Pages

Sunday, March 14, 2021

గురు వ్యాఖ్యనం-44






ఓం. విద్యానిధయే  నమః


ఈ కలియుగంలో మానవులకి జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతుంది.కొంతమంది పిల్లలకి జ్ఞాపకశక్తి ఉండదు లేదా కొన్ని అక్షరములు సరిగ్గా ఉచ్చరించలేరు.కారణం కొన్ని సరస్వతీ దోషాలు ఉండడం వల్ల.

                         పూర్వం సత్యవ్రతుడు అను పేరు కలిగిన ఒక వ్యక్తి  సరిగ్గా పలకలేకపోతే అమ్మవారు స్వయంగా ఒక సరస్వతీ కవచాన్ని ఇచ్చింది.కవచాన్ని చదవలేని వాళ్ళకి స్వయంగా సూర్యభగవానుడు యాజ్ఞవల్క్యునికి , శ్రీ కృష్ణుడు సూర్యుడికి చెప్పిన ఒక గొప్ప మంత్రంవై.ధారణా శక్తిని ఇస్తుంది.దోషనివారణ కోసం ఇవ్వబడిన ఒక గొప్ప అత్యద్భుతమైన మంత్రం ఇది.


మంత్ర  ప్రయోగం - ఫలితం:


దీనిని కొన్ని నక్షత్రాలలో చేస్తే బాగా పట్టిస్తుంది.మూలా నక్షత్రము అంటే అమ్మవారికి చాలా ఇష్టం.శరత్కాలంలో మూలా నక్షత్రం నాడు ఆశ్వయుజ మాసంలో సరస్వతీ రూపం లో అమ్మవారికి అలంకారం చేస్తారు.

                       ప్రతి మాసంలో వచ్చే మూలా నక్షత్రం నాడు , పూర్ణిమా తిథి నాడు , శుక్రవారం నాడు ,అమావాస్య నాడు ఈ 4 తిథులలోను ఈ నామాన్ని 1000 సార్లు పిల్లల తో చేయించండి. మూలా నక్షత్రం అయితే వెయ్యి సార్లు చేస్తే లక్ష సార్లు చేసిన  జపంతో సమానం.

                          ఈ జపం వల్ల అసాధారణమైన ధారణ పెరుగుతుంది.ఒత్తిడిని తొలగ జేసి సరియైన సమయంలో జ్ఞాపకశక్తిని ఇస్తుంది.శివుడు అంతటి వాడు ఈ జపం చేసి వ్యాకరణ సూత్రాలు ఇవ్వగలిగాడని కాళికా ఉపపురాణం చెబుతున్నది.శ్రీకృష్ణుడు గోలోకంలో రాజు చేత చేయించాడు.ఇది అంత  గొప్ప నామం.తెల్ల పువ్వులతో ఈ నామం చేస్తూ సరస్వతికి పూజ చేస్తే అపూర్వమైన పాండిత్యం కూడా వస్తుంది.ఇవన్నీ చేసి సరస్వతీ కటాక్షం పొందండి.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-43

 




 కోణం నీలాంజనప్రఖ్యం 

 మందచేష్టా  ప్రసారిణం

 ఛాయా మార్తాండ సంభూతం 

నమస్యామి శనైశ్చరం

                

పిల్లలతో నిత్యం తగాదా పడే తల్లిదండ్రులు  కలియుగంలో పెరుగుతారట.పూర్వజన్మలో ఋణానుబంధం ఉంటేనే భార్య,పిల్లలు , ఇల్లు ఇవ్వన్నీ మనకు దక్కుతాయి.ఈ ఋణానుబంధంలో ఎక్కడో తేడా ఉంటే శత్రువులు కూడా పిల్లలుగా పుట్టి తల్లిదండ్రులను పట్టి పీడించేస్తూ ఉంటారు.చాలామందికి  ఇవాల వచ్చే సమస్యలన్నీ యమధర్మరాజుగారి ద్వారా పూర్వం చిత్రగుప్తుడు విన్నాడు.

                          పిల్లలు స్కూలుకి వెళ్లక నానా బాధలు పెడుతుంటే దీనికి గల కారణం శని సంబంధమైన దోషం ఉండడం.రెండవది  తల్లితండ్రుల మాట వినకుండా గొడవ చేస్తూంటారు.ఇలా పెళ్ళి విషయంలో, విద్యా విషయంలో ఇంకా అన్ని విషయాలలో తల్లి తండ్రులతో తగాదా పడే పిల్లల వల్ల   వాళ్ళకి ఎప్పుడూ తలనొప్పే.

                         వీరిని సరియైన మార్గములో పెట్టడానికి సూర్యభగవానుడు శనైశ్చర మంత్రాన్ని ఉపదేశించాడు.


మంత్ర ప్రయోగం - ఫలితం:


శనివారం నాడు 6 గంటల నుంచి 7 గంటల దాకా శని హోరా అని ఉంటుంది.ప్రతి శనివారం  ఇది ఒక సంవత్సరం చేయండి.108 కాని 1000  కాని ఒక ఏడాది చేస్తే పిల్లలతో ఐకమత్యం వస్తుంది. పిల్లలు సుఖంగా ఉంటారు.వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది.పెళ్ళిళ్ళల్లో కాని ,చదువుల్లో కాని ఏ ఇబ్బందులూ రావు.ఆఖరున సంవత్సరము  పూర్తి అయ్యాక ఒక శనైశ్చరుడి ఆలయానికి వెళ్ళండి.నువ్వులనూనెతో అభిషేకం చేయించుకోండి.యథాశక్తి దక్షిణ ఇవ్వండి.కాళ్ళు కడుక్కుని ఇంటికి రండి. పిల్లలకి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-41

 





ఓం అకులాయై సర్వ విజయాయై నమః


కుల సంబంధం కానిది అకుల. 'కుల' అను ఒక మంత్ర అనుష్ఠాన మార్గము ఉన్నది.ఆ అనుష్ఠానాన్ని సక్రమంగా తీర్చిదిద్దేదని అర్థం.నిజానికి అమ్మ కుల ,రూప ,మతాంత బేధములేని జగన్మాత. ఇటువంటి తల్లి సర్వవిజయాలనూ చేకుర్చి పెడుతుంది.

