Pages

Friday, February 26, 2021

మాఘ పూర్ణిమ

 







🌹🌹 మాఘ పూర్ణిమ ,  మాఘ పూర్ణిమ ప్రత్యేకత*  🌹🌹


            మాఘ పూర్ణిమ


 హిందువులు పూర్ణిమ తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పూర్ణిమ తిథి ప్రతి నెల శుక్లపక్షంలో చివరి తేదీ. కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 27న వచ్చింది. ఈరోజున దాతృత్వం , గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు.


  మాఘ పూర్ణిమకి శుభసమయం..


 ఫిబ్రవరి 26 శుక్రవారం మధ్యాహ్నం 3.49 నుంచి పౌర్ణమి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 1.46 నిమిషాలకు ముగుస్తుంది.


    ఉదయ తిథి ఫిబ్రవరి 27న ఉంది పూర్ణిమ తిథి ప్రధానంగా ఈ రోజున జరుపుకుంటారు. ఈ రోజున, నదులలో స్నానం చేయడం మరింత పుణ్యం ఇస్తుంది. పౌర్ణమిని ఉపవాసం పాటించేవారు 2021 ఫిబ్రవరి 26న సత్య నారాయణ వత్రం చేయించాలి. అయితే పూర్ణిమ రోజు ఫిబ్రవరి 27న స్నానం చేయాలి.


చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.


               *కార్తీక మాసం దీపాలకూ , దీపారాధనలకు ప్రసిద్ధి*.


    *మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి*.


           *"మా - అఘం'' అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు*.


         *"మాఘమాసేరటం తాప్యః*

           *కించి దభ్యుదితే రవౌ*


         *బ్రహ్మఘ్నం వా సురాపంవా*    

          *కంపతంతం పునీమహే''*


                  *"ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే , అనగా ... బ్రాహ్మీముహూర్తము  నుంచి జలములన్నియు బ్రహ్మహత్య , సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును''  అని అర్థం*.


                *అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు*.


         *మాఘం అమోఘం :*


                   *మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. "మా'' అంటే మహాలక్షీ. "ధనుడు'' అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మీ కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత , వాగ్దేవి , జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని "శ్రీపంచమి'' అని అంటారు. "శ్రీ'' అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం*.


*"శుద్ధలక్ష్మీః మోక్షలక్ష్మీః జయలక్ష్మీహ సరస్వతే*


*శ్రీర్లక్ష్మీః వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా''*


     *మానవునకు అవసరమైన ఆరు సంపదలలోను విద్యాసంపద ఒకటి. కనుకనే శ్రీమహాలక్ష్మీ "శ్రీపంచమి'' నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు "అక్షరాభ్యాసం'' జరిపిస్తారు. ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమీ తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధసప్తమి "రథసప్తమి'' పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్ధశిని "శివరాత్రి'' పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి , మాఘశుద్ధ ఏకాదశి "భీష్మ ఏకాదశి'' పర్వదినం చేశాడు*.


           *త్రిమతాచార్యులలో ఒకరైన "మధ్వాచార్యుడు'' ఈ మాఘశుద్ధ నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ధ నవమిని "మధ్వనవమి'' గా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహాలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు , వేడుకలు చేస్తారు*.

*జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని "కేతువు'' పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత , మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు "మఖ'' నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి "మాఘమాసం" అనే పేరు వచ్చింది. అందుకే మాఘం - అమోఘం* .

 

   *పితృయజ్ఞానికి ప్రాధాన్యత*


               *మాఘ అమావాస్య పితృ కార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు "పైతృకాలకు'' ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే , ఆదివారం , అమావాస్య , శ్రవణనక్షత్రం , వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని "అర్ధోదయ పుణ్యకాలం'' అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య , శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక , ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం*. 


   *మాఘపూర్ణిమ - మహామాఘి*


    *మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా ! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే "మాఘమాసం''. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ , ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే ... కనీసం "మాఘపూర్ణిమ'' నాడైనా నదీస్నానం గానీ , సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను "మహామాఘి'' అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ "మాఘ పూర్ణిమ'' అత్యంత విశేషమైనది. ఈ "మహామాఘి'' శివ , కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ , కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి*. 


*సముద్ర స్నానం ఎందుకు చేయాలి?*

 *"నదీనాం సాగరో గతిః''*


          *సకల నదీ , నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక , సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ... ప్రతినిత్యం సూర్యకిరణాలవల్ల , ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే , ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం.అఘాది*

 *జడత్వాలు ఆయన తత్త్వం*.


             *సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా "ఆషాఢ పూర్ణిమ , కార్తిక పూర్ణిమ , మాఘపూర్ణిమ , వైశాఖ పూర్ణిమ'' లలో చేయాలని , ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. "స్నానం'' అంటే "షవర్ బాత్'' చేయడమో , "స్విమ్మింగ్ పూల్'' లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి , కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ చాదస్తం అని విసుక్కోవద్దు. చాదస్తం కాదు , సైన్స్. నీటిలో విద్యుచ్ఛక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు*.


             *సూర్యోదయకాలం నుంచి , సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్ఛక్తిని నదీజలాలు , సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని , ఔషధీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి "నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి" అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర , నదీజలాలలో నిక్షిప్తమై వున్న సౌరశక్తి , సోమశక్తులు , ఈ నాభినుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా , ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో "మాఘ పూర్ణిమ'' స్నానం ముఖ్యమైనది*.


*సముద్రం , నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి ? అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ , చెరువుల వద్దగానీ "గంగ , సింధు , కావేరి , కృష్ణ , గౌతమి'' నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి , కర్రలా తేలినా ఫలితం శూన్యం*. 


     *మాఘ పూర్ణిమ స్నానఫలం*


      *ఇంటిలోనే వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.*


      *బావి నీళ్ళతో స్నానం చేస్తే , 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది.*



             *చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది.*


  *సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


          *పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9,600 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


      *సంగమస్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


   . గంగానదిలో స్నానం చేస్తే 3 కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.


    ప్రయాగలోని త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే ... గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరురెట్లు అధికఫలం కలుగుతుంది.


             . సముద్రస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు.


              ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే , మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర మూడు స్నానాలనూ "అంత్య పుష్కరిణీ స్నానాలు'' అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే , మాఘమాసం , మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.

 


   మాఘస్నానం చేస్తున్నప్పుడు


   దుఃఖదారిద్ర్యనాశయ శ్రీ విష్ణోస్తోషణాయచ


ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం


మకరస్తే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ


స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భవ''


     అని పఠించి , మౌనంగా స్నానం చేయాలి , అంటే "దుఃఖములు , దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా ! అచ్యుతా ! మాధవా ! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు'' అని అర్థం.


           ఆ తరువాత ...


"సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ  


త్వత్తేజసా పరిభ్రష్టం పాపం యాతు సహస్రథా''


      అని సూర్యునకు అర్ఘ్యప్రదానం చేయాలి. అంటే "ఓ పరంజ్యోతి స్వరూపుడా ! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక'' అని అర్థం.


    ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత , పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని , ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత , దానధర్మాలు చేయాలి. వస్త్రములు , కంబళములు (దుప్పటిలు), పాదరక్షలు , గొడుగు , తైలము , నెయ్యి , తిలపూర్ణ ఘటము , బంగారము , అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలితే సమర్థత , అవకాశం ఉన్నవారు "నేతితో తిలహోమం'' చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.

 

తిలల (నువ్వులు)కున్న ప్రత్యేకత :


              నువ్వులు అంటే సాక్షాత్తు శనైశ్చరునికి ప్రతిరూపమని , వాటిని తాకితేనే కష్టాలు చేరువ అవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది తప్పు.


     శ్రీమహావిష్ణువు స్వేదబిందువులే "తిలలు'' ... అనగా నువ్వులు.

తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు ఇవి ఈశ్వర ప్రతీకలు. అందుకే , శివునకు ఏకాదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్టస్థానం వుంది. కనుక ఈ మాఘమాసం నెలరోజులూ ఒకవంతు చక్కరకు , మూడువంతులు తిలలు కలిపి  శ్రీహరికి నివేదన చేసి , అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది.


             మాఘపూర్ణిమనాడు "తిల పాత్రదానము'' చేయడం బహుప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే , ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి , వాటిపైన శక్తికొలది సువర్ణము నుంచి


"వాజ్మానః కాయజ త్రివిధ పాపనాశపూర్వకం


బ్రహ్మలోకా వాప్తి కామ స్తిల పాత్ర దానం కరిష్యే'' అని సంకల్పించి


"దేవదేవజగన్నాథ వాంఛితార్థ ఫలప్రద


తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం''


    అని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్రప్రమాణము. ఈ తిలపాత్ర దానము , జాతకరీత్యా శనిదోష , పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి. 


        చివరగా ఓ మాట


             మాఘమాసం నెలరోజులూ పవిత్రస్నానాలు చేయాలనీ , ముఖ్యంగా మాఘపూర్ణిమనాడు సముద్రస్నానం చేయాలని , అందువలన కలిగే ఫలం అధికం అని చెప్పుకున్నాం కదా ! పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు , అమావాస్యకు సముద్రానికి "పోటు'' ఎక్కువగా ఉంటుంది. "పూర్ణిమ'' దైవసంబంధమైన తిథి ... అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం.


        జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమ తిథినాడు రవి , చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు. అమావాస్యనాడు రవి , చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి వుంటారు. రవి , చంద్రులకు , సముద్రానికి ఉన్న సంబంధం ముందే తెలుసుకున్నాం కదా ! ఇక ఆలస్యం ఎందుకు ? మాఘస్నానాలకు ఉపక్రమించండి. పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని , ఆనందాన్ని అందుకుని తరించండి.


ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించడం మంచిది.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

గురు వ్యాఖ్యనం-29






ఓం సుమేరు శృంగ మధ్య స్థాయై నమః


ఇది లలితా సహస్రనామ మహా మంత్రము. అమ్మవారు అంతటా ఉంది, ప్రత్యేకంగా మణిద్వీపము అనే ప్రదేశంలో తన దివ్య శక్తితో ఉంటుంది. ఆ అమ్మవారే భూలోకములో మనలను అనుగ్రహించడానికి హిమాలయ పర్వతాల్లో ఉన్నది. హిమాలయ పర్వతాలలో కేదార శిఖరము చుట్టూ నాలుగు శిఖరములు ఉంటాయి, ఆ శిఖరముల మధ్యలో మేరు శిఖరము ఉంటుంది. మేరు పర్వతం చుట్టూ నాలుగు శిఖరములు, మేరుపర్వతం ఒక శిఖరం మొత్తం ఐదు శిఖరములు, ఈ విధముగా ఐదు శృంగములతో ఉంటుంది (శృంగము అంటే శిఖరము)  అమ్మ మధ్యలో ఉంటుంది. సుమేరు పర్వతం మధ్య లోని ఒకానొక శిఖరము మీద అమ్మవారు కొలువై ఉంటుంది.

మన శిరస్సు మీద ఉన్న బ్రహ్మరంధ్రమును కూడా సుమేరు శృంగ మధ్య అంటారు. అంటే అమ్మవారు సహస్రార కమలము నందు కొలువై ఉండే తల్లి.


ఊర్ధ్వ లోకాలలో మణిద్వీపములో అమ్మవారు ఉంటారు, అందులో నాలుగు మండపాలు ఉంటాయి, ఆ నాలుగు మండపాలలో అమ్మవారు ఉంటుంది, ఆ నాలుగు మండపాలు చుట్టూతా ఉంటే మధ్యలో ఉంటుంది, కనుక అమ్మవారిని సుమేరు శృంగ మధ్యస్థ అన్నారు.


మంత్ర ప్రయోగము౼  ఫలితము:


ఈ నామము జపము చేయడంవల్ల మానవునికి జీవితాంతము బ్రతకడానికి కావలసిన డబ్బు సంపాదించడానికి అవసరమైన ఉద్యోగం లభిస్తుంది.

ఉద్యోగం పురుష లక్షణం మానవుడై పుట్టాక ఏదో ఒక పని చేయాలి. ఒక అద్భుతమైన కీర్తి, సంపదతో కూడిన పని చెయ్యాలి.


ఏమీ కీర్తి లేకుండా, సంపాదించకుండా, పుట్టి పెరిగి యాచించి బ్రతికి చచ్చిపోతే ఏ ప్రయోజనమూ లేదు, కాబట్టి మానవుడు ఏదో ఒక మంచి పని చేయాలి. ఆ పని వల్ల సంపద రావాలి, కీర్తి కూడా రావాలి. ఇలా సంపదను, కీర్తిని కలిగించే మంచి పని ఏదైతే ఉన్నదో దానిని ఉద్యోగము అంటారు.


అటువంటి ఉద్యోగ ప్రాప్తికి ఈ మంత్ర అనుష్ఠానము చాలా ముఖ్యమైనది.

వరుసగా విడిచిపెట్టకుండా (మధ్యలో ఆపరాదు) 27 రోజుల పాటు ప్రతి రోజూ 108 మారేడు ఆకులతో అమ్మవారి రూపును కానీ, విగ్రహమును కానీ లేదా లలితాదేవి పటమును కానీ పెట్టుకొని ఈ 108 మారేడు ఆకులతో అమ్మను పూజించండి. జపము మాత్రము 1008 సార్లు చేయండి. ఓం సుమేరు శృంగ మధ్యస్థాయై నమః, ఇలా 27 రోజుల పాటు ఏకధాటిగా 108 మారేడు ఆకులతో అమ్మను పూజించి 1008 సార్లు ఈ మంత్ర జపము చేసి తరువాత యథాశక్తిగా కర్పూర నీరాజనం ఇచ్చి, ఆ తల్లి అనుగ్రహం పొందితే కేవలము మూడు నెలల్లో ఉద్యోగము వస్తుంది అని చెప్పారు.

జపములో లోపం ఉంటే కొద్దిగా ఎక్కువ సమయం (ఒక సంవత్సరకాలము) పట్టే అవకాశం ఉంటుంది.


మనము ఎంత ఎక్కువ భక్తి శ్రద్ధలతో మనసు చెదరకుండా జపము చేస్తే అంత తొందరగా ఫలితం లభిస్తుంది. ఈ మనస్సు చంచలత్వము పొందుతుంది కదా, కాసేపు నమ్మి కాసేపు నమ్మకుండా చేస్తే ప్రయోజనం ఉండదు, మనసు అటు ఇటు చెదిరిపోకుండా చూసుకోండి. ఈ ఆకులతో పూజ చేసే వాళ్ళు ఒక విషయం గుర్తు పెట్టుకోండి, 27 రోజుల పాటు 108 బిల్వపత్రాలతో పూజ చేస్తున్నారు కదా, ఈ ఆకులను 27 రోజులు అయ్యేవరకూ తీయకండి, అమ్మవారి విగ్రహము మీద ఉన్న ఆకులను పైపైన అటు పక్కకి జరపండి తప్ప, పూజా మందిరంలో నుంచి తీసి వేయవద్దు. 

27 రోజులపాటు పూజామందిరంలో అట్లే పెట్టండి. మారేడు ఆకులు ఇంటిలో ఎండిపోతే కూడా ఆరోగ్యానికి మంచిది, కుటుంబానికి కూడా మంచిది.

27 రోజులు అయిపోయాక చివరన మంగళవారము లేక శుక్రవారము కాకపోతే విగ్రహాన్ని కదపండి, ఒకవేళ మంగళవారం అయితే మరుసటి రోజు బుధవారం నాడు కదపండి, ఒకవేళ శుక్రవారం అయితే మరుసటి రోజు శనివారం నాడు కదపండి.

ఈ ఆకులను మీ పెరటిలో గొయ్యి తవ్వి, పూడ్చి పెట్టే అవకాశముంటే గోతిలో వేసి మట్టి వేసేయండి. అది ఇంటికి కూడా చాలా శుభము, లేదంటే దొడ్డిలో వేయండి, ఎక్కడా కుదరకపోతే కాలువలో కలిపి వేయండి.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-28

 






ఓం కామదాయిన్యై నమః


కామదాయిని అనగా ఒకనికి మంచి కోరికలు కలిగేలా చేసి ఆ కోరికలు తీరే లాగా చేసేది అని అర్థము. కామ దాయిని అంటే కేవలం కోరికలు మాత్రమే తీర్చేది అని ఎప్పుడూ అనుకోవద్దు, సరి అయిన కోరిక కలిగేలా చేసి ఆ కోరిక తీరుస్తుంది, కనుక అమ్మవారిని కామదాయిని అని అన్నారు.

అసలు అమ్మవారి గొప్పతనము అక్కడే ఉన్నది. ముందు వీడికి మనసులో పవిత్రమైన కామం వచ్చేలా చేస్తుంది,  అపవిత్రమైన కామం రాకుండా చేస్తుంది. ఆ పవిత్రమైన కామాన్ని నెరవేరుస్తుంది కనుక జగన్మాత కామదాయిని అని పిలవబడుతుంది.

ఈ మంత్రము గొప్ప అనుకూల దాంపత్య జీవితమును మరియు మంచి సంతానమును ప్రసాదించే గొప్ప మంత్రముగా పురాణములు అభివర్ణించాయి.


మంత్ర ప్రయోగము ౼  ఫలితము:


ఒక చిన్న ఇత్తడి లేదా రాగి లేదా వెండితో చేసిన అమ్మవారి రూపులను తెచ్చుకోండి. 

1) కొద్దిగా తులసి రసము తయారు చేసుకోండి. (సాధారణముగా తులసీ ఆకులను చేతితో పిండితే ఆ పసరు వస్తుంది లేదా మిక్సీలో వేస్తే రసం వస్తుంది).

40 రోజులపాటు ఈ తులసీరసమును ఉద్ధరిణితో అమ్మవారి మీద వేస్తూ ఓం కామదాయిన్యై నమః ఓం కామదాయిన్యై నమః ఓం కామదాయిన్యై నమః అంటూ ఈ మంత్ర జపం చేయండి.

40 రోజులపాటు విడిచిపెట్టకుండా ప్రతిరోజూ 1008 సార్లు మంత్ర జపము చేస్తూ అమ్మవారిని తులసీరసంతో అభిషేకించండి.

అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం అని సంకల్పంలో చెప్పుకోండి. అన్నీ సంస్కృతంలో చెప్పుకోవడం వీలుకాకపోతే కలిసుండాలని కోరుకుంటున్నాము అని చెప్పుకోండి.

లేదంటే 40 రోజులలో మొదటిరోజు మాత్రం ఒక పురోహితుడిని పెట్టుకుని ఆయన ద్వారా సంకల్పము చెప్పించుకొని జపమును మొదలుపెట్టండి.

ఇలా 40 రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఈ మంత్ర అనుష్ఠానము చేస్తే ఎలాంటి కలహాలు కలిగిన దంపతులైనా, విడిపోదాం అనుకున్న దంపతులైనా సుఖంగా కలిసి ఉంటారు.

బయట ఉన్నప్పుడు ఆడవాళ్ళు నాలుగు రోజులు విడిచిపెట్టి ఐదవ రోజు నుంచి చేయండి. మైల వచ్చినప్పుడు ఆడవాళ్ళు, మగవాళ్ళు అయినా జపం చేయకూడదు, మిగతా అప్పుడు నిత్యము కలిసి జపము చేస్తే మరీ మంచిది.

