ఓం పంచతన్మాత్ర సాయకాయై నమః
మంత్రమును సరియైన రీతిలో అర్థం చేసుకుని అనుష్ఠానం చేస్తే మానవుడు సాధించ లేనిదంటూ ఉండదు.ఆత్మ స్థైర్యం కావాలి . విశ్వాసం కావాలి.అటువంటివాటిలో మానసిక శత్రుపీడా నివారిణి నిరంతరం ప్రశాంతత నిచ్చే అధ్బుతమైన మంత్రంగా చెప్పారు.
అందుకే దీనిని మానసిక శత్రుపీడా నివారక మహామంత్రం అని కూడా బ్రహ్మాన్డపురాణం చెబుతోంది.తన్మాత్రలు అంటే శబ్ద ,రూపం, రసం ,స్పర్శ, గంధాలు.భూమి , అగ్ని ,జలం , వాయువు , ఆకాశం ఇవి పంచభూతాలు.ఈ పంచభూతాలకి ఐదు లక్షణాలు ఉన్నాయి.
భూమికి వాసన ఇచ్చే లక్షణం అందుకే పృథ్వీ గంధవతి'.అగ్నిలో దాహక శక్తి ఉంది. నీటిలో రసశక్తి ఉంది.ఆకాశం శబ్ద ప్రసారం చేసి శబ్దాన్ని అందరికీ అందిస్తుంది.వాయువుకి స్పర్శ అనే ఒక లక్షణం ఉన్నది.ఇలా ఐదు భూతాలకి ఐదు తన్మాత్రలు ఉన్నాయి.ఈ తన్మాత్రల వల్ల అమ్మవారు లోకాలను సృష్టించింది.ఈ పంచతన్మాత్రలని అరవిందము,అశోకము , చూతము ,నవమల్లిక , నీలోత్పలము అని పేరు కలిగిన ఐదు పువ్వులుగా మార్చుకున్నాయి. ఈ పువ్వులే బాణాలు.ఈ పువ్వుల బాణాలతో శత్రువులని పడ గొడుతున్నది.
మంత్ర ప్రయోగం - ఫలితం:
ఇది శుక్రవార మంత్రం.ప్రతి శుక్రవారం పవిత్రంగా స్నానం చేసి అమ్మవారి పటము కాని విగ్రహం కాని పెట్టుకుని ఆచమనం చేసి, సంకల్పం చెప్పుకుని 1008 సార్లు అని జపం చేయండి.18 శుక్రవారాలు అనుష్ఠానం చేస్తే మానసిక శత్రుపీడ తొలగిపోతుంది.సంపదలు వస్తాయి.అన్ని రంగాలలో విజయం లభిస్తుంది.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.