                     ఇది వెలి నుండి బయటపడడానికి ఏకాకిగా మిగలకుండా మానవులను సంఘజీవులుగా చేసే మంత్రం.కులంలో కాని, మతంలో కాని, గ్రామంలో కాని లేదా కవి గారికి ఇటువంటి కళాకారుల సంఘాల్లో నుంచి కాని ఒక వ్యక్తిని పక్షపాతంతో గెంటేసి వాడిని పైకి రానివ్వకుండా ఎవరైనా చూస్తూ ఉంటే అటువంటప్పుడు ఆ బయట పడిన వ్యక్తి బాధపడడం కంటే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయమన్నారు.ఈ మంత్రం జపం చేస్తే మళ్ళీ వాళ్ళే దగ్గరకు తీసుకుని గౌరవిస్తారు.


మంత్ర ప్రయోగం - ఫలితం:


11 శుక్రవారాల పాటు ఉదయం పూట ఎఱ్ఱగా ఉన్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడి 500 పర్యాయాలు జపం చేసుకోండి.జపం అయిపోయాక గరికని,నీళ్ళని రెండు చేతులలో కి తీసుకుని ఆ సూర్యుడికి అర్ఘ్యంగా ఇవ్వండి.ఇది తులసి కోటలో కాని ఎవ్వరూ తొక్కని చోట  కాని చేయండి.ఇది 9 శుక్రవారాలు చేయాలి.ప్రత్యేక నివేదన  అక్కర్లేదు.పదిమందితో చొరవగా మెలిగి తద్వారా సుఖంగా జీవిస్తొడు మానవుడు.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-40

 




ఓం గం గజకర్ణికాయ నమః


ఇది విఘ్నేశ్వర మంత్రం లో ఒక గొప్ప మంత్రం.వినాయకునికి ఒక 16 నామాలు ఉన్నాయి.

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః

ధూమకేతుర్గణాధ్యక్షః  ఫాలచంద్రోగజాననః

వక్రతుండః శూర్ప కర్ణో హేరంబః స్కంద పూర్వజః

ఇవి ఉదయ కాలంలో చదివితే మరీ మంచిది.ప్రయాణంలో చదివితే విఘ్నాలు తొలగిస్తాయి.

                      కలియుగంలో చాలా తొందరగా చెవుడు వస్తోందిట. తెలుగులో పోతనగారు కూడా అలసులు,మంద బుద్ధులు,అల్పతరాయువులు,ఉగ్రరోగ సంకలితులు,మందభాగ్యులు సుకర్మములెన్నియు చేయజాలరీ  కలియుగమందు  మానవులు అని కలియుగంలో మానవులు సోమరిపోతులై ఉంటారు, రోగాలతో ఉంటారు.చెవుడు వల్ల నానా యాతన పడుతూ ఉంటారు అని చెప్పారు.ఈ చెవిటిని తగ్గించి శ్రధ్ధగా వినగలిగే సామర్థ్యాన్ని ఇచ్చే మంత్రం ఇది.


మంత్ర ప్రయోగం - ఫలితం:


బుధవారం అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం.వినాయకుని ప్రతిమని మట్టితో కానీ వెండితో కానీ,  పటం కానీ పెట్టుకుని  దాని ఎదురుగుండా చాప,దర్భ,పీట వీటిల్లో ఏదో ఒక ఆసనం వేసుకుని  ఈ నామాన్ని 108 సార్లు  ప్రతి బుధవారం  గరికని తీసుకుని చెవి దగ్గర పెట్టి ఈ మంత్రం చదువుతూ విఘ్నేశ్వరుడి మీద  పెట్టండి.

                            గం అనే బీజం విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం. మూలాధారచక్ర అధిష్ఠాన దేవత గణపతి. ఆయన నాదం' గం' అనే బీజం.ఈ బుధవారం నాడు కొంచెం బెల్లము ముక్క నైవేద్యం పెట్టి ఈ రోగి దానిని తినాలి.సాయంత్రం అయ్యాక ఈ గరికని పక్కకి పెట్టి పటాన్ని ఒక పురోహితుడికి దక్షిణతో దానం చేయండి.9 బుధవారాలు గణపతిని  గరికతో ఈ మంత్రం తో పూజిస్తే మంచి శ్రవణ శక్తి వస్తుంది.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-39





ఓం  పంచతన్మాత్ర సాయకాయై నమః


మంత్రమును  సరియైన రీతిలో అర్థం చేసుకుని అనుష్ఠానం చేస్తే మానవుడు సాధించ లేనిదంటూ ఉండదు.ఆత్మ స్థైర్యం కావాలి . విశ్వాసం కావాలి.అటువంటివాటిలో మానసిక శత్రుపీడా నివారిణి నిరంతరం ప్రశాంతత నిచ్చే అధ్బుతమైన మంత్రంగా చెప్పారు.

                       అందుకే దీనిని మానసిక శత్రుపీడా నివారక మహామంత్రం అని కూడా బ్రహ్మాన్డపురాణం చెబుతోంది.తన్మాత్రలు అంటే శబ్ద ,రూపం, రసం ,స్పర్శ, గంధాలు.భూమి , అగ్ని ,జలం , వాయువు , ఆకాశం ఇవి పంచభూతాలు.ఈ పంచభూతాలకి ఐదు లక్షణాలు ఉన్నాయి.