2) సంతాన ప్రాప్తి కోసం అమ్మవారి ప్రతిమను ఆవుపాలతో అభిషేకం చేసి, తరువాత నీళ్లతో శుద్ధిచేసి, తుడిచి బొట్టు పెట్టి, తరువాత ఈ మంత్రమును 1008 సార్లు జపం చేస్తే సంతానం కలుగుతుంది.


తులసీ రసంతో అభిషేకము చేస్తేనేమో అనుకూల దాంపత్యం ఉంటుంది, దంపతులు విడిపోరు, కలిసి ఉంటారు, కలహాల దాంపత్యము కాస్తా కలహాలకు అతీతంగా ఉంటుంది. అదే ఆవు పాలతో అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇలా 40 రోజులపాటు చేసుకొని ఈ మంత్ర ఫలితమును పొందండి.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం - 27

 





ఓం కామాక్ష్యై నమః


కోరికలను తీర్చే కన్ను కలిగినది అమ్మ. అమ్మవారు తన కంటితో అలా చూసిందంటే (కొంతమంది చూస్తే ప్రమాదము కానీ) అమ్మవారు కంటి కొలుకులతో అలా చూసిందంటే చాలు, తన భక్తుల కోరికలు తీరిపోతాయి, అమ్మ కరుణా స్వరూపిణి కనుక.

కోరికలను తీర్చే పవిత్రమైన చూపులు కలిగిన తల్లి అని ఒక అర్థం అయితే కంచి లో అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ముఖ్యమైన ఒక శక్తి పీఠం కామాక్షి అమ్మవారు. కామాక్షి కాంచీపురే. 

కంచి లో కామాక్షి అనే పేరుతో ఉన్నది. పూర్వము అక్కడ ఒంటి మామిడి చెట్టు ఉండేది అంటే ఒకే ఒక మామిడి చెట్టు ఉంటే దానిని ఒంటి మామిడి చెట్టు అంటారు.

అమ్మవారు పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఆ చెట్టుకింద శివుడు తనకు భర్త కావాలని తపస్సు చేసింది.  శివుడు ఆమెకు ప్రత్యక్షం అయ్యాడు, ఏక ఆమ్ర  (ఏకామ్ర అంటే ఒక్క మామిడి చెట్టు) కింద నువ్వు తపస్సు చేశావు కనుక ఈ రోజు నుండి నీవు ఏకామ్రేశ్వరి అన్నాడు.

ఆమ్ర అనే సంస్కృత శబ్దమునకు మామిడి చెట్టు, ఏక అంటే ఒకే ఒక్క మామిడి చెట్టు అని అర్థము. ఆ చెట్టు దగ్గర ఉన్న అధిష్ఠానదేవత మహారాజ్ఞి కనుక ఏకామ్రేశ్వరి, అది కాస్తా మన నోటిలో పడి ఏకాంబరేశ్వరి అయిపోయింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఈశ్వరుడు కనుక ఏకామ్రేశ్వరుడు.

ఆవిడ కోరికను తీర్చి, ఆమెను పెళ్లి చేసుకొని, కంచిలో కామాక్షి అనే పేరును ఇచ్చి, ఒక విగ్రహముగా చేసి అక్కడ ప్రతిష్ఠించాడు. తనంతట తాను విగ్రహం అయ్యేలాగా చేశాడు.  స్వామివారు ఈ మంత్రమును అప్పుడే నారదుని ద్వారా లోక వ్యాప్తి చేశాడట. అమ్మవారికి కామాక్షి అనే పేరు పెడుతున్నాను, నా కోసం తపస్సు చేసింది, నన్ను మెప్పించింది, ఆవిడ అలా చూస్తే చాలు కోరికలు తీరిపోతాయి.


మంత్ర ప్రయోగము ౼  ఫలితము:


1) ఈ కామాక్షి మంత్రజపము చెయ్యండి జాతక దోషాలు తొలగిపోయి కళ్యాణము అయి తీరుతుంది. కొంతమందికి జాతక దోషముల వల్ల కళ్యాణము అవ్వదు. ఇటువంటి వారందరికీ అత్యంత శీఘ్ర ఫలప్రాప్తిని ఇచ్చి, కళ్యాణ ప్రాప్తి అయ్యేటట్లు చేసే అత్యద్భుతమైన దివ్య మంత్రము, జాతక పరిహారము చేసేటటువంటి గొప్ప మంత్రము ఇది.

అసలు జాతక దోషాలు తొలగిపోయి అనుకున్న పనులు అయితే అప్పుడు వాడికి హాయిగా ఆనందం సిద్ధిస్తుంది. అటువంటి ఆనంద సిద్ధిని ఇచ్చే అద్భుతమైన కామాక్షీ మంత్రము ఇది.

విడిచిపెట్టకుండా నలభై ఒక్క (41) రోజుల పాటు (ఆడవాళ్లు బయట ఉన్న నాలుగు రోజులు విడిచిపెట్టి) ఏకధాటిగా అమ్మవారి పటమును లేదా విగ్రహమును పెట్టుకొని రకరకాల సువాసనలు వచ్చే పూలతో ఓం కామాక్ష్యై నమః  అంటూ ఈ పువ్వులతో పూజ చేయండి.

1008 సార్లు జపము చేయాలి కనుక వెయ్యి ఎనిమిది (1008) పువ్వులు పెట్టుకోండి. నలభై ఒక్క రోజుల పాటు 1008 పువ్వులతో 1008 సార్లు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ పూజ చేస్తే 41 వ రోజుతో వారి జాతక దోషాలు అన్నీ పూర్తిగా పరిహారమై పోతాయి. హాయిగా పెళ్లి అయిపోతుంది. అంతవరకూ జీవితంలో కష్టాలు అనుభవిస్తున్న వారు అసలు ఇంత తేలికగా సుఖాలు వస్తాయా అనుకుంటారట.


2) అసలు అమ్మవారి పేరే కామాక్షి కనుక కోరిన కోరికలను తీర్చేది లేదా కాముడ్ని కూడా బ్రతికించ గలిగే కళ్ళు కలిగినది అమ్మవారు కనుక ఆవిడను పూజిస్తే కంటి రోగాలు కూడా తొలగుతాయి.

కొంత మందికి కంటిచూపు చిన్నప్పటినుంచి సక్రమంగా ఉండదు, నానా యాతనా పడతారు, ఎన్ని కళ్ళజోళ్ళు వేసుకున్నా కళ్ళు అలా నిరంతరం అనారోగ్యానికి గురై నిరంతరం బాధామయంగా ఉంటాయి. అటువంటి వారు ఆవునెయ్యితో అమ్మవారిని అభిషేకం చేస్తూ తొమ్మిది రోజుల పాటు ఏకధాటిగా ఈ మంత్రమును 1008 సార్లు జపించండి (ఆవు నెయ్యి కరగబెట్టి కాస్త చల్లారాక అప్పుడు అభిషేకం చేయండి, వేడి వేడిగా ఉన్నప్పుడు అభిషేకించకూడదు). ఇలా చేస్తే కంటికి సంబంధించిన వ్యాధులు తొలగి క్రమక్రమంగా చూపు బాగుపడుతుంది. కామాక్షీ మంత్రము నేత్ర రోగ వినాశకం, నేత్ర దృష్టిని చక్కగా ప్రసాదిస్తుంది.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

Tuesday, February 23, 2021

భీష్మ ఏకాదశి

 






🌹🌹🌹   భీష్మ ఏకాదశి  🌹🌹🌹



   మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం శ్రీ విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు.


"మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః"


            కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు.


         అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది , మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు , ధర్మశాస్త్రాలను ఆపోసన పట్టి పూర్తిగా ఆకళింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది, ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి' అని భీష్మపితామహుడి చెంతకు తీసుకువచ్చాడు.


      సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు, ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు.


         తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు, ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది. భీష్ముడు తనకి మాతా పితా భ్రాతా నివాసః శరణం సుహృత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు.


 అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట ! అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే ? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేక పోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపదీ ! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు.


        కురుసభలో వస్త్రాపహరణం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు , కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకూ కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు.


              ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునునితో చెప్పాడట. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పడేశాను , ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప , ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట.


        భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే , పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా ! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని ప్రశ్నించిదట. అందుకు భీష్ముడు 'అవును తల్లీ ! నా దేహం నా అధీనంలో లేదు , అది దుర్యోధనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా , నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు.


 కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు , పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్యజించాడు. ' హే ద్రౌపదీ ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు , కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను , అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించి ధర్మసూత్రాలను చెప్పించాడు.


                       నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు , నీవే చెప్పవచ్చు కదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం , నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా ! అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు.


        భగవంతుడు సముద్రం లాంటి వాడు , నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి , భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు , విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

గురు వ్యాఖ్యనం -26

 






ఓం కదంబ వనవాసిన్యై నమః


కదంబము అని ఒక వృక్షము ఉన్నది, దీనిని సంస్కృతంలో కదంబము అంటారు, తెలుగులో కడిమిచెట్టు అంటారు. శ్రీకృష్ణుడికి, అమ్మవారికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైన చక్కటి చెట్లలో ఇది ఒక చెట్టు.

అసలు ఈ చెట్టు పెరగాలి అంటే లలితా సహస్రనామం పారాయణ చేయండి అనేవాళ్ళు పూర్వము. లలితా సహస్రనామము పారాయణ జరగని చోట ఈ చెట్టు అసలు పెరగదు. అమ్మవారికి ఈ చెట్టు అంత ప్రీతిపాత్రమైనది.

