ఓం అహమానందానందాయైనమః
ఇది అధర్వణ వేదములోని మంత్రం.పూర్వం సకలదేవతలు అమ్మవారిని "నువ్వు ఎవరివి" అని అడిగారు. అప్పుడు ఆవిడ ఈ చరాచర జగత్తు అంతా నేనే , అహం అంటే నేనే , ఆనందానికే ఆనందం ఇచ్చే దానిని , నేనే సర్వజగత్తును వ్యాపించి ప్రతి ప్రాణికి దుఃఖం తొలగచేసి బ్రహ్మానందాన్ని ఇస్తాను అని చెప్పింది.
ఉపనిషత్తులు దీనిని మహామంత్రంగా స్వీకరించాయి. ఈ మంత్రాన్ని సనక, సనందన, సనత్కుమార, సనస్సుజాతులు లక్షసార్లు జపం చేశారు.దానితో ఎప్పుడూ నవయవ్వనంతో చిరజీవులు అయ్యారు.అప్పటినుంచి లోకంలో పరంపరగా వ్యాపించింది.ఈ మంత్రానష్ఠానము చేసిన వారికి జీవితంలో దుఃఖం రాదు.
మంత్ర ప్రయోగం - ఫలితం:
ప్రతి మంగళవారం నాడు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో అనుష్ఠానం చేసుకోండి.ఆ సమయంలో అధ్బుతమైన హోరా కాలం ఉంటుంది.అది జపానికి చాలా మంచిది.స్నానం చేసి ,కాస్త కుంకుమ పెట్టుకుని అమ్మవారి పటము కాని విగ్రహం కాని పెట్టుకుని మల్లెపూవులతో కాని సన్నజాజులతో కాని అమ్మని పూజిస్తూ 1000 సార్లు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి.వీలుంటే కొబ్బరికాయ కాని, అరటిపండు లేదా పంచదార వీటిని నివేదన చేయండి.
27 మంగళవారాలు అనుష్ఠానము చేయండి.మంచి నిర్భయత్వము వస్తుంది.సంతోషము ఉంటుంది.నిత్యం ఆనందం కలుగుతుంది, ఈ మంత్రం వల్ల దుఃఖం రాదు.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.