ఓం క్లీంకార్యై నమః
క్లీం అనే బీజాక్షర స్వరూపిణి యైన అమ్మవారి కొరకు నమస్కారం. నిరంతరం మానవులకి మానసికంగాను శారీరకంగాను ఉన్న కొన్ని రకాల కోరికలను తీర్చే మాతృస్వరూపిణి కొరకు నమస్కారం.
దుష్టాన్నము , విషాన్నము మానవుడి శరీరం అంతా పాడుచేసి తీవ్రమైన అనారోగ్యానికి గురి చేస్తుంది.దీని నుంచి బయట పడాలి మానవుడు. అలా బయటపడవేసే అపూర్వమైన మంత్రం ఇది.
మంత్ర ప్రయోగం - ఫలితం:
మంగళ , శుక్రవారాలలో ఒక రాగి చెంబు తీసుకుని అందులో నీరు పోసి తులసీ దళాలు , నాలుగు మారేడు ఆకులు వేయండి.దాని మీద కుడి చెయ్యి పెట్టండి. ఈ మంత్రాన్ని 1000 సార్లు జపం చేయండి. జపం అయిపోయాక ఈ తీర్థాన్ని తాగండి. చాలా ఆరోగ్యం ఇది. తులసీ దళములు , మారేడు దళములతో నానపెట్టబడిన రాగి చెంబులోని నీరు మంత్రపూతమై మహాద్భుత వైద్యం అవుతుంది.వ్యాధి తొలగిపోతుంది.
ఆయుర్వేదం కూడా చెబుతున్న గొప్ప వైద్యం ఇది.దుష్టాన్న , విషాన్న దోషం నివారణ కోసం మనకి చరకుడు అనే మహానుభావుడు అందించిన గొప్ప మంత్రం ఇది.ఈ మంత్రం ప్రభావం వల్ల నల చక్రవర్తికి జీవితంలో ఎప్పుడూ ఆహారం తినడం వల్ల అనారోగ్యం రాలేదని కొన్ని రకాల స్థలపురాణ గాథలు చెబుతున్నాయి.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.