అసలు ఒక్క చెట్టు అంటేనే అమ్మకు ఇష్టము అంటే ఇక చెట్లతోట, అనేక వృక్షాలు ఉన్న తోటలో మనము అమ్మను పూజిస్తే అమ్మ ప్రత్యక్షము కాకుండా ఉంటుందా? అమ్మ కదంబ వనవాసిని అంటే  అమ్మవారు కదంబ వృక్షముల తోటలో నివసించునది అని అర్థము.

మానవ జీవితానికి అనేక దుఃఖములు ఉన్నాయి, కానీ అందులో ఐదు దుఃఖముల గురించి ఎక్కువగా చెప్పాయి మన పురాణాలు.

ఈ ఐదు రకముల దుఃఖములు మానవులను అనుక్షణము పట్టి పీడిస్తూనే ఉంటాయి.

అందులో కొడుకులు పుట్టకపోవడం ఒక దుఃఖము, వాళ్ళు పుట్టి దుర్మరణం పాలవడం మరొక దుఃఖము. అసలు పిల్లలు లేకపోతే ఒకటే బాధ, కానీ పిల్లలు పుట్టి వాళ్ళు మధ్యలో చనిపోతే ఆ తండ్రికి వచ్చే బాధ అంతా ఇంతా కాదు. అందుకే పుత్ర శోకము మహా కష్టము అన్నారు, ఏదో కొద్దికాలము పోయాక మరచిపోతారు, నిత్యము ఏడుస్తూ కూర్చోరు కదా.

నిత్య దుఃఖము ఒక్కటి ఉన్నది, అది ఆకలి దప్పిక వల్ల వచ్చే దుఃఖము. పొద్దున లేచిన దగ్గరనుండి పడుకునే వరకు ఎప్పుడో ఒకప్పుడు దాహము వేస్తుంది, మంచి నీళ్లు తాగకపోతే ఆ దాహం తీరదు. ప్రయాణం చేస్తున్నప్పుడో లేక ఇంటి దగ్గర ఉన్నప్పుడో అన్నము తినకపోతే వాడు బాధపడిపోతాడు.

కాబట్టి మొదటిది పుత్రశోకం వల్ల కలిగే దుఃఖం అయితే రెండవది ఆకలి, దప్పికల వల్ల కలిగే దుఃఖము, ఇవి తీరకపోతే మహాబాధ.

ఇక మూడవది ఏమిటంటే అపనిందా దుఃఖము. చెయ్యని తప్పుకు కూడా వాడు పది సార్లు తప్పు చేశావు, తప్పు చేశావు, తప్పు చేశావు అంటూ ఉంటే గిజగిజలాడి పోవడం.

మనము హాయిగా ఉందాము అనుకున్నా ఈ ప్రజలు మనలను హాయిగా ఉండనివ్వరు. వాడు నిన్ను ఇలా అన్నాడు, నీకు ఈ అపవాదం వచ్చింది అని రోజూ బాధపెడుతూ ఉంటారు, లేదా ఒకరితో ఒకరిని పోలుస్తూ ఉంటారు. దీని తోటి ఈ అపనిందలు తట్టుకోలేక అయ్యో నేను అన్నీ బాగానే ఉన్నా ఈ అపవాదాలు ఎందుకు వచ్చి పడుతున్నాయి, ఈ అభాండాలు అని బాధపడతాడు.

ఇక నాల్గవది రోగ దుఃఖము. ఇది మరీ బాధ. కాళ్ళకి, కంటికి, పంటికి, జుట్టుకి రోగాలు, గట్టిగా నాలుగు మెతుకులు తినలేడు, తింటే అరగక బాధ, పడుకుంటే ఒక బాధ, పడుకోకపోతే ఒక బాధ, శరీరమునకు బొజ్జ పెరిగిపోతే ఒక బాధ ఇలా అనేక శారీరక, మానసిక జాడ్యాలు ఉంటాయి. ఇవి ఒక బాధ. ఇక అన్నిటికంటే చివరిది, ఐదవది అసలు సంసారమే ఒక దుఃఖము అన్నారు. అందుకే  సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత అని యోగ శాస్త్రములో ఒక శ్లోకము ప్రత్యేకముగా ఉన్నది.

అసలు సంసారమే ఒక సాగరము, ఈ సంసారంలో పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో పడ్డారంటే ఈ స్త్రీ, పురుషులు ఇద్దరు పిల్లల వల్ల బాధ, సంపాదన బాధ, మళ్లీ ఈ భార్య భర్తలు కొట్టుకోవడం దుఃఖం ఇలా ఈ మాయదారి సంసారంలో నిరంతరము దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. ఇన్ని రకాల దుఃఖములను తొలగించే మహా మంత్రము ఇది.

అసలు దీని పేరే దుఃఖ నివారణ మంత్రము. పంచ దుఃఖ నివారక మంత్రము. 


మంత్ర ప్రయోగము ౼  ఫలితము:


పసుపు రంగు పువ్వులు తీసుకోండి. అంటే చామంతి పువ్వులు, సువర్ణ గన్నేరు పువ్వులు వంటివి మొదలైనవి ఏవైనా పసుపుపచ్చ రంగులో ఉండే పువ్వులు తీసుకోండి. సుగంధము ఉన్న పువ్వులు అయితే ఇంకా బాగా పనిచేస్తాయి. ఇలాంటి పువ్వులు వేయి ఎనిమిది (1008) సిద్ధం చేసుకోండి.

తొమ్మిది శుక్రవారాల పాటు అమ్మవారి విగ్రహమును కానీ పటమును కానీ దేనినో ఒకదానిని పెట్టుకొని అమ్మవారిని ఈ పువ్వులతో పూజ చేస్తూ ఓం కదంబ వనవాసిన్యై నమః అంటూ ఈ మంత్ర జపము చేస్తూ పూజ చేయండి. దొరికితే కదంబ పుష్పాలతో కూడా పూజ చేయండి. ఈ కదంబ పుష్పం యొక్క కర్ణిక పసుపురంగులో చాలా బాగా ఉంటుంది. మొత్తం తొమ్మిది శుక్రవారాలు ప్రతి శుక్రవారము ఉదయం పూట చేయాలి. అమ్మవారి పటం కానీ, విగ్రహం కానీ పెట్టుకోవాలి. ఓం కదంబ వనవాసిన్యై నమః  అంటూ 1008 పువ్వులతో అమ్మవారిని పూజ చేయాలి.

నైవేద్యముగా వెన్నపూస కానీ, పంచదార కానీ, పటిక బెల్లం కానీ పెట్టాలి. ఈ నైవేద్యమును పూజ అయిన తరువాత పూజ చేసిన వారు తప్పక ప్రసాదముగా స్వీకరించాలి. ప్రసాదంగా స్వీకరించడానికి పనికొచ్చే అంత నివేదన చేయండి.

ఇలా తొమ్మిది శుక్రవారాలు చేస్తే సకల దుఃఖములు పైన చెప్పిన 5 దుఃఖములు. పుత్ర శోక దుఃఖం, ఆకలి, దప్పిక వల్ల కలిగే దుఃఖం, భార్యాభర్తలకి వచ్చే తగాదాలు, అపనిందా దుఃఖం, రోగ దుఃఖం, సంసార దుఃఖం వంటి సకల దుఃఖాలు ఈ మంత్ర ప్రభావం వలన తొలగించబడతాయి.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

Monday, February 22, 2021

గురు వ్యాఖ్యనం -25







ఓం జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగాయై నమః


అత్యంత బలహీనమైనది మనస్సంటే. చిన్న చిన్న కష్టాలకు కూడా ఇది ఓర్చుకోలేదు. మానవులకు మనస్సు ఎంత బలహీనంగా ఉంటుందో స్వయంగా హనుమంతుడు, సీతాదేవి కూడా చూపించారు.


సీతాదేవిని అన్వేషణ చేయడానికి వెళ్ళాడు హనుమంతుడు, లంకానగరం మొత్తం తెగ వెతికాడు, ఎక్కడా సీతాదేవి కనబడలేదు, ఆగ్రహోదగ్రుడై లంకంతా ధ్వంసం చేసేద్దామా అనుకున్నాడు కూడా. కానీ తీరా రావణాసురుడు సీతను లంకకు తీసుకొని రాకపోతే వీడిని చంపడం ఎందుకు, లంకను పాడు చేయడం ఎందుకు.  ఇప్పుడు సీత కనపడకపోతే నేను వెనక్కు వెళితే, రాముడు సీత కనబడిందా అని అడుగుతాడు, నేను సీత కనపడలేదు అంటాను, అప్పుడు ఆయన తట్టుకోలేక మరణిస్తే, లక్ష్మణుడు కూడా మరణిస్తాడు. రామ లక్ష్మణులు మరణిస్తే, భరత శత్రుఘ్నులు మరణిస్తారు, దీనితో అయోధ్యాపుర వాసులంతా ఆత్మహత్య చేసుకుంటారు, కృతజ్ఞత కలిగిన సుగ్రీవుడు కూడా మరణిస్తాడు. మేమంతా కూడా చనిపోతాము.


ఇంత మందిని చంపడం కంటే అసలు నేను వెనక్కి వెళ్లకపోతే, నేను ఇంకా వస్తాను అని వాళ్ళు ఎదురు చూస్తారు కనుక నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకోకూడదా అనుకున్నాడు. విషము తాగి చచ్చిపోనా, ఉరివేసుకొని చచ్చిపోనా, లేదా అగ్నిలో దూకి చచ్చిపోనా అని అనుకున్నాడట ఆయన. అంతలోనే ఆయన మహానుభావుడు కనుక ధైర్యం తెచ్చుకున్నాడు, ఆగాడు. ఆగడము వలన మొత్తం రామాయణ కథ మారిపోయింది. సీత కూడా అంతే జడను మెడ చుట్టూ గట్టిగా వేసుకొని బిగించుకొని చనిపోతాను అనుకున్నది, ఇంతలో హనుమంతుడు వచ్చి రామ కథ చెప్పబట్టి ఆవిడ బ్రతికింది.