                        భూమికి వాసన ఇచ్చే లక్షణం అందుకే పృథ్వీ గంధవతి'.అగ్నిలో దాహక  శక్తి ఉంది. నీటిలో రసశక్తి ఉంది.ఆకాశం శబ్ద ప్రసారం చేసి శబ్దాన్ని అందరికీ అందిస్తుంది.వాయువుకి స్పర్శ అనే ఒక లక్షణం ఉన్నది.ఇలా ఐదు భూతాలకి ఐదు తన్మాత్రలు ఉన్నాయి.ఈ తన్మాత్రల వల్ల అమ్మవారు లోకాలను సృష్టించింది.ఈ పంచతన్మాత్రలని అరవిందము,అశోకము , చూతము ,నవమల్లిక , నీలోత్పలము అని పేరు కలిగిన ఐదు పువ్వులుగా మార్చుకున్నాయి. ఈ పువ్వులే బాణాలు.ఈ పువ్వుల బాణాలతో శత్రువులని పడ గొడుతున్నది.


మంత్ర ప్రయోగం - ఫలితం:

ఇది శుక్రవార మంత్రం.ప్రతి శుక్రవారం పవిత్రంగా స్నానం చేసి అమ్మవారి పటము కాని విగ్రహం కాని పెట్టుకుని ఆచమనం చేసి, సంకల్పం చెప్పుకుని 1008 సార్లు అని జపం చేయండి.18 శుక్రవారాలు అనుష్ఠానం చేస్తే మానసిక శత్రుపీడ తొలగిపోతుంది.సంపదలు వస్తాయి.అన్ని రంగాలలో విజయం లభిస్తుంది.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం- 38

 





ఓం క్లీంకార్యై నమః


క్లీం అనే బీజాక్షర స్వరూపిణి యైన అమ్మవారి కొరకు నమస్కారం. నిరంతరం మానవులకి మానసికంగాను శారీరకంగాను ఉన్న కొన్ని రకాల కోరికలను తీర్చే మాతృస్వరూపిణి కొరకు నమస్కారం.

                     దుష్టాన్నము , విషాన్నము మానవుడి శరీరం అంతా పాడుచేసి తీవ్రమైన అనారోగ్యానికి గురి చేస్తుంది.దీని నుంచి బయట పడాలి మానవుడు. అలా బయటపడవేసే అపూర్వమైన మంత్రం ఇది.


మంత్ర ప్రయోగం - ఫలితం:


మంగళ , శుక్రవారాలలో ఒక రాగి చెంబు తీసుకుని అందులో నీరు పోసి తులసీ దళాలు ,  నాలుగు మారేడు ఆకులు వేయండి.దాని మీద  కుడి చెయ్యి పెట్టండి. ఈ మంత్రాన్ని 1000 సార్లు జపం చేయండి. జపం అయిపోయాక ఈ తీర్థాన్ని తాగండి. చాలా ఆరోగ్యం ఇది. తులసీ దళములు , మారేడు దళములతో నానపెట్టబడిన రాగి చెంబులోని నీరు మంత్రపూతమై మహాద్భుత వైద్యం అవుతుంది.వ్యాధి తొలగిపోతుంది.

                ఆయుర్వేదం కూడా చెబుతున్న గొప్ప వైద్యం ఇది.దుష్టాన్న , విషాన్న దోషం నివారణ కోసం మనకి చరకుడు అనే మహానుభావుడు అందించిన గొప్ప మంత్రం ఇది.ఈ మంత్రం ప్రభావం వల్ల నల చక్రవర్తికి జీవితంలో ఎప్పుడూ ఆహారం తినడం వల్ల అనారోగ్యం రాలేదని కొన్ని రకాల స్థలపురాణ గాథలు చెబుతున్నాయి.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-37

  





ఓం శ్రీం మహేశ్యై నమః


శ్రీం అనేది మాయా బీజం. అమ్మవారి యొక్క లలితాసహస్రనామము చాలా ప్రసిద్ధికెక్కినది. అందులో అమ్మవారికి మహేశీ అని ఒక నామము ఉన్నది.

ఇక అంతకంటే అధిష్ఠాన దేవత మనకు లేదు,

మనలను పరిపాలించే రాణిని ఈశీ అంటాము.

ఈశః అంటే అధిపతి, అమ్మవారు స్త్రీ రూపం లో పరిపాలిస్తుంది కాబట్టి ఈశీ అంటారు.

మహా ఈశీ మహేశీ,

అమ్మను మించిన పరిపాలకురాలు ఇక మనకు లేదు.

అమ్మే సకల లోకాలకు అధినాయిక, అటువంటి అమ్మ కనుక అమ్మను మహేశీ అన్నారు.

దీనికి ముందు శ్రీం అనే మహాలక్ష్మి బీజం, మాయా బీజం చేర్చి జపం చేస్తే ఇది మహామంత్రం అవుతుంది.


ఈ మంత్రము కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టే మంత్రము అన్నారు.  

పూర్వం ఉత్తముడు అనే ఒక మనువు ఉన్నాడు, ఆయన తండ్రి గారి పేరు కూడా ఉత్తముడే.

స్వాయంభువ మనువు యొక్క భార్య శతరూప, వీరికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉత్తానపాదునికి సురుచి, సునీతి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.

పెద్ద భార్య సునీతి కొడుకు ధ్రువుడు, చిన్న భార్య సురుచి కొడుకు ఉత్తముడు. ఉత్తముడు యక్షుల చేతిలో చనిపోయినా ధ్రువుడి ధర్మమా అని బ్రతికాడు. ధ్రువుడు ధ్రువ మండలానికి వెళ్లి పోయినాక ఉత్తముడు భూమండలానికి రాజు అయ్యాడు.

ఈ ఉత్తమ మనువు భార్య ఆయన మాట అసలు వినేది కాదు, దానితో కుటుంబ వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయింది.


ఇంటిలో భర్త మాట భార్య, భార్య మాట భర్త, ఒకరి మాట ఒకరు విని సంసారమును చక్కదిద్దుకోవాలి. అనుక్షణము భర్తను భార్య అనుమానిస్తూ ఉంటే భార్యను భర్త అనుమానిస్తూ ఉంటే భర్త  చేసే పనికి భార్య అడ్డు పడుతూ ఉంటే అట్లాగే భార్య వెళ్లే ఉద్యోగానికి భర్త అడ్డు పడుతూ ఉంటే కుటుంబం ఏమి బాగుంటుంది చెప్పండి. అందువల్ల ఒకరి మీద ఒకరికి అవగాహన ఉండాలి, ఈ అవగాహనతో కుటుంబమూ, పిల్లలు బాగా ఉండాలి.

