసుకు అధైర్యము రాదు, శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది.

ఇవాళ కలియుగములో ఏ వ్యక్తిని కదిలించినా అశాంతి తప్ప నేను ప్రశాంతిగా ఉన్నాను అని ఎవరూ అనుకోవడం లేదు. దీనికి గల కారణం కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు. రుద్రాక్షలు, స్పటికాలు మొదలైనటువంటివి, దేవతలకు సంబంధించినవి అధిక లాభాలకు అమ్మితే అటువంటివారు కొంతకాలం పోయాక దారిద్ర్యం అనుభవిస్తారని చెప్పారు. ప్రారంభంలో కోట్లు వచ్చేస్తాయి.

 ఉదాహరణకు ₹100 రుద్రాక్షను 10 వేలకు అమ్మితే ఇలాంటి వాళ్ల వంశములు నాశనం అయిపోతాయి, ఇటువంటి పిచ్చి పనులు చేయకూడదు. కర్మకాలి ఇవన్నీ చేస్తున్నారు. భూలోకంలో పుట్టిన మానవులు డబ్బు కోసం కక్కుర్తిపడి కొన్ని పనులు చేస్తుంటారు, దేవతా సంబంధమైన వస్తువులను అధిక ధరలకు స్థాయికి మించి అమ్మితే అటువంటి వాళ్ళు మహా భయంకరమైన వేదన పొందుతూ చచ్చిపోతారు, లేదా పిల్లలతో ఇబ్బందులు వస్తాయి, అన్నదమ్ముల మధ్య తగాదాలు వస్తాయి. ఈ ఇబ్బందులు పోయి మనశ్శాంతితో సంతోషంగా ఉండాలంటే ఈ మంత్రము చేయండి అని సాక్షాత్తు హయగ్రీవుడు చెప్పాడు.

దేవ ద్రోహం వలనో, నాస్తికవాదం వలనో, లేదా ఇంకేమైనా చేయరాని పనులు వలనో అశాంతి పెరిగిపోతే ఇంటిలో తగాదాలు వస్తే అప్పుడు ఈ మంత్ర అనుష్ఠానము చేయండి.


మంత్ర ప్రయోగము ౼  ఫలితము:

 

నలభై ఒక్క (41) రోజుల పాటు ప్రతిరోజూ ఉదయము సూర్యోదయ సమయంలో బిల్వ పత్రములతో, తులసి దళములతో అమ్మవారి పటమును కానీ, విగ్రహమును కానీ పూజిస్తూ వెయ్యిసార్లు ఈ మంత్ర జపం చేస్తే భీకరమైన సంసార సాగరాన్ని దాటుతాడు, మహా భయంకరమైన కుటుంబ సంబంధ కలహాల నుంచి బయటపడతాడు, సుఖశాంతులు పొందగలుగుతాడు అంతటి గొప్ప మంత్రము ఇది.

జపము చేస్తున్నప్పుడు ఆసనం మీద నుంచి అస్సలు లేవకండి, ఫోన్లు వస్తే ఎత్తకండి, అన్నీ విడిచిపెట్టి ఏకాగ్ర చిత్తముతో, సమాహిత చిత్తులై భక్తిశ్రద్ధలతో చేస్తే తొందరగా ఫలితాన్ని ఇస్తుంది.

ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ చేయవచ్చు.  మధ్యలో అశుచి వచ్చినప్పుడు ఆపేసి మళ్లీ కొనసాగించవచ్చును. అనేక రకములైన అశాంతులను తొలగించి శాంతిని, శాశ్వత మైన బ్రహ్మానందాన్ని ఇచ్చే గొప్ప మంత్రము ఇది. పిల్లల వల్ల కానీ ఇంకొకళ్ళ వల్ల కానీ అశాంతి వచ్చినప్పుడు ఈ మంత్రమును చేసుకోండి.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...