అప్పటికీ ఇప్పటికీ సీత అంటే మనమందరమూ జీవాత్మలము. ఏ బలహీన క్షణంలో తొందరపడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటామో తెలియదు.


మంత్ర ప్రయోగము ౼  ఫలితము:


1) ఎవరికైనా ఎప్పుడైనా పిరికితనము వలన ఆత్మహత్య చేసుకోవాలని పిస్తే ఈ మంత్ర అనుష్ఠానము చేయండి

1) ఈ అద్భుతమైన లలితా దేవి మంత్రము మానవునికి బలహీనత లేకుండా చేస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనే బలహీనత పోవడంవలన ఆత్మస్థైర్యం కలిగి, జీవితములో అభివృద్ధిని ఇస్తుంది.

2) అగ్ని ప్రమాదం సంభవించి చుట్టుపక్కల ఇల్లు తగలబడి పోయి మన ఇంటి మీదకు కూడా ఆ అగ్నిజ్వాలలు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు (జ్వాలా మాలినిక అంటే జ్వాలామాలలు తో కూడిన, క్షిప్త అంటే దానితో నిక్షిప్తము చేయబడినటువంటి, వహ్ని ప్రాకార మధ్యగా అంటే అగ్ని మధ్యలో ఉందట అగ్ని ప్రమాదము లేకుండా కూడా కాపాడుతుంది ఈ అద్భుత మంత్రము.

కాబట్టి ఇటు ఆత్మహత్యలు చేసుకోవాలనే బాధని తొలగిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. తీవ్ర అగ్నిప్రమాదంలో నుండి కాపాడుతుంది.



సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

Sunday, February 21, 2021

గురు వ్యాఖ్యనం-24






ఓం సర్వలోకచారిణే నమః


అత్యద్భుతమైన హనుమన్ మంత్రాలలో ఇది కూడా ఒకటి. సర్వ అంటే అన్ని లోకాలు సంచరించేవాడు హనుమంతుడు.హనుమంతుడు తిరగలేని లోకం అంటూ లేదు.

హనుమంతుడు బ్రహ్మలోకము మొదలుకొని అధోలోకాల వరకు తన యొక్క మహా బలముతో, మహా వేగముతో, మహా పరాక్రమముతో చిటికెలో వెళ్ళగలడు ఆయన. మహా విశాలమైన శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని కూడా అవలీలగా దాటినవాడు ఆయన. 100 యోజనముల విస్తీర్ణం ఉన్న సముద్రాన్ని దాటి లంకా నగరమునకు వెళ్ళినా కూడా ఆయన ఒక్క నిట్టూర్పు కూడా విడవలేదు, ఏ మాత్రము ముఖములో అలసట లేదట. అంతటి మహా పరాక్రమవంతుడు సమస్త లోకములు తిరగడము పెద్ద కష్టం ఏమీ కాదు.

ఆయన తలుచుకుంటే ఒక చిటికె వేసే కాలములో వెళ్లి రాగలడు అటువంటి మహాత్ముని మంత్రము. ఈ మంత్రము విదేశీ యాత్రలకు పనికివచ్చే మంత్రము.

ఇవాళ చాలా మంది ఏదో దేశానికి వెళ్లి చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని కోరుతున్న వాళ్లు అక్కడ కొంతకాలం ఉండి ధనము సంపాదించి మళ్లీ మన దేశానికి వచ్చి ఇక్కడ సేవ చేయాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. విదేశీయాన ప్రయత్నం సక్రమంగా జరగక బాధపడుతున్న వారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా వీసా దొరకక బాధపడుతున్నవారు ఈ మంత్రమును అనుష్ఠానము చెయ్యండి.


మంత్ర ప్రయోగము ౼  ఫలితము:


శనివారము కానీ మంగళవారం కానీ పూజామందిరములో హనుమంతుని యొక్క విగ్రహం బొటనవేలు అంత సైజు మించకుండా రాగితో గానీ ఇత్తడితో గానీ ఏదైనా లోహంతో చేసిన విగ్రహం కావచ్చు (ఇనుముతో చేసిన విగ్రహాలు మాత్రం వాడకూడదు, కేవలం శని గారికి మాత్రమే ఇనుముతో చేసిన విగ్రహాలు వాడవచ్చు) పూజామందిరంలో పెట్టుకుని మంగళవారము కానీ శనివారము కానీ పూజ ప్రారంభించాలి. శుక్రవారం కూడా పనికొస్తుంది అని చెప్పారు. ప్రథమ స్థానం మంగళవారం రెండవ స్థానం శనివారము మూడవ స్థానం శుక్రవారము. ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు హనుమంతుని విగ్రహమును పూజామందిరంలో పెట్టుకుని 40 రోజుల పాటు గంధ సింధూరంతో అనగా హనుమంతుడిని పూజించే కుంకుమతో ఈ మంత్రము చెప్పుకుంటూ ఓం సర్వలోక చారిణే నమః అంటూ కుడిచేతి మధ్యవేలు ఉంగరం వేలితో ఆంజనేయుని మీద ఈ గంధ సింధూరమును వేస్తూ ఈ మంత్రముతో పూజ చేయాలి. 1008 సార్లు జపం చేస్తూ 40 రోజులపాటు సింధూరంతో ఆంజనేయుడిని పూజించాలి. 41వ రోజు అప్పాలు నైవేద్యంగా పెట్టి ఈ అప్పాలను భక్తులందరికీ ప్రసాదంగా పెట్టండి. ఆడవాళ్లకు ఇబ్బంది వస్తే నాలుగు రోజులు ఆపివేసి మళ్ళీ ఐదవ రోజు నుంచి ప్రారంభించండి. చివరి రోజున అప్పాలు నైవేద్యంగా పెట్టండి.

తరువాత ఈ విగ్రహాన్ని యథాస్థానం ప్రవేశయామి అని అంటే తిరిగి పంపించేస్తున్నాము అని స్వస్తిచెప్పి కదిపేసి ఎవరైనా ఒక పండితునికి దక్షిణ తో తాంబూలముతో దానం ఇచ్చి వేయండి.

భగవంతుడి విగ్రహము ఇంటిలో ఉండడం ఎప్పుడూ మంచిదే కానీ ఒక కార్యసిద్ధి కోసం తెచ్చుకున్న విగ్రహం కాబట్టి కార్యసిద్ధి అయిపోయాక దానిని భరించే శక్తి పండితులకే ఉంటుంది. వీలుంటే ముగ్గురు లేక ఐదు మందికి భోజనము పెట్టుకోండి. పూర్వం సముద్రం మీద ప్రయాణానికి వెళ్లే వర్తకులంతా ఈ మంత్రమును అనుష్ఠానం చేసేవారట. 


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

Friday, February 19, 2021

భీష్మ పంచకం

 







🌹 *రేపటి నుండి భీష్మ పంచకం* 🌹


       *వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు. కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు ! తండ్రి  సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అన్న సంశయంతో.... ఆజన్మాంతం పెళ్లి చేసుకోనంటూ ‘భీషణ’ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు*.


               *భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున , తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. భీష్ముడు జీవితం యావత్తూ పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు*. 


    *తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు , రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు*.


           *అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకొంటున్నాము*.


    *ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికీ వర్తిస్తాయి. దశమినాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకూ ఉపవాసం ఉండమనీ , ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయమనీ పెద్దలు సూచిస్తారు. దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది. భీష్ముడు అందించిన విష్ణుసహస్రనామాలను ఈనాడు జపిస్తే , విశేష ఫలితం దక్కుతుంది. అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి అని కూడా పిలుచుకోవడం జరిగినది . భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజని అంటారు*.


       *భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకం. అందుకనే ఆ పేరు. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే ! ఆచార్యునిగా , భరతవంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతారు*. 


           *రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి , బహుశా ఈ సూచని చేసి ఉంటారు. భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ అయిదు రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు*.    


                  *భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ అయిదు రోజులనూ కేటాయిస్తారు. మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశినాడు ఉపవాసం ఉంటూ* , *విష్ణుసహస్రనామాలను జపిస్తూ, భగవద్గీతను పఠిస్తూ , భీష్ముని తల్చుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది.*


*ఓం నమో భగవతే వాసుదేవాయ నమః*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

నేడు ఛత్రపతి శివాజీ జయంతి 🌹

 







🌹 నేడు ఛత్రపతి శివాజీ జయంతి 🌹


 ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. తెలుగు సంవత్సరం , 1674 సంవత్సరం , హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక  వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివస్ జరుపుకుంటారు.


             ఉపోద్ఘాతం


        శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్  దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధుణ్ణి నిజాంషాహీ ప్రభువు హత్య  చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు.


                   బాల్యం


     శివాజీ క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ , జిజియాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు.  వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం | వ్యవసాయ బొస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జీజియ బాయ్ యాదవ్ క్షత్రియ వంశమునకు చెందిన ఆడ పడుచు. (దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశము). శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకు పెట్టింది. షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా , మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా  పొంది , పూణే వదిలి వెళ్లవలసి  వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు. ఛత్రపతి  శివాజీ మహారాజ్ కి జయ్ (అరవింద్ నాగులా). హిందూ సంప్రదాయాలు కాకుండా , అతనికి 8 మంది భార్యలు ఉన్నారు.


      సామ్రాజ్య అంకురార్పణ


        షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన , ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ బలి చక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం , స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.


      సుల్తానులతో యుద్ధాలు


          17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం  చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను  సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన , రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.


         శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని , బెంగుళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్‌ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు.


          ప్రతాప్‌ఘడ్ యుద్ధం


     శివాజీ మెరుపుదాడులు , గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చకొట్టడానికి శివాజీ ఇష్ట దైవమయిన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు.


          అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినపుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను , శివాజీ సైన్యాధికారులు అడ్డుకోనగా , శివాజీ తన దగ్గరున్న పిడి పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీనరసింహ వలె చీల్చి          చెండాడుతాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుండగా , ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు.


      అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమయిన అడవుల్లో అటకాయించి మెరుపుదాడులతో మట్టికరపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగయినా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్థూన్ సైనికులను పంపించగా , శివాజీ సేన వేల సంఖ్యలో పస్థూన్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్ఠలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు.


        కొల్హాపూర్ యుద్ధం


           ఇది సహించలేని బిజాపూర్ సుల్తాన్ అరబ్ , పర్షియా , ఆఫ్ఘన్ నుండి మెరికల్లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. 'హర హర మహాదేవ' అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృభించి శతృవులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికయినా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలు పెట్టాడు. తన మేన మామ షాయైస్త ఖాన్ ను శివాజీ పై యుద్ధానికి పంపాడు.


          పవన్‌ఖిండ్ యుద్ధం


              రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న అదిల్షా మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమయిన సైనిక , ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్‌హాలా కోటలో శివాజీ కొన్ని వందలమంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ విషయం తెలుసుకొన్న శివాజీ ఎలాగయినా పన్‌హాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్‌ఘడ్ కోటకు చేరుకొంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు. కానీ అప్పటికే పన్‌హాలా కోట చుట్టూ శత్రుసైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్దంగా లేనని దయతలచవలసినదిగా సిద్ది జోహార్‌కు వర్తమానం పంపాడు. అది తెలుసుకొన్ని సిద్ది జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకొంటుంటే , శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోటవైపు పయనించసాగాడు. చివరిక్షణంలో ఇది తెలుసుకొన్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు.


    కోటకు చేరుకొనేలోపు శత్రువులు తమను సమీపించగలరు అన్ని విషయం గ్రహించి బాజీ ప్రభు దేశ్‌పాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలసి తాము శత్రుసైన్యాన్ని ఎదుర్కొంటామని , శివాజీని తన అంగరక్షకులతో ఎలాగయినా కోట చేరుకోమని చెప్పి ఒప్పించాడు. శివాజీ కోట వైపు వెళ్ళిన వెంటనే బాజీ ప్రభు దేశ్‌పాండే రెండు చేతులా ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేశాడు.


            300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమయిన శత్రువులతో పొరాడి నేలకొరిగారు. అప్పటికి శివాజీ తన కోట చేరుకున్నాడు. కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా పన్‌హాలా కోట లభించింది. ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం. ఆ తరువాతి కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది.


     మొఘలులతో యుద్ధాలు


       (షైస్తా ఖాన్ తో యుద్ధం)


              1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్‌కు లక్షకు పైగా సుశిక్షుతులయిన సైన్యాన్ని , ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. బలమయిన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్‌లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరుచుకొన్నాడు.


                    ఎప్పటికయినా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమయిన భద్రతను ఏర్పాటు చేసాడు. 1663 ఏప్రిల్ లో నగరంలో ఒక పెళ్ళి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలసి పెళ్ళికూతురు తరపున బంధువుల్లో కలసిపోయి లాల్ మహల్ చేరుకొన్నాడు. ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడింది. కాబట్టి , సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకొన్నాడు. శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఖాన్ మూడువేళ్ళు తెగి కింద పడగా , షాయిస్తా ఖాన్ కిటికీలో నుండి దుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు. అంతలో ఇది పసిగట్టిన షైస్తా ఖాన్ అంగరక్షకులు షాయిస్తా ఖాన్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళారు. మొఘలులకు మచ్చ తెచ్చిన షాయిస్తా ఖాన్‌ను ఔరంగజేబు సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపించివేసాడు.


          సూరత్ యుద్ధం


          1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపారకేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని , ఆయుధాలను దోచుకున్నాడు. అపారమయిన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేలమందిని తన సైన్యంలో చేర్చుకొన్నాడు. కొద్దిరోజుల్లో మొఘలుల , బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు.


                ఇది చూసిన ఔరంగజేబు ఆగ్రహోద్రుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడయిన రాజా జై సింగ్‌ను శివాజీ పైకి పంపించాడు. రాజా జై సింగ్ గొప్ప రాజ నీతిజ్ఞుడు. రాజా జై సింగ్ అద్వర్యంలో మొఘల్ సేనలు మొదట పురంధర్ దుర్గాన్ని ఆక్రమించాయి. తర్వాత రాయఘర్ ఆక్రమనకై సేనలు ముందుకు సాగుతుండగా ఓటమి గ్రహించిన శివాజీ రాజ జై సింగ్ తో సంధికి దిగాడు. 1665 లో శివాజి రాజా జై సింగ్ తో పురంధర్ వద్ద సంధి చేసుకున్నాడు. తర్వాత కూడాను కూడా ఒక మొఘల్ సర్దార్‌గా ఉండడానికి అంగీకరించాడు. మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని తన శతృవులయిన బిజాపూర్ , గోల్కొండ సుల్తానులను ఓడించడానికే శివాజీ మొఘల్ సర్దార్‌గా ఉండడానికి ఒప్పుకున్నాడు.


               ఆగ్రా కుట్ర


            1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని , అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. సభలో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజీ బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్ళి అక్కడే బందీ చేశారు.


        ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా , దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు , గుడులకు , ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీ , శంభాజీ ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని ఒక వాదన.


      తప్పించుకున్న తర్వాత శివాజీ రాయఘర్ చేరుకున్నాడు. ఆ తర్వాత రెండు సంవత్సరముల వరకు శివాజీ మోఘలులపై ఎటువంటి సైనిక చర్యకు దిగకుండా పురంధర్ సంధికి కట్టుబడి ఉన్నాడు. మువ్వాజం అనే దక్కన్ రాష్ట్ర పాలకుడి సలహా మేరకు ఔరంగజేబు శివాజీ ని రాజుగా గుర్తించాడు. కొన్ని రోజులకు ఈ శాంతి ఒప్పందం పటాపంచాలైనది. మొఘలు సైన్యాధిపతులు మహాబత్ ఖాన్ , బహుదూర్ ఖాన్ , దిలేవార్ ఖాన్ లు మూకుమ్మడిగా శివాజీ పై దాడి చేశారు కానీ వారి ఎత్తులు పారలేదు. శివాజీతో యుద్ధంలో వారు ఘోర పరాజయం పొందారు. శివాజీ జీవిత చరిత్రలో ముఖ్యమైన విజయంగా దీన్ని పేర్కొనవచ్చు.


 అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల , మొఘలులు మరిన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉండడంవల్ల ఔరంగజేబు శివాజీనుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యంపోందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి లక్ష మంది సుశిక్షితులయిన సైన్యాన్ని , ఆయుధాలు , అశ్వాలు , నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం , సరి అయిన సైన్యం లేకపోవడం , ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది.


          సింహగఢ్ యుద్ధం


  శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా , పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు. ఆకోటను ఉదయ్‌భాన్ రాథోడ్ అనే రాజపుత్రుడు పరిరక్షిస్తుండడమే కారణం. దుర్భేధ్యమయిన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తనదగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకొన్ని తానాజీ మలుసారేకి ఆ కోట స్వాధీనం చెసుకొని బాధ్యత అప్పగించాడు.


           తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్దిరోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమయిన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ 'యశ్వంతి' అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు.


          అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట  ముఖద్వారంపైన దాడి చేసాడు. మారాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకరపోరులో మరాఠాలు గెలిచినా తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ 'కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకొన్నాము' అన్నాడు. సింహంవలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహఘడ్‌గా మార్చాడు.


                 చివరిదశ


          శివాజీ పట్టాభిషేకము జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద మంత్రాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి' అని బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రచేసి వెల్లూరు , గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించాడు*.


     శివాజీ పెద్దకొడుకయిన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు.


       పరిపాలనా విధానం


            యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి , విదేశాంగ విధానం , పటిష్ఠమయిన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసాడు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి , వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు.


                వ్యక్తిత్వం


సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి , స్త్రీలకు , పసివారికి సహాయం చేసాడు.


   ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం  రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో "నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి , అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విదంగా గౌరవించబడ్డారు. అనేక మసీద్ లు నిర్మించిన హిందూ పాలకుడు. మనువాదం అమలులో లేదు.


             నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం , తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం , మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు , ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేసాయి.


                 సైన్యం


  మరాఠా సామ్రాజ్యం ముగిసేవరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. పటిష్ఠమయిన నౌకా దళాన్ని , ఆశ్వికదళాన్ని ఏర్పాటు చేసాడు. ఎనిమిది నెలలు పంటలు పండించే రైతులు కూడా నాలుగు నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలను అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాలవారు కోటను పరిరక్షించేవారు. మరణించే నాటికి శత్రువులందరూ వెనుకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ.


                  కోటలు


        మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు  దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.


          మతసామరస్యం


  శివాజీ భవానిదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు. ఎందరో ముస్లిములు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి , ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి , సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్‌ ఖాన్‌ , సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు ! శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ , అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహ్తర్‌ కూడా ముస్లిమే !


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

గురు వ్యాఖ్యనం-23

 



ఓం వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనాయై నమః


లలితా సహస్రనామం లోని ఒక మహా మంత్రము ఇది. అమ్మవారి ముఖము పరివాహము అంటే నదీ ప్రవాహము. అసలు అమ్మవారి ముఖమే చాలా సౌందర్యంగా ఉంటుంది. అందుకే దానిని వక్త్ర లక్ష్మీ అన్నారు. ముఖలక్ష్మి, మహా అద్భుతమైన సౌందర్యంతో ఉన్న అమ్మవారి ముఖమును చూడగానే వర్షాకాలంలో వేగముగా ప్రవహిస్తున్న నది లాగా ఉంటుందట. అమ్మవారి ముఖలక్ష్మి ఒక నదీ ప్రవాహమయితే, ఆ ప్రవాహంలో కదులుతున్న చేపలు లాగా ఉన్నాయట అమ్మవారి కళ్ళు.