పిల్లలు మాట వినకపోయినా, భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోయినా, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. కనుక వీరు బాగుండడం కోసం అని ఆనాడు బహుశా భగవంతుడు ఉత్తమ మనవుని సృష్టించి వుంటాడు.

ఉత్తముడు, అతని భార్య ఎప్పుడూ కొట్టుకునే వారట, వారికి అస్సలు పడేది కాదు, చివరికి వాళ్ల కోసం మిత్రవింద అనే ఒక యజ్ఞం చేశాడు ఒక గురువుగారు, ఆ మిత్రవింద యాగంలో ఈ మంత్రమును వాడారు.


మిత్ర కామేష్టి అంటే భార్యాభర్తలు ఐకమత్యంతో ఉండడం కోసం చేసే యజ్ఞం అన్నమాట. ఆ యజ్ఞంలో ఓం శ్రీం మహేశ్యై నమః

అనే మంత్రమును వెయ్యి సార్లు చదివి అగ్నిదేవునికి ఆహూతులను ఇచ్చాడు,  దానితో భార్యాభర్తలు ఇద్దరూ కలిశారు.


మంత్ర ప్రయోగము ౼  ఫలితము:


కలియుగములో యజ్ఞము చెయ్యనవసరం లేదు కానీ ఈ మంత్రమును ప్రతి మంగళవారం విడిచిపెట్టకుండా సంవత్సరం పాటు  భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కానీ లేదా విడివిడిగా కానీ గణపతి ధ్యానం, గురు ధ్యానము చేసుకున్న తర్వాత 108 సార్లు కానీ లేదా 1008 సార్లు కానీ చేస్తే భార్యాభర్తల మధ్య అవగాహన వస్తుంది, పిల్లల మధ్య అవగాహన వస్తుంది, కుటుంబంలో అస్తవ్యస్త పరిస్థితులు తొలగిపోయి కుటుంబ వ్యవస్థ చక్కగా నడుస్తుంది. దానితో వారికి నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా ఉంటుంది.

ఒకవేళ ఈ మంగళవారములలో స్త్రీలు బయట ఉంటే ఆ వారము విడిచి పెట్టి తరువాతి వారం నుండి ప్రతి మంగళవారం నాడు మొత్తం మీద ఒక సంవత్సరం పాటు చెయ్యాలి.


అశుచి వచ్చినప్పుడు కూడా ఆ వారం విడిచి పెట్టి తరువాయి వారం నుంచి చెయ్యండి, కానీ విడిచిపెట్టకుండా సంవత్సరం పాటు పట్టుదలతో 

ఓం శ్రీం మహేశ్యై నమః

అనే మంత్రమును చేస్తే కుటుంబ వ్యవస్థ చక్కబడుతుంది.

ఇది కుటుంబ పరిస్థితిని చక్కదిద్దే మంత్రము.                     


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని , లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యానం - 36

 



ఓం  అహమానందానందాయైనమః


ఇది అధర్వణ వేదములోని మంత్రం.పూర్వం సకలదేవతలు అమ్మవారిని "నువ్వు ఎవరివి" అని అడిగారు. అప్పుడు ఆవిడ ఈ చరాచర జగత్తు అంతా నేనే , అహం అంటే నేనే , ఆనందానికే ఆనందం ఇచ్చే దానిని , నేనే సర్వజగత్తును వ్యాపించి ప్రతి ప్రాణికి దుఃఖం తొలగచేసి బ్రహ్మానందాన్ని ఇస్తాను అని చెప్పింది.

                         ఉపనిషత్తులు దీనిని మహామంత్రంగా స్వీకరించాయి. ఈ మంత్రాన్ని సనక, సనందన, సనత్కుమార, సనస్సుజాతులు లక్షసార్లు జపం చేశారు.దానితో ఎప్పుడూ నవయవ్వనంతో చిరజీవులు అయ్యారు.అప్పటినుంచి లోకంలో పరంపరగా వ్యాపించింది.ఈ మంత్రానష్ఠానము చేసిన వారికి జీవితంలో దుఃఖం రాదు.


మంత్ర ప్రయోగం - ఫలితం:

ప్రతి మంగళవారం నాడు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో అనుష్ఠానం చేసుకోండి.ఆ సమయంలో అధ్బుతమైన హోరా కాలం ఉంటుంది.అది జపానికి చాలా మంచిది.స్నానం చేసి ,కాస్త కుంకుమ పెట్టుకుని  అమ్మవారి పటము కాని విగ్రహం కాని పెట్టుకుని మల్లెపూవులతో కాని సన్నజాజులతో కాని అమ్మని పూజిస్తూ 1000 సార్లు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి.వీలుంటే కొబ్బరికాయ కాని, అరటిపండు లేదా పంచదార వీటిని నివేదన చేయండి.

                        27 మంగళవారాలు అనుష్ఠానము చేయండి.మంచి నిర్భయత్వము వస్తుంది.సంతోషము ఉంటుంది.నిత్యం ఆనందం కలుగుతుంది, ఈ మంత్రం వల్ల దుఃఖం రాదు.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురువ్యాఖ్యనం- 35

 





ఓం జం జ్ఞాన వృద్ధ్యై నమః


జ్ఞాన వృద్ధి స్వరూపిణి అమ్మ, జ్ఞానవృద్ధి,  జ్ఞానవృద్ధి దాయిని,  విజ్ఞాన దాత కూడా అమ్మయే.

ఈ మహా మంత్రము అమ్మవారికి సంబంధించిన సప్తశతీ మహా మంత్రము.

కొంతమందికి గణితశాస్త్రం అంటే భయం, కొంతమందికి విజ్ఞాన శాస్త్రం అంటే భయము. ఇవి రెండూ చదివి కూడా కొంతమందికి పరీక్షలంటే భయం. ఇటువంటి వాళ్లకు భయం తొలగి అందులో విజయం పొందడానికి బాగా పనికివచ్చే మహత్తరమైన మంత్రము ఇది.


