ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః
ఇది లలిత సహస్రనామములోని గొప్ప మంత్రం.కామేశ్వరుడు అని ఒక గొప్ప మహానుభావుడు ఉన్నాడు.లలితాదేవికి భర్త.బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరులకు కూడా మూలమైన విరాట్ పురుషుడు కనుక ఆయనకు కామేశ్వరుడు అని పేరు.కామము అంటే కోరిక.కోరికలను తీరుస్తాడు కనుక కామేశ్వరుడు అయ్యాడు.
ఆయనకి ప్రాణనాడి అమ్మవారు.తన భర్తని అదుపులో పెట్టుకుని భర్తకి ప్రాణమునిచ్చునది అని అంతరార్థం.భార్యని ప్రేమించి తద్వారా జ్ఞానాన్ని , ఐశ్వర్యాన్ని పొందమని శ్రీ దేవీభాగవతం చెబుతున్నది.
మంత్ర ప్రయాగం - ఫలితం:
ఈ మంత్రం ప్రతి శుక్రవారం , మంగళవారము , ఆదివారాలలో 108 పర్యాయాలు ఆడ ,మగ జపిస్తే భార్యా భర్తల లో ఐకమత్యం ఉంటుంది.విడిపోరు.భార్యని గౌరవించడం అంటే ఏమిటో పురుషుడికి నేర్పుతుంది. భార్యని గౌరవించడం వల్ల సంఘంలో గౌరవం , ధనము వస్తాయి. ఇంటికి మారు రూపమే గృహిణి.
అటువంటి గృహిణి వల్ల మానవునికి ఎన్ని రకాల సౌఖ్యాలు రావాలో అవి అన్నీ ఇస్తుందిట ఈ నామం.అందుకని ఇది మహామంత్రంగా చెప్పారు.ద్రౌపదీ దేవి ఇది చేయటం వల్లే పంచపాండవులని ఒకే రకంగా ప్రేమించి పరమ ప్రతివత అని పేరు తెచ్చుకుందిట.పాండవులు ఇది జపించడం వల్లే ఏనాడూ ద్రౌపదికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడలేదు.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని , లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org/
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.