ఓం శ్రీం మహేశ్యై నమః
శ్రీం అనేది మాయా బీజం. అమ్మవారి యొక్క లలితాసహస్రనామము చాలా ప్రసిద్ధికెక్కినది. అందులో అమ్మవారికి మహేశీ అని ఒక నామము ఉన్నది.
ఇక అంతకంటే అధిష్ఠాన దేవత మనకు లేదు,
మనలను పరిపాలించే రాణిని ఈశీ అంటాము.
ఈశః అంటే అధిపతి, అమ్మవారు స్త్రీ రూపం లో పరిపాలిస్తుంది కాబట్టి ఈశీ అంటారు.
మహా ఈశీ మహేశీ,
అమ్మను మించిన పరిపాలకురాలు ఇక మనకు లేదు.
అమ్మే సకల లోకాలకు అధినాయిక, అటువంటి అమ్మ కనుక అమ్మను మహేశీ అన్నారు.
దీనికి ముందు శ్రీం అనే మహాలక్ష్మి బీజం, మాయా బీజం చేర్చి జపం చేస్తే ఇది మహామంత్రం అవుతుంది.
ఈ మంత్రము కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టే మంత్రము అన్నారు.
పూర్వం ఉత్తముడు అనే ఒక మనువు ఉన్నాడు, ఆయన తండ్రి గారి పేరు కూడా ఉత్తముడే.
స్వాయంభువ మనువు యొక్క భార్య శతరూప, వీరికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉత్తానపాదునికి సురుచి, సునీతి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.
పెద్ద భార్య సునీతి కొడుకు ధ్రువుడు, చిన్న భార్య సురుచి కొడుకు ఉత్తముడు. ఉత్తముడు యక్షుల చేతిలో చనిపోయినా ధ్రువుడి ధర్మమా అని బ్రతికాడు. ధ్రువుడు ధ్రువ మండలానికి వెళ్లి పోయినాక ఉత్తముడు భూమండలానికి రాజు అయ్యాడు.
ఈ ఉత్తమ మనువు భార్య ఆయన మాట అసలు వినేది కాదు, దానితో కుటుంబ వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయింది.
ఇంటిలో భర్త మాట భార్య, భార్య మాట భర్త, ఒకరి మాట ఒకరు విని సంసారమును చక్కదిద్దుకోవాలి. అనుక్షణము భర్తను భార్య అనుమానిస్తూ ఉంటే భార్యను భర్త అనుమానిస్తూ ఉంటే భర్త చేసే పనికి భార్య అడ్డు పడుతూ ఉంటే అట్లాగే భార్య వెళ్లే ఉద్యోగానికి భర్త అడ్డు పడుతూ ఉంటే కుటుంబం ఏమి బాగుంటుంది చెప్పండి. అందువల్ల ఒకరి మీద ఒకరికి అవగాహన ఉండాలి, ఈ అవగాహనతో కుటుంబమూ, పిల్లలు బాగా ఉండాలి.
పిల్లలు మాట వినకపోయినా, భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోయినా, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. కనుక వీరు బాగుండడం కోసం అని ఆనాడు బహుశా భగవంతుడు ఉత్తమ మనవుని సృష్టించి వుంటాడు.
ఉత్తముడు, అతని భార్య ఎప్పుడూ కొట్టుకునే వారట, వారికి అస్సలు పడేది కాదు, చివరికి వాళ్ల కోసం మిత్రవింద అనే ఒక యజ్ఞం చేశాడు ఒక గురువుగారు, ఆ మిత్రవింద యాగంలో ఈ మంత్రమును వాడారు.
మిత్ర కామేష్టి అంటే భార్యాభర్తలు ఐకమత్యంతో ఉండడం కోసం చేసే యజ్ఞం అన్నమాట. ఆ యజ్ఞంలో ఓం శ్రీం మహేశ్యై నమః
అనే మంత్రమును వెయ్యి సార్లు చదివి అగ్నిదేవునికి ఆహూతులను ఇచ్చాడు, దానితో భార్యాభర్తలు ఇద్దరూ కలిశారు.
మంత్ర ప్రయోగము ౼ ఫలితము:
కలియుగములో యజ్ఞము చెయ్యనవసరం లేదు కానీ ఈ మంత్రమును ప్రతి మంగళవారం విడిచిపెట్టకుండా సంవత్సరం పాటు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కానీ లేదా విడివిడిగా కానీ గణపతి ధ్యానం, గురు ధ్యానము చేసుకున్న తర్వాత 108 సార్లు కానీ లేదా 1008 సార్లు కానీ చేస్తే భార్యాభర్తల మధ్య అవగాహన వస్తుంది, పిల్లల మధ్య అవగాహన వస్తుంది, కుటుంబంలో అస్తవ్యస్త పరిస్థితులు తొలగిపోయి కుటుంబ వ్యవస్థ చక్కగా నడుస్తుంది. దానితో వారికి నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా ఉంటుంది.
ఒకవేళ ఈ మంగళవారములలో స్త్రీలు బయట ఉంటే ఆ వారము విడిచి పెట్టి తరువాతి వారం నుండి ప్రతి మంగళవారం నాడు మొత్తం మీద ఒక సంవత్సరం పాటు చెయ్యాలి.
అశుచి వచ్చినప్పుడు కూడా ఆ వారం విడిచి పెట్టి తరువాయి వారం నుంచి చెయ్యండి, కానీ విడిచిపెట్టకుండా సంవత్సరం పాటు పట్టుదలతో
ఓం శ్రీం మహేశ్యై నమః
అనే మంత్రమును చేస్తే కుటుంబ వ్యవస్థ చక్కబడుతుంది.
ఇది కుటుంబ పరిస్థితిని చక్కదిద్దే మంత్రము.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని , లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.