మంత్ర ప్రయోగము ౼  ఫలితము:


ఈ మంత్రమును ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఈ నాలుగు తిథులలో ఏదో ఒక నాడు ఉదయము తలకు స్నానం చేసి బొట్టు పెట్టుకుని పూజా మందిరంలో ఒక అమ్మవారి పటమును పెట్టుకొని జపమును ప్రారంభించండి.

ఏకధాటిగా పన్నెండు రోజులపాటు ప్రతిరోజూ వెయ్యి సార్లు ఈ మంత్ర జపము చెయ్యాలి.

జపము చేసేటప్పుడు పువ్వులు, పత్రి వాడండి. ఈ పత్రిలో సాధారణముగా మారేడు ఆకులు, నేరేడు ఆకులు, గరిక, తమలపాకులు మొదలైన ఆకులు (సహజముగా గణపతికి ఉపయోగించే పత్రి) వాడవచ్చును. ఇక పువ్వులలో సంపంగి, పారిజాతం, మందారం, పసుపు పచ్చగా ఉండే పువ్వులు గన్నేరు మొదలైన పువ్వులు ఒక మూడు రకాల పువ్వులకు తక్కువ కాకుండా తీసుకోండి.

వీటితో పూజ చేస్తూ 

ఓం జం జ్ఞాన వృద్ధ్యై నమః

త్వం బుద్ధిః త్వం వృద్ధిః అని అమ్మవారిని కీర్తించారు, ఆ మంత్రం అన్న మాట ఇది.

జం అనే బీజం తో కలిస్తే ఇంకా తొందరగా లోపలకు వెళుతుంది.

ఈ పువ్వులను ఆకులను ఏరోజుకారోజు తీసి పూజామందిరము లోనే ఒక పక్కన పెట్టండి, బయట వేయకండి. 12 రోజులు అయ్యాక ఈ పత్రిని పువ్వులను దొడ్డిలో ఎక్కడో ఒకచోట వేయండి లేదా కాలవలో వేసేయండి లేదా గొయ్యి తీసి పాతి పెట్టేయండి లేదా బాగా ఎండబెట్టి యజ్ఞానికి వాడేయండి.

ఈ పన్నెండు రోజులపాటు ఆవునేతితో తయారు చేసిన ఏదో ఒక తీపి పదార్థము నైవేద్యంగా పెట్టండి. ఈ ప్రసాదమును జపము చేసిన వారు మరియు వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి, బయట వారు తినకూడదు, ఒకవేళ బయటి వారు ఎవరైనా ఈ ప్రసాదమును తింటే ఈ ఫలితము కొద్దిగా వారికి వెళ్ళిపోతుంది అందుకని ఈ విషయంలో కొద్దిగా కఠినముగా ఉండవలెను. ఆవు నేతితో చేసిన పదార్థము పెట్టడం వల్ల మానవునికి బుద్ధిలో సూక్ష్మత పెరుగుతుంది, గ్రహణ శక్తి పెరుగుతుంది,

అసలు ఈ మంత్రమే బుద్ధి కౌశల్యాన్ని జ్ఞాపకశక్తిని పెంచుతుంది, జ్ఞానాన్ని పెంచుతుంది.

ముఖ్యముగా గణిత శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము అంటే భయపడే వారు, సరిగా అవగాహన చేసుకోలేని వారు, వాటిలో పరీక్షలంటే భయపడిపోయే వారు అలాంటి వారికి ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది.

ఈనాడు పోటీ ప్రపంచంలో హడావిడిగా పరుగులు పెడుతున్న కాలము,

కొద్దిగా తేడా వచ్చిందంటే జీవితమంతా వ్యర్థం అయిపోయి సంవత్సరాలు సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతున్నాము,

కాబట్టి భవిష్యత్తులో ఏదైనా ప్రవేశ పరీక్షలకు (కాంపిటీటివ్ ఎగ్జామ్స్) వెళ్లే వాళ్ళు 12 రోజుల పాటు ఉదయం పూట ఈ మంత్రమును అనుష్ఠానము చేయండి.

ఈ మంత్రానుష్ఠానమును పైన చెప్పిన నాలుగు తిథులలో ఏదో ఒక రోజు మాత్రమే ప్రారంభించి 12 రోజుల పాటు ఏకధాటిగా చేయాలి.

 ఈ మంత్ర జపం వలన మరియు ఈ ప్రసాదం ప్రభావము వలన మానవులకు చురుకైన బుద్ధి ఏర్పడి తప్పక అనుకున్న పరీక్షలలో విజయం సాధిస్తారు.

ఈ పన్నెండు రోజులపాటు ఉదయం పూట జపం అయిపోయాక ఈ పరీక్షలలో గల శాస్త్రములను (సబ్జెక్టులను) అభ్యాసం చేస్తే జ్ఞాపకశక్తి, అవగాహన శక్తి ముందు కంటే బాగా పెరుగుతాయి,

కాబట్టి పరీక్షలకు వెళ్లే పిల్లలందరూ ఈ మంత్రమును అనుష్ఠానము చేయండి.  


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

గురు వ్యాఖ్యనం -34






ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః


ఇది లలిత సహస్రనామములోని గొప్ప మంత్రం.కామేశ్వరుడు అని ఒక గొప్ప మహానుభావుడు ఉన్నాడు.లలితాదేవికి భర్త.బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరులకు కూడా మూలమైన విరాట్ పురుషుడు కనుక ఆయనకు కామేశ్వరుడు అని పేరు.కామము అంటే కోరిక.కోరికలను తీరుస్తాడు కనుక కామేశ్వరుడు అయ్యాడు.

                          ఆయనకి ప్రాణనాడి అమ్మవారు.తన భర్తని అదుపులో పెట్టుకుని భర్తకి ప్రాణమునిచ్చునది అని అంతరార్థం.భార్యని ప్రేమించి తద్వారా జ్ఞానాన్ని , ఐశ్వర్యాన్ని పొందమని శ్రీ దేవీభాగవతం చెబుతున్నది.