అసలు ఆడవారి కళ్ళను చేపలతో పోలుస్తారు. చేపలు మిలమిలలాడుతూ ఉంటాయి, ఈ కళ్ళు కూడా అలాగే మిలమిలలాడుతూ చేపల లాగా ఉంటాయి, అందుకే అమ్మవారికి మీనాక్షి అని కూడా ఒక పేరు ఉన్నది. ఎందుకు చేపల తోనే పోల్చారు, పద్మాక్షి అనకుండా, ఈ నామాన్ని ఇక్కడ ఎందుకు ప్రయోగించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము.


చేప తన పిల్లలను పాలిచ్చి పెంచదు, లేదా వేరే ఆహారం పెట్టి పెంచదు, అలా చూపులతో పెంచుతుంది. చేపలు గుడ్లు పెడతాయి, ఈ గుడ్లు వాటంతటవే పాలు లేకుండా పెరిగి పెద్దవవుతాయి, పెరిగి పెద్దయ్యాక వాటి ఆహారము ఎలాగో అవి చూసుకుంటాయి, కానీ పిల్లలను చేప అలా చూసీ చూడగానే వాటికి పాలు ఆహారము అందినట్లుగా అయి అవి పెరుగుతాయి.

ఇంకొక విషయము కూడా ఉన్నది. చేప ఎప్పుడూ కళ్ళు తెరుచుకునే నిద్రపోతుంది, దానికి ఉన్న ప్రత్యేకత అది. అమ్మవారు కూడా తన చూపులతో లోకాలను పోషిస్తుంది.


అమ్మవారి కళ్ళు ఎప్పుడూ పొరపాటున కూడా మూతపడవు, ఒకవేళ మూతపడ్డాయి అంటే లోకాలు నాశనం అయిపోతాయి. అందుకే  ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః అన్నారు.

అమ్మ అలా కన్నుమూసిందంటే చాలు, మొత్తం లోకాలన్ని సర్వ నాశనం అయిపోతాయి. కన్ను తెరిచిందంటే లోకాలు పుడతాయి, తెరిస్తే పుట్టడం, మూస్తే ప్రళయం.

అందువల్ల చేపలాగా అమ్మ కళ్ళు తెరిచే ఉంటుంది తప్ప మూయదు అని చెప్పడం ద్వారా అమ్మ కళ్ళు తెరిచే మన అందరినీ రక్షిస్తూ ఉంటుంది. చూపులతో లోకాలను కాపాడుతూ ఉంటుంది.


మంత్ర ప్రయోగము - ఫలితము:

పిల్లల అభివృద్ధికి బాగా ఉపయోగపడే మంత్రము ఇది.

ఎలాగైతే చేప తన చూపులతో పిల్లలను అభివృద్ధి చేస్తుందో, అలాగే ఈ మంత్ర జపము చేసిన వారిని కూడా అమ్మ అత్యద్భుతమైన స్థితికి తీసుకొని వెళుతుంది.


పిల్లలు సరిగా చురుకుగా లేకపోయినా, పాఠశాలకు వెళ్లడానికి పేచీలు పెడుతున్నా, చదువంటే ఆసక్తి లేకుండా ఎప్పుడూ ఇంటిలో కూర్చోవాలి అనుకుంటున్నా లేదా ఇంకేదైనా కారణాలతో ఉత్సాహం లేకుండా పడుకుంటున్నా అటువంటి పిల్లలు చురుకుగా తయారయి పాఠశాలకు వెళ్లి బాగా చదువుకొని అభివృద్ధి లోనికి వచ్చేలాగా చేసే అపూర్వ మంత్రము ఈ మంత్రము.


మనము చేయవలసిందల్లా చిన్న పిల్లల చేత కుంకుమ పట్టించి, ఆ పిల్లల యొక్క కుడిచేతి మధ్యవేలు, ఉంగరం వేలుతో కుంకుమను తీసుకొని కుడి చేతి బొటన వేలుతో ఆ కుంకుమను అమ్మవారి పాదాల మీద పడే లాగా పూజ చేయిస్తూ రోజూ ఈ నామమును 108 సార్లు జపం చేయించాలి. అమ్మవారి పటము, లలితాదేవి పటము లేదా విగ్రహమును మాత్రమే పెట్టించి, పిల్లలతోనే దీపారాధన చేయించి, ఏదైనా ఒక తీపి పదార్ధమును వారి చేతనే నైవేద్యముగా పెట్టించి,  వారు చదవగలిగితే ఈ నామాన్ని వారి చేతే జపం చేయించండి, వారు ఒకవేళ జపించలేకపోతున్నారనుకోండి, నాలుక అంత స్పష్టంగా లేదు అనుకుంటే మీరు జపం చేస్తూ మీరు కానీ పిల్లలు కానీ చేయండి. పూజ మాత్రం పిల్లలతోనే చేయించండి, అలా 40 రోజులపాటు గానీ లేదా 27 రోజులపాటు కానీ పిల్లలతో ఈ మంత్రం జపం చేస్తూ అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే ఆ పిల్లలు చురుకుగా తయారయ్యి, బాగా చదువుకొని, అభివృద్ధిలోకి వస్తారు. దాని వలన చాలా లాభాలు పొందుతారు. కాబట్టి ఈ మంత్రాన్ని చేయించండి. అర్చన అయిపోయాక పటాన్ని ఇంటిలోనే ఉంచుకోవచ్చు.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

Thursday, February 18, 2021

రథసప్తమి రోజు ఏం చేయాలి

 




🌹🌹🌹  రథసప్తమి  రోజు ఏం చేయాలి ? 🌹🌹🌹

 


         రథసప్తమినాడు అభిజిత్ లగ్నం ముఖ్యం. సూర్యోదయానికి సప్తమి ఘడియలు లేక పోయినా అభిజిత్ లగ్నం అనగా మధ్యాహ్నం 11.45 నుండి 12.30 నిమిషాలకు సప్తమి ఘడియలు ఉన్న రోజునే రథ సప్తమి అని పూజ్య గురుదేవులు తెలియజెయ్యడం జరిగింది.


యద్యత్ జన్మకృతం పాపం మయా సప్తమ జన్మసు

తన్మేరోగం చ సోకం మాకరీ హంతు సప్తమీ

ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం

మనోవాక్కయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతంచ యత్పువ:

ఇతి స్ప్తవిధం పాపం స్నానాన్మే స్ప్తసప్తికే

సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి


       ఓ మకరరాశిలో ఉన్న సప్తమీ ! ఈ జన్మలో ఏడు జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టు ,రోగాన్ని ఇంకా శోకాన్ని లేకుండా చేయి. తెలిసి తెలియక చేసిన పాపాన్ని ,మనస్సు, వాక్కు మరియు శరీరం ద్వారా చేస్తున్న పాపాలను పోగొట్టుము.


        ఆనాడు జిల్లేడు ఆకులు , రేగు ఆకులు , పండ్లు , నెత్తిమీద పెట్టుకొని స్నానం చేయడం ఆచారం. ఆపైన సూర్యునికి అర్ఘ్యం (దోసిలితో నీళ్ళు వదలుట) ఇవ్వాలి.


సప్త సప్తి మహాప్రీతి సప్తలోకప్రదీవన

సప్తమీ సహితోదేవ , గృహాణార్ఘ్యం దివాకర


             ఏడులోకాలకు కాంతినిచ్చే సూర్యదేవ సప్తమీ తిథితో కూడుకున్నవాడా ఈ అర్ఘ్యాన్ని తీసుక


      ఆపైన సూర్యునికి ఈశ్లోకాన్ని చెబుతూ నమస్కరించాలి.


జననీ సర్వలోకానాం సప్తమీ సప్త సప్తికే

సప్తవ్యాహృతికే దేవి , నమస్తే సూర్యమండల


           సూర్యమండలంలో ఉండే ఓ సవితృదేవతా ! అన్ని లోకాలకు తల్లివి నీవు.  భూః భువః సువః మొదలగు వ్యాహృతులతో కూడియున్నదానవు. నీకు నమస్కారము🙏🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

గురు వ్యాఖ్యనం-22




ఓం కాల కంఠాయ నమః


కాలము అంటే విషము అని కూడా అర్ధము. విషమును కంఠంలో పెట్టుకోవడం వల్ల ఈశ్వరుడిని కాల కంఠుడు అన్నారు. గరళకంఠుడన్నా, నీలకంఠుడన్నా, కాల కంఠుడన్నా ఈశ్వరుడే. అసలు మృత్యువు విష రూపంలో మానవులను పట్టుకుంటే, అంతటి మృత్యువును కూడా కంఠంలో అదుపులో పెట్టుకున్నాడు అని ఒక అర్థము. కాలమునే కంఠములో పెట్టుకున్న వాడు అని ఒక అర్థం. దీనికి బహుళ అర్థములు ఉన్నాయి, ఆ వ్యాఖ్యానములు అన్నీ ఇన్నీ కావు, అంతటి అత్యద్భుతమైన నామము ఇది.

ఈ నామమును అనేక కోణములలో ఉపయోగించుకోవచ్చు. విషానికి విరుగుడుగా ఉపయోగించుకుందాం.


మంత్ర ప్రయోగం ౼ ఫలితం:

దీనిని ఎలా ప్రయోగించాలో తెలుసుకుందాము. ఆత్మహత్యలకు పూనుకున్న వారు కానీ, లేదా విషాహారం తిని ప్రాణాలు కోల్పోయేలా ఉన్నవారు ఈ మంత్రజపము చేస్తే గండం గడిచి సుఖముగా ఉంటారు అని శాస్త్రము చెబుతున్నది.