మంత్ర ప్రయాగం - ఫలితం:

ఈ మంత్రం ప్రతి శుక్రవారం , మంగళవారము , ఆదివారాలలో 108 పర్యాయాలు ఆడ ,మగ జపిస్తే భార్యా భర్తల లో ఐకమత్యం ఉంటుంది.విడిపోరు.భార్యని గౌరవించడం అంటే ఏమిటో పురుషుడికి నేర్పుతుంది. భార్యని గౌరవించడం వల్ల సంఘంలో గౌరవం , ధనము వస్తాయి. ఇంటికి మారు రూపమే గృహిణి.

                      అటువంటి గృహిణి వల్ల మానవునికి ఎన్ని రకాల సౌఖ్యాలు రావాలో అవి అన్నీ ఇస్తుందిట ఈ నామం.అందుకని ఇది మహామంత్రంగా చెప్పారు.ద్రౌపదీ దేవి ఇది చేయటం వల్లే పంచపాండవులని ఒకే రకంగా  ప్రేమించి పరమ ప్రతివత అని పేరు తెచ్చుకుందిట.పాండవులు ఇది జపించడం వల్లే  ఏనాడూ ద్రౌపదికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడలేదు.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని , లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

గురు వ్యాఖ్యనం -33

 





ఓం శం షం సం శాంకర్యై నమః


శం కరోతి ఇతి శంకరః

శం అంటే సుఖము, శాంతి, ఆనందము.

జీవులకు సుఖమును శాంతిని ఇస్తాడు కనుక శివుడిని శంకరుడు అన్నారు.


ఆ శివుడి రూపంలో ఉంటుంది, శివుని అర్ధాంగి కనుక అమ్మను శాంకరి అన్నారు.

శాంకరి అంటే పార్వతీ అని ఒక అర్థం, శివుడి రూపంలో లయ కారకురాలై తిరుగుతుంది అని అర్థము.


అమ్మవారే బ్రహ్మ రూపంలో సృష్టిస్తుంది, విష్ణు రూపం లో పోషిస్తుంది, శివుడి రూపంలో లయం చేస్తుంది.

అందుకే  సృష్టి కర్త్రి బ్రహ్మరూపా  గోప్త్రి గోవింద రూపిణీ సంహారిణి రుద్రరూపా తిరోధాన కరీశ్వరి 

సదాశివానుగ్రహద అని పంచ కృత్యాలు చేస్తుంది అని లలితా సహస్రనామంలో చెప్పుకున్నాం.

శాంకరి అంటే అమ్మవారు శివుడి యొక్క అర్ధాంగిగా శివుడి రూపంలో విహరిస్తూ లయం చేస్తున్నది, అందరినీ తనలో కలిపేసుకుంటుంది. ఆ తల్లి అనుగ్రహం వుంటే సుఖముగా శరీరమును విడిచి పెడతాము, ఆ తల్లి అనుగ్రహం ఉంటే జీవితంలో సుఖముగా బతుకుతాము, ఆ తల్లి అనుగ్రహం ఉంటే జీవితంలో ఎన్ని చిక్కులు వచ్చినా మనసుకు అధైర్యము రాదు, శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది.

ఇవాళ కలియుగములో ఏ వ్యక్తిని కదిలించినా అశాంతి తప్ప నేను ప్రశాంతిగా ఉన్నాను అని ఎవరూ అనుకోవడం లేదు. దీనికి గల కారణం కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు. రుద్రాక్షలు, స్పటికాలు మొదలైనటువంటివి, దేవతలకు సంబంధించినవి అధిక లాభాలకు అమ్మితే అటువంటివారు కొంతకాలం పోయాక దారిద్ర్యం అనుభవిస్తారని చెప్పారు. ప్రారంభంలో కోట్లు వచ్చేస్తాయి.

 ఉదాహరణకు ₹100 రుద్రాక్షను 10 వేలకు అమ్మితే ఇలాంటి వాళ్ల వంశములు నాశనం అయిపోతాయి, ఇటువంటి పిచ్చి పనులు చేయకూడదు. కర్మకాలి ఇవన్నీ చేస్తున్నారు. భూలోకంలో పుట్టిన మానవులు డబ్బు కోసం కక్కుర్తిపడి కొన్ని పనులు చేస్తుంటారు, దేవతా సంబంధమైన వస్తువులను అధిక ధరలకు స్థాయికి మించి అమ్మితే అటువంటి వాళ్ళు మహా భయంకరమైన వేదన పొందుతూ చచ్చిపోతారు, లేదా పిల్లలతో ఇబ్బందులు వస్తాయి, అన్నదమ్ముల మధ్య తగాదాలు వస్తాయి. ఈ ఇబ్బందులు పోయి మనశ్శాంతితో సంతోషంగా ఉండాలంటే ఈ మంత్రము చేయండి అని సాక్షాత్తు హయగ్రీవుడు చెప్పాడు.

దేవ ద్రోహం వలనో, నాస్తికవాదం వలనో, లేదా ఇంకేమైనా చేయరాని పనులు వలనో అశాంతి పెరిగిపోతే ఇంటిలో తగాదాలు వస్తే అప్పుడు ఈ మంత్ర అనుష్ఠానము చేయండి.


మంత్ర ప్రయోగము ౼  ఫలితము:

 

నలభై ఒక్క (41) రోజుల పాటు ప్రతిరోజూ ఉదయము సూర్యోదయ సమయంలో బిల్వ పత్రములతో, తులసి దళములతో అమ్మవారి పటమును కానీ, విగ్రహమును కానీ పూజిస్తూ వెయ్యిసార్లు ఈ మంత్ర జపం చేస్తే భీకరమైన సంసార సాగరాన్ని దాటుతాడు, మహా భయంకరమైన కుటుంబ సంబంధ కలహాల నుంచి బయటపడతాడు, సుఖశాంతులు పొందగలుగుతాడు అంతటి గొప్ప మంత్రము ఇది.