మృత్యువు ఎలా ఉంటుందో తెలుసా, నిత్యం సన్నిహితో మృత్యుః.  నిత్యము మృత్యువు మన పక్కనే ఉంటుంది. అందువల్ల ప్రతి రోజూ నిద్రలేచాక, స్నానము చేసి, నిత్యపూజలు చేసుకున్న తరువాత ఒక మారేడు ఆకును కానీ లేదా ఒక తులసి ఆకును కాని చేతిలో పట్టుకుని ఓం కాల కంఠాయనమః ఓం కాల కంఠాయనమః అని 11 సార్లు కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ (కనీసం 11 సార్లు) జపము చేసి ఈ తులసీదళమును గాని మారేడు ఆకును కానీ ఇంటిలో ఉన్న శివుడి పటము కాని లింగం మీద కాని పెట్టి వేయండి. ఈ ఆకుని ఇలా పెట్టేసి బయలుదేరి వెళితే విషాహారం వలన వచ్చే గండము రాదు లేదా బల్లులు మొదలైనవి పడటం వలన వచ్చే గండము రాదు.

ఒకవేళ రోజూ చేయలేకపోయినా, పొరపాటున ఈ విషము తిన్న వాడు ఎవడో ఉన్నాడు, వాడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లే లోపు వాడు బతుకుతాడో లేదో తెలియదు, అలాంటి వాడిని ఉద్దేశించి వాడి గోత్రం, నక్షత్రం ఒకవేళ నక్షత్రం తెలియకపోతే గోత్రం తెలుసుకోండి, ఒక్కొక్కసారి ఆ వ్యక్తి ఎవరో తెలియదు అనుకోండి అలాంటప్పుడు గోత్రం ఏమి చెప్తాడు వాడు అలాంటి వాడి పేరు కూడా తెలియకపోతే అలాంటప్పుడు వాడి శిరస్సు మీద చేయి పెట్టి ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించమన్నారు. వైద్యం కూడా వికటించకుండా ఫలించి ఆరోగ్యవంతుడై బాగుపడతాడు.


ఎంతో మంది మీద ఇది ప్రయోగించి చెబుతున్న విషయము. ప్రయోగంలో ఒక వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొని వెళ్లే లోపు వాడు చచ్చిపోతాడు అని చెప్పేశారు అలాంటి వ్యక్తిని తలుచుకొని వాడి కోసము ఈ జపాన్ని చేస్తే, వాడు ఆసుపత్రికి వెళ్లడం ఆ మందు ఫలించి వాడు సుఖముగా బ్రతకడం చూసాము. కాబట్టి భయంకరమైన కాలకూట విషమునకు కూడా ఇది విరుగుడు.


ఒక్కొక్కసారి మరీ విచిత్రమైన ఆహారాలు తిని చచ్చి పోతున్నాడు అనుకున్న వాడికి ఏమి చేస్తారు అంటే ఒక గ్లాసులో కొన్ని నీళ్ళు పోయండి, అందులో ఒక తులసి ఆకు వేయండి, గ్లాస్ మీద చేయి  పెట్టండి అలా గ్లాస్ మీద చెయ్యి పెట్టి ఓం కాల కంఠాయ నమః ఓం కాల కంఠాయ నమః అని మీ వీలునుబట్టి అవతల వాడి గండం సమయాన్ని బట్టి జపము చేసి ఈ గ్లాస్ లో ఉన్న నీటిని ఆకు తో సహా వాడి నోటిలో పోయండి, నోరు తెరవలేని పరిస్థితిలో ఉంటే ఆకును నలిపి కొంచెం నీటిని నోటిలో పోయండి. అప్పుడు వాడు మృత్యు గండము నుంచి బయటపడతాడు ఆరోగ్యంగా లేచి కూర్చుంటాడు.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

గురు వ్యాఖ్యానం -21




ఓం కురువింద మణి శ్రేణీ కనత్కోటీర మండితాయై నమః


కోటీరము అంటే కిరీటము అని అర్థము.దేవతలు, మహారాజులు సింహాసనము మీద కూర్చుని ప్రజలను రక్షించేటప్పుడు ప్రజా పాలన చేసేటప్పుడు కిరీటాలు ధారణ చేస్తారు, దానిని కోటీరం లేదా మకుటం లేదా ముకుటం అంటారు.


కిరీట ధారణ లేకపోతే వాడిని ఎవరూ ప్రభువుగా ఒప్పుకొనే వారు కాదన్నమాట పూర్వము.పూర్వ కాలములో ఈ కిరీటాలలో అమూల్యమైన మణులు ఉండేవన్నమాట. వీటిని అనర్ఘ రత్న మణులు అనేవాళ్ళు. అమ్మవారి కిరీటానికి కురువింద మణులు ఉన్నాయి, అంటే ఎర్రగా కెంపులు లాగా ఉండే మణులు. ఈ కురువింద మణులకు ఒక లక్షణము ఉన్నది.

కామాను రాగః కురువింద జేషు అని అంటాడన్నమాట శ్రీకృష్ణుడు హరివంశములో.అంటే కామాన్ని, అనురాగాన్ని పెంచుతాయి, ప్రేమను పెంచేవి ఇవే, కోర్కెలను పెంచేవి ఇవే.

పూర్వం స్త్రీ పురుషులు దాంపత్యం కోసం ఈ కురువింద మణులను ధరించేవారని అలాగే సంతానము మీద ప్రేమతో వారిని ఆదరించడం కోసం కూడా ఈ కురువింద మణులనే ధరించేవారని చెప్పేవారు.

 ఏది ఏమైనా మొత్తానికి కామానురాగాన్ని పెంపొందింప జేసే లక్షణము ఈ కురువింద మణులకు ఉన్నది.

అమ్మవారి కిరీటం మీద ఎందుకు ఈ మణులను ధరిస్తుంది అంటే ఆవిడను చూడగానే అందరికీ భక్తి , ప్రేమ కలగాలన్న మాట మా అమ్మ, మా తల్లి అని అనురాగంతో అమ్మ పాదాలు పట్టుకుంటారు అటువంటి మణులు అవి. ఈ మణుల వల్ల హరిభక్తి కూడా పెరుగుతుంది, హరిభక్తి వల్ల మోక్షం కరతలామలకం అవుతుంది. మోక్షమును హరిభక్తిని పెంపొందించుకోవడం వలన ఇస్తాను అని చెప్పడానికే అమ్మ ఈ మణులను పెట్టుకున్నది.

కాబట్టి ఈ మణులను ధరించడంలో అమ్మ వారి యొక్క ప్రధాన ఉద్దేశ్యము నేను ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పడమే.


*మంత్ర ప్రయోగము ౼  ఫలితము:*

1) కోరికలు లేకుండా అనునిత్యము యథాశక్తిగా ఓపికను బట్టి పది సార్లో  లేక 11 సార్లో ఎంతోకొంత జపం చేసే వారికి మోక్షమును ఇస్తుంది ఆవిడ.

2) నిత్యము తొమ్మిది సార్లు దీనిని జపము చేస్తే పదిమందిలో గుర్తింపు వస్తుంది.

సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని దీవెనలు ఇస్తాము వేదమంత్రములతో మనము, అంటే నీ సాటి వారిలో నువ్వు గొప్పవాడిగా అందరితో కీర్తింపబడుదువు గాక.

మనవాళ్లలో పండితులలో మనకే ఎక్కువ గుర్తింపు రావాలి, అలా రావాలి అంటే ఈ మంత్రమును నిత్యం 9 సార్లు జపించాలి అన్నారు.

3) ఉద్యోగాలలో ప్రమోషన్ల కోసము 27 రోజుల పాటు నిత్యము దీనిని జపం చేసి ఆవుపాలను నైవేద్యంగా పెట్టి ఆ పాలను తీర్థంగా తీసుకుంటే పదోన్నతులు వస్తాయి.

4) అన్నిటికంటే కురువింద మణులు కుజగ్రహానికి చాలా ఇష్టం, కుజ జపం చేయడం వలన ఋణ విముక్తి అవుతుంది, కుజుడు సరిగా చూడకపోతే అప్పులపాలై పోతారు, కాబట్టి కుజ అనుగ్రహము పొంది అప్పులపాలు కాకుండా ఋణ విముక్తి పొంది సంపదలు పొందాలనుకున్న వాళ్ళు ప్రతి మంగళవారం ఉదయం పూట 108 సార్లు ఈ మంత్రాన్ని అనుష్ఠానము చేయటం మంచిది.

5) కుజ దోషము అని ఒక దోషము వున్నది, ఈ దోషమును అనేక రకములుగా తొలగించుకోవచ్చు. అందులో ఒక సులభ మార్గం ఏమిటంటే ప్రతి మంగళవారం 27 సార్లు ఈ మంత్రాన్ని కొంతకాలము జపం చేయటం ద్వారా సులభముగా కుజదోషము తొలగించుకోవచ్చు. దాని కోసం కష్టపడి జపాలు చేయించుకోలేక అందులో నుంచి బయటపడలేక పోతున్నాము అనుకున్న వాళ్లు, కుజ దోషం వల్ల పెళ్లి కాకుండా బాధపడుతున్న వాళ్లు ఈ మంత్రాన్ని మంగళవారంనాడు ఇరవై ఏడు (27) సార్లు పారాయణ చేస్తే ఆ దోషము కూడా తొలగిపోతుంది.

6) ఈ మంత్ర అనుష్ఠానముతో 108 సార్లు ప్రతి మంగళవారం అమ్మవారికి ప్రదక్షిణ చేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.

7) కురువింద మణులు అటు అమ్మవారికి, కుజుడికి అందరికీ ఇష్టం కనుక ఈ మణులను ఉంగరములో వేలికి ధరించడం కూడా మంచిది.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...