జపము చేస్తున్నప్పుడు ఆసనం మీద నుంచి అస్సలు లేవకండి, ఫోన్లు వస్తే ఎత్తకండి, అన్నీ విడిచిపెట్టి ఏకాగ్ర చిత్తముతో, సమాహిత చిత్తులై భక్తిశ్రద్ధలతో చేస్తే తొందరగా ఫలితాన్ని ఇస్తుంది.

ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ చేయవచ్చు.  మధ్యలో అశుచి వచ్చినప్పుడు ఆపేసి మళ్లీ కొనసాగించవచ్చును. అనేక రకములైన అశాంతులను తొలగించి శాంతిని, శాశ్వత మైన బ్రహ్మానందాన్ని ఇచ్చే గొప్ప మంత్రము ఇది. పిల్లల వల్ల కానీ ఇంకొకళ్ళ వల్ల కానీ అశాంతి వచ్చినప్పుడు ఈ మంత్రమును చేసుకోండి.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

Wednesday, March 3, 2021

గురు వ్యాఖ్యనం-31






ఓం సుధా సాగర మధ్యస్థాయై నమః


సుధ అంటే అమృతము. సముద్రాలు చాలా ఉన్నాయి, అందులో సప్తసముద్రాలు అని మనము పిలుస్తున్నామే వాటిలో ఒకటి అమృత సముద్రము. శ్రీ మహావిష్ణువు క్షీర సాగరం లో ఉంటాడు, అమ్మవారు (అమృత సముద్రంలో ఉంటుంది) సుధా సాగరంలో ఉంటుంది. ఈ సుధా సాగర మధ్యలో ఉంటుంది అమ్మవారు.

పూర్వము మణిద్వీప వర్ణన చేసినప్పుడు, అందులో అన్ని లోకముల కంటే పైన ఒక సముద్రం ఉన్నదని, అది అమృత సముద్రము. ఈ సముద్రంలో భూలోకంలో ఉన్న సముద్రాలలో ఉండే ఉప్పు నీరు లాగా కాకుండా, ఆ సముద్రంలో అమృతమే జలం లాగా ఉంటుంది. ఆ అమృతం లోనుంచి కెరటాలు వస్తూ ఉంటాయి, ఆ కెరటాల లోని ఒక బిందువు మన నోట్లో పడితే వాడికి ఆనందము, ఆహ్లాదము, ఈ జనన మరణాదులు వుండవు అని చెప్పుకున్నాము.

కానీ అక్కడకు వెళ్ళలేరు, ఆ సముద్రము మధ్యలో 18 ప్రాకారములతో కూడిన ఒక అద్భుతమైన భవనము ఉన్నది, అదే చింతామణి గృహం లోని అమ్మ వారి నివాస స్థానము. అమ్మవారు ఆ మధ్యలో ఉంటుంది కనుక సుధా సాగర మధ్యస్థ అన్నారు. సుధా సాగరము మధ్యలో ఉన్న ద్వీపము, అది మణిద్వీపము, అది అమ్మవారి నివాస స్థానము.

సుధ అంటే అమృతము. అమృతము అని దానికి ఎందుకు పేరు వచ్చింది అంటే మృతము లేకుండా చేస్తుంది, ఎప్పటికీ మృతము కానిది, ఎప్పటికీ నాశనము లేనిది, నాశనము లేకుండా చేస్తుంది.

దేవతలకు అమరులు అని ఎందుకు పేరు వచ్చింది అంటే వాళ్లు అమృతము తాగడం వలన వారికి జరామరణాలు ఉండవు అంటే ముసలితనము ఉండదు, రోగాలు ఉండవు, చావు ఉండదు. జరామరణ రోగాలు ఉండవు కనుక వారిని అమరులు అంటారు.

మానవుడు కూడా అకాల మరణ బాధ లేకుండా, మృత్యు భయం లేకుండా, తనను తాను రక్షించుకోవడానికి ఇది ఒక గొప్ప మంత్రముగా చెప్పారు.

మహానుభావుడు మార్కండేయుడు లాంటివాళ్ళు, హరిశ్చంద్రుడి కుమారుడు చచ్చిపోయిన లోహితుడు వంటి వాళ్ళు చచ్చి బతికారు.

రేపోమాపో చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు బ్రతికి శాశ్వతంగా చిరజీవులు అయ్యారు, చిరాయుర్దాయం పొందారు. ఒక్క మార్కండేయుడు లాంటి వాళ్లేంటి, ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు.

అగ్నిహోత్రుడు కూడా చచ్చిపోయి మళ్ళీ బతికిన వాడే. విశ్వానరుడు అనే ఆయనకు వైశ్వానరుడుగా పుట్టి ఆయనను ఒక మొసలి ఎత్తుకుపోతే కూడా ఆయన బ్రతికాడు.

ఇలా ఒకళ్ళు కాదు చాలా మంది మహానుభావులు రేపోమాపో చచ్చిపోతారు అనుకున్న వాళ్ళు ఈ మహా మంత్ర అనుష్ఠానం వల్ల కాలాన్ని జయించి చిరంజీవులు అయ్యారు.

ఇలాగ మానవులకు అకాల మరణం లేకుండా కాపాడే ఒక అద్భుతమైన మంత్రము ఇది.


మంత్ర ప్రయోగము ౼  ఫలితము:


1) ఆరు నెలల పాటు ఏకధాటిగా ప్రతి మంగళవారం 1008 సార్లు ఈ మంత్రమును జపించండి.

 మందార పుష్పాలు, గులాబీ పుష్పాలు, పాటలీ పుష్పాల వంటి ఎర్రని పుష్పాలను అమ్మవారి పూజకు ఉపయోగించండి. ఈ విధముగా ఎర్రని పుష్పములతో అమ్మవారిని పూజిస్తూ ఆరు నెలల పాటు ఏకధాటిగా ప్రతి మంగళవారం విడిచిపెట్టకుండా 1008 సార్లు ఈ మంత్రమును జపము చేయండి, అలా చేస్తే అటువంటి వాడికి అకాల మరణ భయం తొలగిపోతుంది.

కాకపోతే మంగళవారము పూజించండి.

2)  కార్యసిద్ధికి కూడా ఇది గొప్ప మంత్రము అని చెప్పారు..

ఇంతకుమునుపటి లాగే అమ్మవారి పటమును కానీ, రూపును కానీ పెట్టుకోండి. ఇంతకుముందు అకాల మరణ భయం తోలగడం కోసం మంగళవారం చేయమన్నాను కానీ కార్యసిద్ధి కోసం ఇప్పుడు ఆరు నెలల పాటు ప్రతి బుధవారం ఎర్రని పుష్పములతో అమ్మను పూజిస్తూ 1008 సార్లు ఈ మంత్ర జపము చేస్తే వాడికి కార్యసిద్ధి అవుతుంది.

కొంతమందికి దరిద్ర జాతకాలు ఉంటాయి, ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసినా, ఎన్ని సత్కర్మాచరణలు చేసినా వారికి మాత్రం పనులు అవ్వవు, ఏదో పూర్వకర్మ ఉంటుంది. ఒక్కొక్కడు అడుగుపెడితే ఆ ప్రదేశము సర్వనాశనం అవుతుంది.

అటువంటి వాడు తానూ మరియు వ్యవస్థ నాశనం కాకుండా లోక శ్రేయస్సు కోసం ఈ మంత్రం అనుష్ఠానం చేస్తే కార్యసిద్ధి అవుతుంది.

ఉదాహరణకు ఒక్కొక్కడు ఉద్యోగంలో అడుగుపెట్టగానే ఆ కంపెనీనే ఎత్తేస్తారు, దానికి కారణము ఏదో తెలియని ఒక జాతక దోషము వున్నది. ఆ దోషమును తొలగించి కార్య సిద్ధిని కలిగించే గొప్ప మహా మంత్రము ఇది.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

గురు వ్యాఖ్యనం-30






ఓం చింతామణి గృహాంతస్థాయై నమః


అమ్మవారు చింతామణి గృహమునందు ఉండునది. స్థ అంటే ఉండునది అని అర్థము. పుంలింగం లో అయితే గృహస్థః అంటాము, అదే స్త్రీ లింగం లో అయితే గృహస్థా అంటాము. గృహస్థా అంటే గృహములో ఉండునది, ఏ గృహములో ఉంటుంది అంటే చింతామణి గృహం. అమ్మవారు చింతామణి అని పేరు కలిగిన ఒక అద్భుతమైన గృహము నందు ఉండునది. చింతామణి గృహము అంటే అంతరార్థము ఏమిటంటే మణులలో చింతామణి అని కొన్ని మణులు ఉన్నాయి, ఈ మణులతో తాపడం చేయబడిన గృహములో ఉంటుంది అమ్మవారు.

పూర్వము దేవదానవులు పాలసముద్రమును చిలికితే అందులో నుంచి ఒక చింతామణి పుట్టింది, ఈ మణికి నమస్కారము చేసి చేతిలో పట్టుకొని ఏ వస్తువు అడిగితే అది ఇస్తుంది. చింతించుట అంటే కోరుకొనుట, ఆలోచించుట. ఆలోచించీ ఆలోచించగానే, కోరీ కోరగానే ఏ వస్తువు అడిగితే దానిని ఇస్తోంది కనుక చింతామణి అన్నారు.

కోరిన కోరికలను అయ్యో ఇంత ఎక్కువ కోరుతున్నాడు లేదా తక్కువ కోరుతున్నాడు అని ఆలోచించకుండా కోరిక కోరగానే ఆ కోరికలను తీరుస్తోంది కనుక (అది కూడా పవిత్రమైన కోరికలను మళ్లీ అపవిత్రమైన లోక నాశనకరమైన కోరికలు కోరుకోకూడదు) ఆ మణిని చింతామణి అన్నారు.

పాలసముద్రము నుంచి పుట్టిన ఒక్క చింతామణి దేవతల దగ్గర ఉంటేనే, దేవతల కోరికలు తీరిపోతాయి. అలాంటిది అమ్మవారు ఇల్లునంతా చింతామణులతో నిర్మించుకున్నది, అనగా అమ్మ వారి కంటే గొప్పగా కోరికలు తీర్చే వారు మరొకరు లేరు.

అమ్మవారు ఎన్ని చింతామణులను సృష్టించి ఉంటుందో, అన్ని రకములైన చింతామణులతో తాపడం చేయబడిన, చింతామణి ఖచితమైన గృహములో అమ్మవారు ఉంటున్నది.

అమ్మవారు చింతామణులను సృష్టించింది కనుక అమ్మవారు ఉండేది చింతామణుల మధ్యలో కనుక అమ్మవారి గురించి ఆలోచించగానే కోరికలు తీరకుండా ఎలా ఉంటాయి.


మంత్ర ప్రయోగము ౼  ఫలితము:


సొంత ఇల్లు కట్టుకోవాలి అని కోరుకున్న వాళ్లు  శనివారము, ఆదివారము, సోమవారము ఈ మూడు రోజులు విడిచిపెట్టకుండా ఆరు నెలల పాటు ఈ మూడు రోజులు ప్రతిరోజూ 1008 చొప్పున ఈ మంత్ర జపము చెయ్యండి, తులసీ దళములతో అమ్మవారిని పూజిస్తూ అర్చన చేయండి.

ప్రతి వారములోనూ వచ్చే శనివారము, ఆదివారము, సోమవారాలలో ఓం చింతామణి గృహాంతస్థాయై నమః అనే మంత్ర జపం చేస్తూ అమ్మను తులసీ దళములతో పూజ చేయండి.

కొంతమందికి దౌర్భాగ్య జాతకాలు ఉంటాయి, వాళ్ళు యావజ్జీవితం కష్టపడినా స్వగృహ ప్రాప్తి ఉండదు. అలాంటి వాళ్లకు కూడా స్వగృహ ప్రాప్తిని కలిగించే మహా మంత్రము ఇది.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...